ఏబీవీపీ తిక్క కుదిర్చిన కాలేజీ ప్రొఫెసర్.. కాళ్లు మొక్కి మరీ బుద్ది చెప్పాడు

ఏబీవీపీ

ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. జేఎన్‌యూ ఓటమితో అలజడి సృష్టించిన ఆ సంఘ కార్యకర్తలు.. ఇప్పుడు ఏకంగా అధ్యాపకులనే టార్గెట్ చేసుకున్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ గురువులను అవమానాలపాలు చేస్తున్నారు. వీరి వేధింపులు తాళలేక ఒక అధ్యాపకుడు ఇచ్చిన ఝలక్‌కు ఏం చేయాలో తెలియక సంఘటన ప్రాంతం నుంచి పారిపోయారు. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని మాందసోర్‌లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో దినేష్ గుప్త అనే వ్యక్తి అధ్యాపకునిగా పని చేస్తున్నాడు. గురువారం నాడు కళాశాలలో పాఠాలు చెబుతుండగా ఏబీవీపీకి జిల్లా అధ్యక్షుడు పవన్ శర్మ నాయకత్వంలో కార్యకర్తలు కొందరు తరగతి గది వద్దకు వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని.. ఆలస్యం ఎందుకు అవుతున్నాయంటూ గట్టిగా నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ విషయం క్లాస్ పూర్తయిన తర్వాత మాట్లాడుకుందా.. ఇప్పుడు తరగతిని డిస్ట్రబ్ చేయవద్దని ఆయన కోరారు. దీంతో భారత్‌ మాతాకీ జై, వందేమాతరం స్లోగన్‌లనే అడ్డుకుంటారా.. దినేశ్‌ గుప్తా దేశ ద్రోహి అంటూ స్లోగన్‌లు ఇవ్వడం ప్రారంభించారు. పరిస్థితి గమనించి ప్రిన్సిపల్ రవీంద్ర సోహానీ అక్కడకు వచ్చి వారికి సర్థిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దేశ ద్రోహీ.. దేశద్రోహీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూనే.. తమకు దినేష్ గుప్త క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనకు దిగారు.

అయితే తాను ఏ తప్పూ చేయక పోయినా దేశద్రోహి అనడమేంటని దినేష్ గుప్త క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. అయినా ఏబీవీపీ కార్యకర్తలు క్షమాపణలు చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో కోపోద్రిక్తుడైన దినేష్ గుప్తా.. కాలేజీ క్యాంపస్‌లోనే విద్యార్థులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నారు. వెంటపడి మరీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటన తర్వాత దినేష్ గుప్త మాట్లాడుతూ ʹనిరసన పేరుతో నా తరగతికి ఏబీవీపీ విద్యార్థులు అడ్డుతగిలారు. వాళ్లు నన్ను దేశ ద్రోహి అంటూ స్లోగన్‌లు ఇచ్చారు. నన్ను క్షమాణ చెప్పాలని కోరారు. నా తప్పు లేకపోయినా వాళ్లు నన్ను టార్గెట్ చేసుకున్నారు. వాళ్లకు బుద్ది చెప్పాలనే నేను వాళ్ల కాళ్ల మొక్కా. ఈ క్యాంపస్‌లో గత 32 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. వారికన్నా నాకే దేశభక్తి ఎక్కువ. దేశభక్తిని ఒకరికి చూపించాల్సిన అవసరం నాకు లేదు. విద్యార్థులు బాగా చదువుకోవాలనే నేను కోరుతున్నా. చదువుకుంటేనే జీవితం బాగుంటుంది. వాళ్లపై చర్యలు తీసుకోవాలని నేను అనుకోవడం లేదుʹ అని అన్నారు.

Keywords : దినేష్ గుప్తా, మధ్యప్రదేశ్, మాందసోర్, రాజీవ్ గాంధీ కళాశాల, ఏబీవీపీ కార్యకర్తలు, dinesh gupta, madhya pradesh, mandasore, abvp
(2024-04-14 03:04:21)



No. of visitors : 1411

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఏబీవీపీ