కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి

కాగితం

(విప్లవరచయితల సంఘం సబ్యుడు కాశీం రాసిన ఈ వ్యాసం 14 జనవరి ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడినది)

వరవరరావు కవిగా ప్రజల పక్షం, అధ్యాపకుడిగా విద్యార్థుల పక్షం, చర్చల ప్రతినిధిగా విప్లవకారుల వైపు, రచయితగా పోరాడే ప్రజల వైపు, వక్తగా ప్రజల గొంతును విన్పించే ఉపన్యాసకుడు. ఏలికకు ఇది నచ్చలేదు. ʹనా వైపు నీవు లేవంటే
నా శత్రువుʹ అని ప్రకటించారు.

వరవరరావు కవిత్వాన్ని అంచనా వేయాలంటే ఐదు దశాబ్దాల చరిత్ర, రాజకీయార్థిక పరిణామాలు, సాంస్కృతిక మార్పులు తెలిసి ఉండాలి. అంతమాత్రమే కాదు, వాటి పట్ల అవగాహన ఉండాలి. ప్రతీ మార్పుకు కార్యకారణ సంబంధమేమిటో
తెలియాలి. అప్పుడే ఆయన కవిత్వాన్ని సరిగ్గా అంచనా వేయగలుగుతాం.

ఇది కాలం వెంట వెలుగులు విరజిమ్ముతూ పరుగిడిన అక్షరాల సంగతి. నీలి ఆకాశంలో ఉదయించిన సోషలిస్టు చంద్రుడిని పరిచయం చేసి, ఆకాశం అంచు మీద వికసితమైన పుడమి తల్లి ప్రస్తావన. రాలిపోయిన చుక్కల నెత్తురు తాగి చీకట్లను కురుస్తున్న రాత్రిని తుదముట్టించిన చలినెగళ్ల చరిత్ర. జెయిలు గోడ ముళ్ల తీగ మీద కూర్చొని పక్షులు పాడుతున్న స్వేచ్ఛా గీతం.

వరవరరావు (వివి) యాబై ఏళ్లకుపైగా కవిత్వం రాస్తున్నారు. ఒక రకంగా యాబై ఏళ్ల తెలుగు సామాజిక చరిత్రకు ఆయన కవిత్వం దాఖలా. బహుశా సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక అంశాలు ఇతివృత్తంగా స్వీకరించి ఇంత విస్తృతంగా రాసిన మరో తెలుగు కవి లేడు. తిరగబడు కవిగా ప్రస్థానం మొదలుపెట్టి, విప్లవ కవిగా రూపొందాక ఆయన కాగితం మీద అక్షరానికి కమిటై ఉన్నారు. విరసం వ్యవస్థాపక సభ్యునిగా కీలకంగా వ్యవహరించారు. నిషేధాలు, నిర్బంధాలు ఆయన అక్షరానికి పరిమితులు విధించలేకపోయాయి. పైగా అక్షరం మరింత పదునెక్కింది. కృష్ణశాస్త్రి ప్రభావంలో నుంచి బయటపడిన శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి బాటలు వేసారు. వి.వి నేరుగా శ్రీశ్రీ ప్రభావంలోకి వెళ్లారు. పెండ్యాల కిషన్‌రావు వి.వికి కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని పరిచయం చేసారు. వి.వి మాటల్లోనే చెప్పాలంటే ʹʹమాకు కిషన్‌రావు గారు సాహిత్యంలోకి కిటికీలే కాదు ద్వారాలు తెరిచాడుʹʹ. కాళోజీ, పొట్లపల్లి రామారావు, శ్రీశ్రీ గేయాలను పాడుతూ కంది చేలల్లో తిరిగిన బాల్యం వి.విని కవిత్వం వైపు మళ్లించింది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో (3 జనవరి, 1940) భూమి మీద పడ్డ వి.వి కళ్లు తెరిచి సాహిత్యంలోకి అడుగుపెట్టే నాటికి అధికార మార్పిడి జరిగిపోయి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ధాత కరువు, యుద్ధ సంక్షోభం, గ్రంథాలయ ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైన సంక్షుభిత ప్రభావాలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వి.వి మీద పడ్డాయి. దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణ ʹప్రజల మనిషిʹ, ʹగంగుʹ నవలల అధ్యయనం ఆయనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అస్తిత్వమే చైతన్యాన్ని నిర్ణయిస్తుందని మార్క్స్‌ చెప్పినట్లు-తన చుట్టూ ఉండిన చరిత్రే కవిగా వి.వి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. అందుకే ఈనాటికీ ఆయన కలానికి అంతటి నిబద్ధత ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే శ్రీపతి (పి.చలపతిరావు) వి.వికి పాణిగ్రాహిని పరిచయం చేసాడు. పాణిగ్రాహి పాటల ద్వారా వి.వికి నక్సల్బరీ, శ్రీకాకుళ రాజకీయాలు పరిచయమయ్యాయి. 1965 నాటికే ʹసృజనʹ ఏర్పాటు, రచనా వ్యాపకంపై నక్సల్బరీ రాజకీయాల ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్‌ జిల్లా రచయితల సభలలో (1968) ʹస్వచ్ఛంద కవిత్వం-సామాజిక నిబద్ధతʹ అనే అంశంపై మాట్లాడుతూ ʹʹకాగితం మీద అక్షరానికి కమిట్‌ కావడమే కవి బాధ్యతʹʹ అని వి.వి చెప్పారు. ఆయనే చెప్పిన మాటకు ఐదు దశాబ్దాలుగా ఆయన నిబద్ధుడై ఉన్నారు.

వరవరరావు కవి, పరిశోధకుడు, విమర్శకుడిగా కంటే వ్యాస రచయితగా ఎక్కువగా తెలుసు. ఐదు దశాబ్దాలుగా కళ్ల ముందరి కాలాన్ని వ్యాఖ్యానిస్తూ వస్తున్నాడు. విప్లవం, యుద్ధం, నిర్బంధం, దళితులు, ఆదివాసులు, ముస్లింలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, ప్రాంతీయ, జాతుల ఉద్యమాలు, విద్యారంగం, గ్లోబలైజేషన్‌, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఇట్లా అనేక విషయాల మీద వందల కొద్ది వ్యాసాలు రాసాడు. ఒక సమస్య మీద శాస్త్రీయమైన అవగాహనను ఏర్పరచుకోవడానికి వి.వి వ్యాసాల కోసం ఎదురు చూసే మేధావి వర్గం ఇప్పటికీ ఉందంటే తెలుగు సమాజంపై ఆయన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కవిత్వం కంటే తక్షణ స్పందనగా ఆయన వ్యాస ప్రక్రియనే ఎంపిక చేసుకుంటారు. చెప్పదల్చుకున్న విషయం ఎక్కువమంది పాఠకులకు చేరాలంటే వ్యాస ప్రక్రియ తప్ప మరొకటి ఆ ప్రయోజనాన్ని నెరవేర్చదని భావిస్తారు.

వి.వి ఉత్తమ పరిశోధకుడనే విషయం కొందరికే తెలుసు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సాహిత్యాన్ని చదువుకున్నారు. ʹఏʹ హాస్టల్‌ నుంచి అటు ఎన్‌సీసీ, ఇటు తార్నాక వరకు క్యాంపస్‌ దారులవెంట రాలిన బొడ్డుమల్లెలు వెదజల్లిన సువాసన వలె ఆయన కవిత్వం వికసించింది. సృజనాత్మక ప్రక్రియ వద్దనే ఆగిపోకుండా ఆయనలోని పరిశోధకుడిని తట్టిలేపారు. ఫలితంగా ʹతెలంగాణ విమోచనోద్యమం-తెలుగు నవలలుʹ విశ్లేషణ గ్రంథం వచ్చింది. నవలలో ప్రతిఫలించిన సమాజాన్ని గతితార్కిక పద్ధతి ద్వారా వివరించే పరిశోధన లక్షణాన్ని వి.వి ప్రవేశపెట్టాడు. ʹʹసాహిత్యం సామాజిక చైతన్యరూపం కాబట్టి ఈ సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఉత్పత్తి సంబంధాల మార్పు దృష్టితోనే పరిశీలించాలి. సామాజిక అస్తిత్వంతో అన్వయించకుండా సాహిత్యాన్ని పరిశీలించకూడదుʹʹ (సాహిత్యంలో సమాజ చలనపు ప్రతిఫలనం; 2013, పుట.3) అని వి.వి తన పరిశోధన ద్వారా ఆనాడే ప్రతిపాదించారు.

వరవరరావు విమర్శకుడు కూడా. వందల పుస్తకాలకు పీఠికలు రాసాడు. ముందు మాటలలో కేవలం వాచక విశ్లేషణ కాకుండా నేపథ్య వివరణ, between the linesలో ఉండే భావం, రచనకు రచయితకు మధ్య ఉండే గతితార్కిక సంబంధం, కావ్య ఇతివృత్తానికి శిల్ప సౌందర్యానికి మధ్య ఉండే సామాజిక-సాహిత్య సంబంధాల విశ్లేషణ ఆయన పీఠికలలో ఉంటుంది. ఏ రచనకైనా దానికదిగా ప్రత్యేక అస్తిత్వం ఏమీలేదని, సామాజిక అంతర్‌ ఘర్షణ ప్రతిబింబమే సాహిత్య వ్యక్తీకరణ అని వి.వి దృక్పథం. ఆయన విమర్శనా శక్తిని పట్టుకోవాలంటే శుద్ధ సాహిత్య జ్ఞానం సరిపోదు. చరిత్ర, రాజకీయార్థిక అధ్యయన సంస్కారం ఉండి తీరాల్సిందే. ʹభూమితో మాట్లాడు: కల్పనా సాహిత్యం-వస్తు వివేచనʹ అని 2005లో ఒక పుస్తకం వచ్చింది. ʹప్రజల మనిషిʹ, ʹగంగుʹ, ʹఅంపశయ్యʹ, ʹకొమురంభీంʹ, ʹకొలిమంటుకున్నదిʹ మొదలైన నవలలు, కొన్ని కథల మీద వి.వి రాసిన 23 వ్యాసాలతో ఈ పుస్తకం వచ్చింది.

ఇవన్నీ ఒక ఎత్తయితే వక్తగా వరవరరావు ప్రభావం ఈ సమాజం మీద అద్భుతమైనది. ఆ తరంలో ప్రభావశీలమైన వక్తల పేర్లు చెప్పవల్సివస్తే కాశీపతి, జ్వాలాముఖి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, కత్తిపద్మారావు. వక్తృత్వాన్ని ఒక కళగా వి.వి అభివృద్ధి చేసాడు. డెబ్భై ఎనిమిది ఏళ్లలోకూడా ఆయన కంచు కంఠంలోని రాజకీయ స్పష్టత తగ్గలేదు. కాగితంమీద అక్షరానికి కమిటైనట్లే సభలోని మాటల ఒరవడికి కూడా ఆయన నిబద్ధుడై ఉన్నాడు. ʹగాత్రమంతా గాత్రమైʹ అని సంస్కృతంలో ఒక మాట ఉంది, అంటే శరీరమంతా పాటై అని అర్థం. సరిగ్గా వక్తృత్వం ద్వారా ఈ పనిని చేస్తున్నాడు వి.వి.

వరవరరావు యాబైఏళ్ల కవిత్వాన్ని ఒకే పుస్తకంగా 2008లో ప్రచురించారు. ఒక వెయ్యీ ముప్పై పేజీల రచన అది. కాని తెలుగు సాహిత్య ప్రపంచం దానిని విశ్లేషించే, అంచనా కట్టే పని చేయలేదు. ఐదు దశాబ్దాలుగా కవిత్వ సృజన చేసిన, కవిగా గణనీయమైన గుర్తింపు ఉన్న వి.వి కవిత్వాన్ని తూచే విమర్శకులు లేకపోవటమా? సీరియస్‌ శాస్త్రీయ విమర్శ లేని లోపం వలననే ఈ సమస్య ఉందని నాకు అన్పిస్తుంది. ఇప్పుడు తెలుగు సాహిత్యం విమర్శ లేమిని ఎదుర్కొంటున్నది. వరవరరావు కవిత్వాన్ని అంచనా వేయాలంటే ఐదు దశాబ్దాల చరిత్ర, రాజకీయార్థిక పరిణామాలు, సాంస్కృతిక మార్పులు తెలిసి ఉండాలి. అప్పుడే ఆయన కవిత్వాన్ని సరిగ్గా అంచనా వేయగలుగుతాం.

రచయితలను పాలకులు ఎప్పుడూ ప్రతిపక్షంగానే చూస్తారు. ప్రతిపక్షాలు శూన్యమైన సందర్భంలో రచయితలు, కవుల పాత్ర మరింతగా పెరుగుతుంది. ఆ పాత్రనే వరవరరావు నిర్వహిస్తున్నారు. దేశంలో అమలవుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడుతున్నారు. వరవరరావు కవిగా ప్రజల పక్షం, అధ్యాపకుడిగా విద్యార్థుల పక్షం, చర్చల ప్రతినిధిగా విప్లవకారుల వైపు, రచయితగా పోరాడే ప్రజలవైపు, వక్తగా ప్రజల గొంతును విన్పించే ఉపన్యాసకుడు. ఏలికకు ఇది నచ్చలేదు. ʹనా వైపు నీవు లేవంటే నా శత్రువుʹ అని ప్రకటించారు.

అసమ్మతిని ఒప్పుకోలేని కాలంలో జీవిస్తున్నాం. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో ఉన్నాం. దళితులు, ముస్లింలు, ఆదివాసులు, మహిళలు, విప్లవకారులు, హేతువాదులు, ప్రజాస్వామికవాదుల మీద నాలుగు పడగల హైందవ నాగరాజు పడగ విప్పి బుస కొడుతున్నాడు. ఈ సందర్భంలో బుద్ధిజీవుల పాత్ర విస్మరించలేనిది. భావప్రకటన స్వేచ్ఛకోసం సామూహిక స్వరం వినిపించకపోతే చరిత్రలో నేరస్థులమయ్యే స్థితి వస్తుందేమో. వరవరరావే రాసినట్లు:- నేరమే అధికారమై ప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటే ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడేʹʹ
(కవిగా వరవరరావు యాభై ఏళ్లు
పూర్తి చేసుకున్న సందర్భంగా)
చింతకింది కాశీం

Keywords : varavararao, virasam, poet, writer, maoists, arrest
(2024-04-20 01:27:38)



No. of visitors : 1338

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కాగితం