70వేల మంది రైతులపై పోలీసుల అరాచకం.. బాష్పవాయు గోళాలు.. వాటర్ క్యానన్‌ల ప్రయోగం.. వందలాది మందికి గాయాలు

70వేల

దాదాపు 70 వేల మంది రైతులు ఎంతో శాంతియుతంగా తమ డిమాండ్ల సాధన కోసం ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్ నుంచి పది రోజుల క్రితం ప్రారంభించి మహాపాదయాత్రగా తరలి వస్తున్నారు. రుణమాఫీ చేయాలని, ఉచిత విద్యుత్ అందించాలని కోరుతూ ʹకిసాన్ క్రాంతి ర్యాలీʹ పేరుతో ఢిల్లీలోని కిసాన్ ఘా‌ట్‌కు ట్రాక్టర్లు, ట్రాలీలు, బండ్లు, నడుస్తూ వస్తున్న వీరు ఈ రోజు ఢిల్లీలో ప్రవేశించాల్సి ఉంది. అయితే వీరి రాకను ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి రైతులు రాజధానిలోకి రాకుండా ఢిల్లీ-యూపీ సరిహద్దులో నిలిపేశారు. మేం శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తున్నాం.. గత పది రోజులుగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగులేదు కదా మమ్మల్ని వెళ్లనీయండీ అంటూ భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు పోలీసులను కోరారు. అయినా సరే పోలీసులు వారిని అనుమతించలేదు. కొంత మంది రైతులు ట్రాక్టర్లతో బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ మొదలు పెట్టారు. అక్కడి నుంచి వెంటనే వెనుదిరగమంటూ వాటర్ కానాన్‌లతో వారిని చెదరగొట్టారు. ఇష్టానుసారంగా భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లే గన్లు పట్టుకొని బెదిరించడం గమనార్హం.

పోలీసుల దౌర్జన్యానికి వందలాది మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు విరిగిపోయి.. ఒళ్లంతా గాయాలతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇంత జరుగుతున్న పోలీసులు లాఠీచార్జి ఆపలేదు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కూడా వారిని అడ్డుకోవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేసినా రైతులను మాత్రం అనుమతించలేదు. ఈ ఘటన తర్వాత బీకేయూ నేత నరేష్ మాట్లాడుతూ..ʹమమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆపారు? మేము క్రమశిక్షణతో శాంతయుతంగా నిరసన ర్యాలీ చేస్తున్నాం. మా సమస్యల గురించి ప్రభుత్వానికి కాకుండా ఎవరికి చెప్పాలి? పాకిస్థాన్‌కో లేదా బంగ్లాదేశ్‌కో వెళ్లిపోవాలా?ʹ అని ఆవేశంగా అన్నారు. కనీస మద్దతు ధర, డీజిల్ ధరల తగ్గింపు, ట్రాక్టర్లను కమర్షియల్ జాబితా నుంచి తొలగింపు, రుణమాఫీల గురించి అడిగినందుకే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని గత పది రోజులుగా ర్యాలీలో పాల్గొన్న ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

శాంతియుతంగా తమ హక్కులు, డిమాండ్ల కోసం పాదయాత్ర చేసి ఢిల్లీ వరకు తమ ఆవేదన తెలియజేయాలనుకున్న రైతులపై పోలీసులు, ప్రభుత్వం చేసిన దౌర్జన్యం, దాడిని ʹఅవని న్యూస్ʹ తీవ్రంగా ఖండిస్తోంది.


Keywords : కిసాన్ క్రాంతి ర్యాలీ, రైతులు, ఢిల్లీ, లాఠీ చార్జి, ఢిల్లీ పోలీసులు, kisan kranti rally, farmers, delhi, police, lathi charge,
(2024-03-29 20:52:09)



No. of visitors : 2064

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


70వేల