ఆంధ్రజ్యోతి.. అబద్దాల ఎడిటోరియల్..!

ఆంధ్రజ్యోతి..

ఒక పత్రిక ఉద్దేశం.. అది ఎవరి వైపు ఉందో తెలియజేసేది పత్రిక మొదటి పేజీ కాదు. ఆ పత్రిక ఎడిటోరియల్ మాత్రమే. ఫ్రంట్ పేజీలో ఏమి వేసుకున్నా, రాసుకున్నా అది పెద్ద విషయమేమీ కాదు కానీ.. ఎడిటోరియల్ పేజీలో రాసుకునే విషయాన్ని మాత్రం ఆ పత్రిక ధోరణి అని అందరూ నిర్థారించుకుంటారు. గత మూడు రోజులుగా మన్యంలో జరుగుతున్న పరిణామాలపై, ఘటనలపై ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు ప్రచురించిన ఎడిటోరియల్ ఏకపక్షంగానూ.. ఒక పక్షాన్ని బలంగా సమర్థించేదిగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎస్ఏ డేవిడ్ తన సోషల్ మీడియా వాల్‌పై కూలంకషంగా వివరించారు. అది యధాతథంగా...
--------------------------------------------------------------------------------------

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును, మాజీ ఎమ్మెల్యే సోమును మావోయిస్టుల హత్య చేశారని వార్తలు చూస్తున్నాం..సహజంగానే రాజకీయ పార్టీల నుండి ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీనుండి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఖండనలు. బాధిత కుటుంబానికి సానుభూతి ప్రకటనలు వస్తున్నాయి.

పనిలో పనిగా వార్త పత్రికలు, టీవీలు తమ వార్తలను వండీ వారుస్తున్నాయి.. అధికార తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాయడంలో ఎప్పుడూ ముందుండే ఆంధ్రజ్యోతి పత్రిక ఒకడుగు ముందుకు వేసి ʹమన్యంలో ఘాతకంʹ అంటూ ఎడిటోరియల్ రాసి తన గురుభక్తిని చాటుకుంది.

తమ అభిప్రాయాలను, భావాలను వ్యక్తికరించే స్వేచ్ఛ వ్యక్తికైనా, సంస్థ కైనా ఒకే రకంగా ఉంటుంది. దాన్ని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.. కానీ దాని పేర నిజాలను దాచిపెట్టి ఏది పడితే అది రాయడం భావ్యం కాదు. అలాంటి పని ప్రజల వైపు ఉండాల్సిన పత్రికలు అసలే చేయకుడదు..కానీ ఆపనిని ఆంధ్రజ్యోతి విజయవంతంగా చేస్తుంది..

ʹమన్యంలో ఘాతకంʹ అంటూ రాసిన ఈ ఎడిటోరియల్ లో ఘటనను ఖండిస్తూనే.."గత కొంతకాలంగా స్థానికంగా ఆందోళన కార్యక్రమాలు సాగుతూ, విచారణ కమిటీ కూడ క్వారీ నిర్వహణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ హత్యజరిగింది అంటూ రాసుకొచ్చారు"..వాస్తవానికి ఇది అబద్దం..అక్కడ ఈ ఘటన జరగడానికి ముందు రోజు వరకు కూడ అక్కడి ప్రజలు ఈ క్వారీలు, బాక్సైట్ నిక్షేపాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు.. ఆందోళన చేస్తున్న ప్రజలపై అక్కడి పోలీసులను ఉసిగొల్పి గ్రామస్తులను భయాందోళనకు గురిచేశారు..హుకుంపేట మండలంలోని గూడ గ్రామస్తులు ఈ పోలీసు బెదిరింపులను లెక్కచేయకుండా నేటికి తన ఆందోళన చేస్తుంటే ఆంధ్రజ్యోతి మాత్రం విచారణ కమిటీ దీనికి అనుకూలంగా నివేదిక ఇచ్చిందని తప్పుడు వార్తను రాయడం భావ్యం కాదు.

ప్రభుత్వాలకు, పోలీసు వ్యవస్థను భయపడి నివేదిక వాళ్లకు అనుకూలంగా ఇచ్చినా కూడ ప్రజా ఆందోళన ఎటువైపు ఉంది అనేది ఆంధ్రజ్యోతి పరిగణలోనికి తీసుకోవాలి కానీ ఇలా ఏకపక్షంగా తప్పుడు వార్తలను సృష్టించడం భావ్యం కాదు.

ఇవాళ హత్య గావించబడ్డ ఎమ్మెల్యే కిడారి సర్వేేశ్వర రావు కాంగ్రెస్, తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకిి, వారి విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిండు. అరకు నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో అనేక గ్రామాల్లో సభలు నిర్వహించి ఈ బాక్సైట్ కు వ్యతిరేకంగా పోరాడుతానని హామీ ఇచ్చాడు.. బాక్సైట్ తవ్వకాలు కొనసాగితే ఇక్కడ కురిసే ప్రతి నీటిబొట్టు విషతుల్య మౌతుందని, 21 నదులు కులుషితమవుతాయని ʹఅరకుʹ మాత్రమే కాకుండా విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు సహితం ప్రమాదంలో చిక్కుకుంటాయని జగన్ మోహన్ రెడ్డి సాక్షిగా ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను నమ్మించాడు..వారి ఓట్లతో గెలిచిన వ్యక్తి రెండేండ్లు తిరక్కుండానే అధికార పక్షం వంచన చేరి ఇచ్చిన హామీలనే తూట్లు పొడుస్తుంటే వీటి గురించి ఏమి రాయదు ఈ పత్రిక..!

నిన్నటికి నిన్న మన్యంలో విష జ్వరాలతో పదుల సంఖ్యలో ఆదివాసులు మృత్యువాత పడితే ఈ ఎమ్యెల్యే గారు అన్నమాట ఏంటో తెలుసా ʹ లక్షలాదిమంది ఉండే దగ్గర 40, 50 మంది చనిపోవడం చాలా సహజం. అయినా విశాఖపట్నం లో ఎవరూ చనిపోవడం లేదా ఏంటి అని...! అంతమంది మరణాల పట్ల అంత చులకన భావంతో ఉన్న వ్యక్తి చనిపోతే పత్రికలన్ని పోటీలు పడి మరీ ఫ్రంట్ పేజీ కథనాలు ప్రచురిస్తున్నాయి..ఓహో ఎవరీ చావులన్నా ఒకటే అంటారా...? మరీ ఆ ఆదివాసీ మరణాల గురించి చూపించండి ఒక్కటంటే ఒక్క కథనం..బ్యానర్ ఐటం మీ మీ పత్రికల్లో..?

మీ మీ ప్రాంతంలోని సంగతేమో కానీ, తెలంగాణ లో కాళోజీ అనే కవి ఒక మంచి మాట చెప్పాడు ప్రాంతేతరుడు దోపిడి చేస్తే ప్రాంతందాకా తరిమికొడదాం, ప్రాంతంవాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేద్దాం...ʹ అని..బహుశా ఈ మాటలు అమలులో పెట్టారేమో అక్కడి వాళ్ళు.. ఎవరికి తెలుసూ...!?

Keywords : araku, mla, murder, maoists, andhrajyothy, editorial, అరకు, ఎమ్మెల్యే, మావోయిస్టులు, ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్, అబద్దాలు
(2024-03-10 14:09:46)



No. of visitors : 2775

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆంధ్రజ్యోతి..