శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం

శ్రీకాకుళం

(దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు రాసిన ఈ వ్యాసం వీక్షణం జనవరి సంచికలో ప్రచురించబడినది)

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా జైలు రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జైలని, ఖైదీల సంక్షేమానికి అనేక మౌలిక సదుపాయాలు కల్పించామని, పరిశుభ్రతకు మారుపేరని జైలు అధికారులు గొప్పగా చెప్పుకుంటారు. దీని వెనుక రిమాండ్‌ ఖైదీల కోసం ʹవంశధారʹ, ʹపూర్యʹ, ʹచంద్రʹ బ్లాక్‌లే గాక అన్నపూర్ణ బ్లాక్‌, వాటర్‌ ప్లాంట్‌, వీటిని మించి హిందుత్వాన్ని ఖైదీల్లో చొప్పించడానికి శ్రీకృష్ణుడి ఆలయం. పచ్చని చెట్లు, కాయగూరలు, కొబ్బరి, మామిడి జామ, దానిమ్మ, సపోట చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం మరోవైపు కనిపిస్తుంది. ఈ పండ్ల సంపదంతా జైలు అధికారులకే. పొరపాటున చిన్నకాయని ఖైదీలు తెంపినా వాళ్లని కొట్టి అదే చెట్టుకు కట్టేస్తారు.

శ్రీకాకుళం జిల్లా జైళ్లో 9 నెలల పాటు ఎటువంటి విచారణ లేకుండా మగ్గుతున్న ఆదివాసులు బిడిగి సురేష్‌ సన్నాఫ్‌ సుక్కు - ఒరిస్సా, ఆరికె రాజారావు సన్నాఫ్‌ బుడ్డయ్య - శ్రీకాకుళం జిల్లా, కెడ్రిక శివమాధవ్‌ సన్నాఫ్‌ సుక్కు - విజయనగర్‌ జిల్లా, బిడిగి సింగన్న సన్నాఫ్‌ సుంద్రో - శ్రీకాకుళం జిల్లా వివిధ జిల్లాలకు చెందిన ఆదివాసి యువకులపై అనేక రకాల కేసులు బనాయించి శ్రీకాకుళం జిల్లా జైళ్లో నిర్బంధించారు. కేసు వాయిదాలకు గాని కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఏమని ప్రశ్నించినా కేసు ఫైల్‌ కనిపించడం లేదని మాట దాటేస్తున్నారు. అమాయక ఆదివాసుల కేసులు విచారణ జరపకపోగా జైళ్లలో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఈ విధంగా దేశ వ్యాప్తంగా ఆదివాసులను అక్రమంగా అరెస్టులు చేసి సంవత్సరాల పాటు జైళ్లో నిర్బంధిస్తున్నారు. ఆదివాసులు ఏళ్ల తరబడి జైళ్లలోనే దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 2018 నవంబర్‌ 11న తిత్తిలీ తుఫాన్‌ బాధితులకు బియ్యం, బట్టలు పంచడానికి వచ్చిన ప్రజా సంఘాల నాయకుల్ని, మమ్మల్ని అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించడం జరిగింది. నవంబర్‌ 23 వరకు ఖైదీల మధ్య పడపడంతో అనేక విషయాలు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చాయి. ఇందులో వెట్టిచాకిరి, దౌర్జన్యం, బూతులే గాక అనేక మంది ఖైదీలపై అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలిసింది. పురుగులు పడ్డ అన్నం, నీళ్లతో మజ్జిగ, కూరలు ఖైదీలకు పెట్టడం జైలు అధికారులు ఒక విధానంగా పెట్టుకున్నారు. ఖైదీల కిచెన్‌ హాల్‌, అధికారుల కిచెన్‌ హాల్‌ వేరు వేరుగా ఉండడం వల్ల అధికారులకు రోజు విందు భోజనాలు, ఖైదీలకు మాత్రం పశువులు కూడా తినని ఆహారం పెడుతున్నారు. ఇంటర్య్వూ సమయంలో బంధువులు తెచ్చిన తినే వస్తువులు కూడా అడ్డగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీదెబ్బలే కాక, సింగిల్‌ లాకాప్‌లో మాగ్గాల్సిందే. జైళ్లో పేషెంట్లు సైతం స్వెట్టర్లు, చెప్పులు వేసుకోవడానికి అనుమతి లేదు. కాని అధికారులు మాత్రం దర్జాగా బూట్లు, ఖరీదైన సెట్టర్లు వేసుకొని జైళ్లో తిరగవచ్చు. ఖైదీలు ఉండే రూములు (బ్లాక్‌), లెట్రిన్‌, బాత్‌రూములు డెటాల్‌తో ప్రతిరోజు శుభ్రం చేసి, నీళ్లతో రూములు పరిశుభ్రం చేసి అంటువ్యాధులు, దోమలు రాకుండా చేసి తమ శ్రమతో రిమాండ్‌ ఖైదీలు జైలును శుభ్రంగా ఉంచుతున్నారు.

జైళ్లో పాఠశాల ఖైదీలకు చదువు చెప్పడం కాక మొక్కుబడిగా ఉంది. దాని వలన ఎవరికి ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు. జైళ్లో ఉన్న లైబ్రరీ పేరుకే గాని చదువుకోవడానికి ఎటువంటి పుస్తకాలుండవు. దినపత్రికలు అందించరు. బయటి మిత్రుల ద్వారా పుస్తకాలు తెప్పించు కోవడానికి అనుమతించరు. లీగల్‌ సెల్‌ సర్వీస్‌ అథారిటీ, మరికొందరు అధికారులు వచ్చినా ఖైదీలు తమ సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛలేదు. అధికారులకి వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి ఉపయోగం లేదు. ఇదంతా మొక్కుబడిగా జరిగే తంతు అని ఖైదీలు వాపోతున్నారు. చిన్న చిన్న నేర ఆరోపణలు చేయబడ్డ వాళ్లు, పేదలు ఎక్కువ సంఖ్యలో ఈ జైళ్లో మగ్గుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

నవంబర్‌ 23న తిత్తిలీ తుఫాన్‌ కుట్ర కేసులో కొందరు విడుదల కాగా, అప్పటికే వారం రోజులుగా మరో తిత్తిలీ తుఫాన్‌ కుట్ర కేసులో రిమాండ్‌ ఖైదుగా ఉన్న పి. దుర్యోధన, (పికెఎస్‌)తో పాటు ఎన్‌. వీరస్వామి (పిడిఎం), కె. వెంకటేష్‌ (పిడిఎం), కె. నీలకంఠు (పికెఎం) లను ఇరికించి పలాస కోర్టుకి వాయిదాకి తీసుకెళ్తూ ఇద్దరు, ఇద్దరు చొప్పున సంకెళ్లువేసి బంధించారు. ఖైదీలను స్పెషల్‌ బస్సులో కోర్టు వద్దకు గొలుసులతో తీసుకెళ్లి పరిసర ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. నిత్యం ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ ఉండే ప్రజా సంఘాల కార్యకర్తలకు ఈ విధంగా బేడీలువేసి వాయిదాలకు తీసుకురావడం అప్రజాస్వామికం. న్యాయ స్థానాల అనుమతి లేకుండా ఎవరికి బేడీలు వేయకూడదని సుప్రీంకోర్టు 1980 లోనే స్పష్టంగా తీర్పు ఇచ్చినా పోలీసులు దీనిని పరిగణలోనికి తీసుకోవడం లేదు. వ్యక్తికి సంకెళ్లు వేయడం, గొలుసులతో బంధించడం అంటే జంతుసమానంగా ప్రవర్తించడమేనని సుప్రీంకోర్టు గతంలోనే పేర్కొన్నది.

జైళ్లు అనేవి సంస్కరణ దిశగా కాకుండా శిక్షలకు నిలయాలుగా మారాయి. ఈ విధంగా జైళ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. జైళ్లలో ఎక్కడా జైల్‌ మ్యానువల్‌ అనుసరించి విచారణలో ఉన్న ఖైదులు అవసరాలు తీర్చడంలేదు. కొన్ని జైళ్లలో కెపాసిటీని మించి 3-4 రెట్లు ఎక్కువమంది ఖైదీలను ఉంచడం సర్వసాధారణం అయింది. రాజకీయ కనీసం డైరెక్ట్‌ ఇంటర్వ్యు శ్రీకాకుళం జిల్లా జైళ్లోలేవు. జైళ్లలో అక్రమ నిర్బంధాలు, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రజాస్వామివాదులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
- వై.వెంకటేశ్వర్లు, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ ప్రధాన కార్యదర్శి

Keywords : srikakulam, jail, prison, police, adivasi, tribal
(2024-04-13 11:11:36)



No. of visitors : 1391

Suggested Posts


50 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు!

1969, మే 27న మొట్టమొదటి బూటకపు ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఆరుగురు కామ్రేడ్స్ పంచాది కృష్ణ మూర్తి, తామాడ చినబాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాల్ రావు, రామచంద్ర ప్రధానో, నిరంజన్ సాహు, శృంగవరపు నర్సింహ మూర్తి అమరులయ్యారు.

చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు

సరిగ్గా యాబై సంవత్సరాల కింద ఈ రోజున శ్రీకాకుళ విప్లవోద్యమ నిర్మాతలు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసంలను పోలీసులు కాల్చిచంపారు.

రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే

సర్వం కోల్పోయిన ప్రజలను నిర్లక్ష్యంగా వాళ్ల చావుకు వాళ్లను వదిలేసింది. ప్రజాద్రోహానికి పాల్పడింది. మనం ప్రజల పక్షాన నిలబడదాం. ఇదే రాజద్రోహమయ్యేటట్లయితే అభ్యంతరమెందుకు..? రండి రాజద్రోహం చేద్దాం.

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మ గారు ఈరోజు (23-9-2020) రాత్రి 7 గం. కు విశాఖలో అమరులయ్యారు. ఆమె గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు.

సూదికొండను కాపాడుకుందాం - ప్రజల జీవించే హక్కుకై పోరాడ‌దాం

శ్రీకాకుళం జిల్లా పలాస, కాశిబుగ్గ జంటనగరాల జీవన సమతుల్యన్నీకాపాడుతున్న చారిత్రాత్మక భూభాగం సూదికొండ (నెమలికొండ) ను నాశనం చేస్తున్నారు పాలకులు. కొందరు పెద్దల లాభాల కోసం పర్యావరణాన్ని,

చెదరని విశ్వాసం... సడలని ఆచరణ... శ్రీకాకుళ పోరాట పంథాలో కా. చంద్రమ్మ

యాభై ఏళ్లుగా మడమ తిప్పని విప్లవాచరణకు ప్రతిరూపం కా. చంద్రమ్మ. విప్లవంలో ఆమె నిండు జీవితాన్ని గడపడం గర్వకారణం. కరోనా బారిన పడి అమరురాలు కావడం విషాదం. శ్రీకాకుళ పోరాట పంథాలో చంద్రమ్మ వెనుతిరిగి చూడలేదు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


శ్రీకాకుళం