include 'men';
?>
దళితుల్ని, ఆదివాసీలనే చంపుతారా?
అరకు ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపగానే ఎక్కడలేని ʹఅస్తిత్వంʹ తన్నుకుని వచ్చి పై ప్రశ్న వేసింది. మొన్నటి దాకా ఇవే గొంతులు అధికారంలోకి వచ్చాక దళితులకు ద్రోహం చేసే ʹదళితʹ ప్రజా ప్రతినిధులను తన్నాలి, సంపాలి, నరకాలి అని అన్న మాటలూ విన్నాను. మరి మావోయిస్టులు ఇప్పుడు చేసింది అదే కదా!
ఇంతకీ ఈ ఆదివాసీ (తెగకు) ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటి? ఆదివాసీలు అరకు ప్రాంతంలో గ్రానైట్ క్వారీలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈ ఎమ్మెల్యే ఎవరి పక్షం ఉన్నాడు? కాస్త బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ ఆదివాసీ ఎమ్మెల్యే కథలు అన్నీ. అతడు రెండు క్వారీలకు సొంతదారుడు. ʹపాడేరు చౌరస్తాలో నాలుగు బిల్డింగ్ లు కట్టుకున్న వ్యక్తి. లీజు ఒప్పందం అయిపోయినా క్వారీలు నడుపగలిగిన వాడుʹ (ఈ మాటలు డేవిడ్ వి), తన సమూహం చేతనే వెట్టి చేయించుకోగల సమర్ధుడు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయించిన వాడు. అయినా కొందరి దృష్టిలో అతడిప్పుడు పేద ఆదివాసీ. సొంత జాతిని ధ్వంసం చేస్తున్న అభివృద్ధి నమూనాను మోసుకు తిరుగుతూ, ఆ విధ్వంసంలో భాగమైనవాన్ని ఇంకా అమాయక ఆదివాసీ అనే అంటున్నారు అస్తిత్వం పొడుచుకు వచ్చినవారు. ఈ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి నుండి గెలిచి టీడీపీ ని తిట్టాడు. బాక్సైట్ ను ఎట్టి పరిస్థితుల్లో తవ్వనిచ్చేది లేదని శపథం పునాడు. మధ్యలో టీడీపీ లోకి జంప్ అయ్యాకా శపధాలు మర్చిపోయి యథేచ్ఛగా బాక్సైట్ తవ్వకాలకు మద్దతుదారుడయ్యాడు. స్వయంగా అనంతగిరి, హుకుంపేట మండలాల్లో రెండు క్వారీలకు యజమాని అయ్యాడు. అందులో లాటరైట్, బాక్సైట్, బ్లాక్ మెటల్ తవ్వకాలు చేస్తున్నాడు. అయినా అతడ్నీ నిరుపేద అమాయక ఆదివాసీ అనాలి అంటే అనలేనూ క్షమించండి. అతడిని ఆదివాసీ అని ʹపౌర సమాజంʹ అంటున్నా అక్కడి ఆదివాసీ సమూహనికి మాత్రం అతడో ద్రోహి.
చంపడం సరైనదా! కాదా! అని చర్చ విప్లవోద్యమం మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నది. "మేం చంపడం కోసమే పోరాటం చేయటం లేదు. మేం వ్యవసాయం చేస్తున్నాం. అందులో కలుపుమొక్కల్ని ఏరివేస్తాం. మాది వ్యవసాయక విప్లవం." అన్నాడు కొండపల్లి సీతారామయ్య. మరీ ఎందుకని దళిత, ఆదివాసీ నాయకులనే టార్గెట్ చేస్తారు అనే చర్చా ఉన్నది. నిన్న ఒక మిత్రుడు ʹలోకేశంʹ కోసగోటిని తాకే దమ్మున్నదా అన్నాడు. (ఈ ప్రశ్నలకు సమాధానం మావోయిస్టు పార్టీ మాత్రమే చెప్పగలదు)
అయితే నాదో ప్రశ్న ఈ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని చంపినందుకు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యే ఉంటుంది. అందులో రామకృష్ణతో సహా మరికొందరి పేర్లు నిందితులుగా చేర్చే ఉంటారు. చంపడం ఇండియా శిక్షా స్మృతి ప్రకారం నేరం కనుక అట్లా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడంలో వింత/కొత్తేమి లేదు. దేశ పౌరులందరూ సమానమే రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతున్నది. రాజ్యాంగం/చట్టాల పట్ల విశ్వాసం ఉన్నా లేకున్నా రాజ్యాంగ, చట్టపరమైన హక్కులు పౌరులందరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. పోలీసులు కూడా ఇలాగే చుట్టుముట్టి మావోయిస్టుల పేరుమీదో/ తీవ్రవాదుల పేరుమీద చంపినపుడు ఒక ఎఫ్ ఐ ఆర్ ఇలానే ఎందుకు రిజిస్టర్ చెయ్యరు అనేది ప్రశ్న.
మావోయిస్టులు అయినంత మాత్రాన చంపే హక్కు పోలీసులకు లేదు, వాళ్ళని నేరస్తులని భావిస్తే అరెస్టు చేసి శిక్షించవచ్చు. గతంలో ఆంధ్రప్రదేశ్ హై కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ʹఎన్ కౌంటర్ ఘటనల్లో ఐపిసి 302 కింద కేసులు పెట్టాలని తీర్పు ఇచ్చిందిʹ దానిపై ʹపోలీసు అధికారుల సంఘంʹ సుప్రీంకోర్టు కి పోతే ʹఏకవాక్యంలో స్టే ఇచ్చిందిʹ. మావోయిస్టులపై ఎమ్మెల్యేను చంపినందుకు కేసులు పెట్టినట్లుగానే మావోయిస్టులను చంపిన పోలీసులపై కేసులు పెట్టమనడం ఏమి చట్ట వ్యతిరేకం కాదు. పైగా అది హక్కు.
మీడియాను పిలిచి పబ్లిక్ గా ఎన్ కౌంటర్ చేస్తున్న కాలంలో ఈ డిమాండ్ అవసరం. ఎవర్నైనా ఇంట్లోంచి తీసుకుపోయి ఎన్ కౌంటర్ కథలు అల్లడం రాజ్యానికి కొత్తకాదు. ఆస్తిత్వంలో లేని పౌర సమాజం ఎప్పుడూ మానిఫాక్చరింగ్ కాన్సెన్ట్ కు గురి అవుతూనే ఉంటుంది. ఇంటల్జెన్షియా గోర్కీ అన్నట్లు ʹపాలకుల ఉన్ని బట్టల మీద పడిన పీడితుల నెత్తుటి మరకల్ని మాయం చేసేందుకు తెల్లని రంగు వేయడంలో నిమగ్నం అయి ఉన్నదిʹ.
చివరి నుండి మళ్ళీ మొదటికే వచ్చి ముగిస్తాను. సోవియట్ కమ్యూనిస్టు పార్టీ అట్టడుగున ఉన్నవారిని పార్టీ ప్రధాన నాయకత్వంలోకి తీసుకువచ్చే ప్రయత్నం ఒకటి చేసిందని విన్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా చెప్పులు కుట్టుకునే కుటుంబం నుండి స్టాలిన్ అనబడు జుగాష్ వీలీ సోవియట్ అధ్యక్షుడు అయ్యాడు. అట్లానే వచ్చినవాడు ఇంకొకడు ఉన్నాడు అతడు ʹగోర్భచెవ్ʹ. ఇద్దరు అదే నేపథ్యం కలవారు అని స్టాలిన్ చెంత గోర్భచెవ్ ని కూర్చోబెట్టలేను మన్నించండి.
- అరుణాంక్
సోర్స్ : జనంసాక్షి
Keywords : ఎమ్మెల్యే హత్య, మావోయిస్టులు, అరకు ఎమ్మెల్యే, చట్టం, పోలీసులు, ఎన్కౌంటర్, mla murder, maoists, araku, police, encounter
(2024-03-24 06:15:24)
No. of visitors : 2435
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..