ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు

ʹపాకిస్తాన్

జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కన్హయ్య కుమార్ పాల్గొన్న ఒక ర్యాలీలో పాకిస్తాన్‌కు మద్దతుగా ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని నినాదాలు చేశాడని పేర్కొంటూ పోలీసులులు ఇటీవల 1200 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. కన్హయ్యకుమార్ దేశద్రోహానికి పాల్పడ్డాడంటూ అప్పట్లో ఏబీవీపీ విద్యార్థులు ఆరోపించారు. నినాదాలు చేసినట్లుగా ఉన్న వీడియోను ఒక ప్రముఖ జాతీయ ఛానల్ పదే పదే ప్రసారం కూడా చేసింది. అయితే ఇదంటూ కట్టుకథ అని కన్హయ్య కుమార్ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయలేదంటూ ఏకంగా అప్పటి ఏబీవీపీ నాయకులు మీడియాకు వివరించడం సంచలనం సృష్టిస్తోంది. 9 ఫిబ్రవరి 2016లో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను ఏబీవీపీ జేఎన్‌యూ శాఖ మాజీ ఉపాధ్యక్షుడు జతిన్ గోరయ్య, మాజీ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ నర్వాల్ ఇవాళ మీడియాకు వెల్లడించారు.

ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరిద్దరూ మాట్లాడుతూ.. ఆ రోజు వీడియోలో చూపిన విద్యార్థులు ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అంటూ నినాదాలు చేసిన మాట వాస్తవమే కాని వారు కన్హయ్య వెంట వచ్చిన వాళ్లు కాదని.. ఏబీవీపీ సభ్యులు, సానుభూతిపరులని వారు ధృవీకరిస్తున్నారు. కన్హయ్యకుమార్ మరియు అతని స్నేహితులు ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అంటూ నినాదాలు చేశారని ʹజీ న్యూస్ʹ ఛానల్ వీడియోలు వెలువరించింది. అయితే వాళ్లు ఏబీవీపీ సభ్యులని తాము నిరూపిస్తామని, అవసరం అయితే ʹజీ న్యూస్ʹ ఛానల్‌లోనే చర్చకు సిద్దమని జతిన్, ప్రదీప్‌లు సవాల్ విసిరారు.

ఇంకా ఏం చెప్పారంటే...

హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యను ఖండిస్తూ జేఎన్‌యూలో విద్యార్థులు సంఘీభావ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో కన్హయ్యకుమార్ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లు ʹజీ న్యూస్ʹ నాలుగు వీడియోలు ప్రసారం చేసింది. అందులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లు ఉన్న వీడియో ఎడిట్ చేసి ప్రసారం చేశారని.. అది నకిలీ వీడియో అని వీరు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా అక్కడ ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అంటూ అరిచింది ఏబీవీపీ సభ్యులని.. వారిని మేం గుర్తు పడతామని అన్నారు.

ఏబీవీపీ సభ్యులు కావాలనే నినాదాలు చేసి దానిని కన్హయ్యకుమార్ మీద వేసేలా ప్రణాళిక రచించారని వారు స్పష్టం చేస్తున్నారు. మేమిద్దరం (జతిన్, ప్రదీప్) దళితులం కావడం వల్ల ఏబీవీపీ తమను పదే పదే టీవీ డిబేట్లకు పంపేదని వారు చెబుతున్నారు. కాని మేం వారి ఆలోచనలను తిరస్కరించేవాళ్లమని అన్నారు. కన్హయ్యకుమార్, రోహిత్ వేములను ఏబీవీపీ టెర్రరిస్టులుగా చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని జతిన్, ప్రదీప్‌లు స్పష్టం చేశారు.

Source : Janata Ka Reporter

(http://www.jantakareporter.com/india/ex-abvp-office-bearers-drop-bombshell-say-members-of-bjps-student-wing-chanted-pakistan-zindabad-slogans-on-jnu-campus/227873/?fbclid=IwAR2zFkm1vcgul6X4kg02_wrOgeyOeZ-ea0bJfkWsbREUkZeSfghIKbY05VQ)

Keywords : పాకిస్తాన్ జిందాబాద్, కన్హయ్యకుమార్, జేఎన్‌యూ, ఏబీవీపీ, దేశద్రోహం, రోహిత్ వేముల, pakistan zindabad, pro pakistan, kanhiya kumar, jnusu, abvp, jnu, jatin , pradeep
(2024-03-25 15:06:08)



No. of visitors : 2644

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹపాకిస్తాన్