రాజ్యమా ఓడిపో....
తప్పదు మరి. చరిత్రలో ఏలిక ఎవరైనా ప్రజల ముందు తల వంచవలసిందే. ఇవ్వాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అదే జరిగింది. విరసం నిర్వహించాలనుకున్న మూడురోజుల ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే, దానిని నిరసిస్తూ ఇవ్వాల అక్షరాల 137 మందితో ఎస్ వి కే లో సభ జరిగింది. ఈ సభలో కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విప్లవ పార్టీలు, ప్రజా సంఘాల నాయకత్వం పాల్గొని ఈ పోరాటానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ప్రొ సాయిబాబా, విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు విడుదల కోసం విరసం నిర్వహించిన ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రెండు గంటలకు ముగిసింది. ధర్నాకు అనుమతి నిరాకరించి నిరసనను అడ్డుకోవాలన్న రాజ్యం పన్నాగం పటాపంచలైంది. నిర్బంధం ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యమం అలలాగా ఎగిసి పడుతుందని మరోసారి రుజువయ్యింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించి రాజ్య స్వభావాన్ని ఎండగట్టారు. దేశంలో నిరసన గొంతులకు అవకాశం లేకుండా బ్రాహ్మణ ఫాసిజం నాలుగు పడగల హైందవ నాగరాజు వేయిపడగలతో బుస కొడుతున్నది. ఈ క్రమంలోనే నిరసన గొంతులకు అవకాశం లేకుండా పోతుందని వక్తలందరూ అభిప్రాయపడ్డారు.
ప్రజా కళా మండలి కళాకారుల పాటతో ప్రారంభమైన కార్యక్రమం విరసం కార్యవర్గ సభ్యుడు కాశీo మాట్లాడుతూ పోలీసులు ధర్నాకు అనుమతి ఇవ్వక పోగా, ఎన్నో రకాల ఇబ్బందులు సృష్టించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి విమల, బజరా, ఆర్.కె, డాక్టర్ సమున్నత(ఓయూ), ప్రొ పద్మజా షా, ప్రజా కళా మండలి అధ్యక్షుడు జాన్, టిడిఎఫ్ కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చంద్రశేఖర్, s. వెంకటేశ్వర్ రావు, ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం, కుల నిర్మూలన పోరాట సమితి కార్యదర్శి అభినవ్, డాక్టర్ కొండా నాగేశ్వరరావు(ఓయూ), ప్రొఫెసర్ రత్నం, మద్దిలేటి, రాజేంద్ర బాబు, కోట శ్రీనివాస్, బద్రి, రాజమల్లు, అంజమ్మ, ప్రొ. లక్ష్మణ్, ఎన్ వేణుగోపాల్, వరవరరావు సహచరి హేమలత మొదలైన రచయితలు, బుద్ధి జీవులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపన్యసించారు.
ఇప్పటికే విరసం వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయాలని ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నిరసన సభలో పాల్గొన్న మిత్రులందరూ తమ అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విరసం వరవరరావు, సాయిబాబా మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి భేషరతుగా విడుదల చేయాలని, సాయిబాబాకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని, పంజాగుట్ట చౌరస్తాలో కూల్చివేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి అక్కడే నెలకొల్పాలని, ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగి 23 మంది విద్యార్థుల మరణానికి కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తీర్మానాలు చేసింది.
- కాశీం, విరసం కార్యవర్గ సభ్యులు
28-04-209
Keywords : virasam, kashim, varavararao, gn saibaba
(2024-03-15 08:08:30)
No. of visitors : 884
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |