ప్రభుత్వమే అసలైన కుట్రదారు
కామ్రేడ్ వరవరరావును వెంటనే విడుదల చేయాలి.
రచయితలు, మేధావులు కుట్రదారులు కారు. ప్రభుత్వమే అసలైన కుట్రదారు
విరసం వ్యవస్థాపక సభ్యుడు, అరవై ఏళ్ల సామాజిక ఆచరణ కలిగిన మేధావి, రచయిత, దేశమంతా ఎరిగిన విప్లవ కవి వరవరరావును, మరో నలుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు సుధాభరద్వాజ్, గౌతమ్ నవలఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరేరాలతో పాటు ప్రధాన మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న హాస్యాస్పద ఆరోపణలతో దుర్మార్గమైన ఊపా చట్టం కింద నిర్బంధించడం ఈ దేశ ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. రచయితలు, పౌరహక్కుల కార్యకర్తల మీద ఇటువంటి ఆరోపణ ప్రపంచంలోనే ఎవరూ చేసుండరు. ఆ ఘనత మన ఫాసిస్టు మోదీ ప్రభుత్వానికే దక్కింది.
రెండున్నర నెలల గృహనిర్బంధం తర్వాత ఇవాళ అత్యంత దుర్భరమైన పూణే జైలుకు కామ్రేడ్ వరవరరావును తరలించారు. 78 ఎనిమిది సంవత్సరాల వయసు, అనారోగ్యం ఉన్న వ్యక్తిని ఈ చలికాలం ఏ వసతుల్లేని కారాగారంలో పడేసేంతగా రాజ్యం ఎందుకు కక్ష గట్టింది? ఎన్ని కుట్ర ఆరోపణలు చేసినా కామ్రేడ్ వరవరరావు సుదీర్ఘ సామాజిక ఆచరణంతా బహిరంగమే. మూడున్నర దశాబ్దాల పాటు విద్యార్థులకు ప్రియమైన అధ్యాపకుడిగా, పాతికేళ్లకు పైగా తెలుగు సామాజిక సాహిత్య చరిత్రలో ప్రభావశీలంగా పనిచేసిన ఆధునిక సాహిత్య వేదిక ʹసృజనʹ సంపాదకుడిగా, తెలుగు సాహిత్య సాంస్కృతిక మేధో రంగాలను మలుపు తిప్పిన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరిగా, ప్రజాఉద్యమ స్వరంగా వరవరరావు అందరికీ తెలుసు. చలినెగళ్లు, జీవనాడి, ఊరేగింపు, స్వేచ్ఛ, సముద్రం, భవిష్యత్ చిత్రపటం, ముక్తకంఠం, ఆ రోజులు, ఉన్నదేదో ఉన్నట్లు, మౌనం యుద్ధనేరం, అంతస్సూత్రం, బీజభూమి వంటి కవితా సంపుటాలు, పాటలు ఆయన రచించారు. తెలంగాణ విమోచనోద్యమం- తెలుగు నవల, కల్పనా సాహిత్యం-వస్తువివేచన, సాహిత్యంలో సమాజ చలనపు ప్రతిఫలనం వంటి సాహిత్య విమర్శ గ్రంధాలు, మరెన్నో సామాజిక రాజకీయ వ్యాసాలు రాశారు, అనువాదాలు చేశారు. ఆయన సముద్రం దీర్ఘకవితలోని ఒక భాగాన్ని డా. బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ విద్యార్థులకు ఆధునిక కవితా విభాగంలో పాఠ్యాంశంగా పెట్టారు. వరవరరావు రచనలు ఇంగ్లీషు, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. కవిగా, విమర్శకుడిగా, సామాజిక వ్యాఖ్యాతగా, వక్తగా, పౌరహక్కుల కార్యకర్తగా కా.వివి తన శక్తినీ, మేధస్సునూ ప్రజల కోసమే వెచ్చిస్తున్నారు. ప్రభుత్వానికీ, నక్సలైట్ పార్టీలకు మధ్య రెండు సార్లు జరిగిన శాంతి చర్చల ప్రయత్నంలో ఆయన కృషి ఎంతగానో ఉంది. నిరంతరం ప్రజాజీవితంలో ఉంటూ తెలుగు సమాజాల్లోనే కాదు, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా తన సునిశిత విప్లవ దృక్పథంతో విశ్లేషిస్తారు. ఇంతటి సామాజిక జీవితం ఉన్న రచయితను దొంగ లేఖలు సృష్టించి ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణ కింద అరెస్టు చేయడం కన్నా దిగజారుడుతనం మరొకటి ఉండదు.
ఆగస్టు 28 నాడు వరవరరావుతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సామాజిక కార్యకర్తల ఇళ్ల మీద పూణే పోలీసులు అక్రమంగా దాడులు చేసి, సోదాలు జరిపి, అయిదుగురి మీద కుట్ర కేసులు బనాయించిన సందర్భంలో రొమిల్లా థాపర్ వంటి మేధావులు వెంటనే స్పందించి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా అరెస్టులను నిలిపివేసి వారిని గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. కానీ నెల రోజుల తర్వాత ఈ కేసులో సానుకూలంగా రావాల్సిన తీర్పు అనూహ్యంగా రాత్రికి రాత్రి మారిపోవడం వెనక ప్రభుత్వ కుట్రను ప్రజలందరూ గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో స్వయం ప్రతిపత్తితో ఉండాల్సిన వ్యవస్థలన్నింటి వెన్ను విరిచేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం తీర్పుల్లోనూ జోక్యం చేసుకొని తనవారిని కాపాడుకుంటూ, గిట్టనివారిని వేటాడి హింసిస్తున్నది. యూనివర్సిటీలు మొదలుకొని ఆర్.బి.ఐ, సి.బి.ఐ, న్యాయవ్యవస్థ, మొదలైన వాటన్నిటిని ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్థలుగా మార్చుకొని అడిగేవారెవరూ లేకుండా, ఇష్టారాజ్యం పాలన సాగిస్తున్న మోడీ రానున్న ఎన్నికల్లో మతపరమైన చిచ్చురేపి దేశాన్ని రావణకాష్టం చేయబోతున్నాడు. తన ఫాసిస్టు ధోరణికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గళమెత్తుతున్న వారు హత్యలకు, దాడులకు, బెదిరింపులకు గురవుతూ, చీకటి కారాగారాల్లోకి తోసివేయబడుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే వరవరరావు తదితరుల విషయంలో సుప్రీం కోర్టు, తదనంతరం,
కింది కోర్టులు వెలువరించిన తీర్పులను చూడాలి.
ఇవాళ సామాజిక కార్యకర్తలను ప్రమాదకర వ్యక్తులుగా చూపెడుతున్న ప్రభుత్వమే వాస్తవానికి ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా తయారైంది. దీనిని నిలదీసి నిలువరించడం మనందరి కర్తవ్యం. కనక ఈ అరెస్టులకు, చీకటి నిర్బంధాలకు వ్యతిరేకంగా గొంతు విప్పమని ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, రచయితలకు, మేధావులకు విరసం విజ్ఞప్తి చేస్తున్నది.
పాణి,
కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం
Keywords : varavararao, virasam, maoists, police, narendra modi, pune
(2024-03-10 14:10:13)
No. of visitors : 971
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |