తెలంగాణొస్తే ఏమొచ్చింది? అణచివేత, అబద్ధాలు, అక్రమ నిర్బంధాలు...

తెలంగాణొస్తే

సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పై పోస్ట్ చేసిన ఈ వ్యాసం మీ కోసం...

మిత్రులారా, గ్లోబరీనా అవకతవకలకు బలిఅయి నిస్సహాయంగా ఆందోళన పడుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద వారం పది రోజులుగా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో పోలీసుల దౌర్జన్యాల గురించి, అధికారుల నిర్లక్ష్య, దాటవేత వైఖరి గురించి, అసలు నేరస్తులను తప్పించడం గురించి చదువుతూనే, వింటూనే ఉన్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుముందు నిరసనకు అఖిల పక్షం పిలుపు ఇస్తే, రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వందలాది మందిని ముందస్తు అరెస్టులు చేశారు.

బంగారు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసులు సాగిస్తున్న ఈ మహత్తర పాలనలో మరొక ఘట్టం నిన్న జరిగింది. అబద్ధపు భీమా కోరేగాం హింసాకాండ కేసులో అరెస్టు చేసిన నిందితులను (వీరిలో ఐదుగురు పదినెలలుగా, నలుగురు ఆరు నెలలుగా యరవాడ జైలులో మగ్గుతున్నారు), ఒక తప్పుడు కేసులో అన్యాయంగా యావజ్జీవ శిక్ష విధించి నాగపూర్ జైలులో రెండు సంవత్సరాలుగా నిర్బంధించిన ప్రొ. జి ఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ తో ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, కర్నూలులలో, తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండల్లో ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల కార్యకర్తలతో ధర్నాలు జరపాలని విప్లవ రచయితల సంఘం నిర్ణయించింది.

ఎన్నో దుర్మార్గాలకు చిహ్నమైన చంద్రబాబు పాలనలో విజయవాడలో, కర్నూలులో మూడు రోజుల ధర్నాకు పోలీసులు అనుమతించారు. ధర్నాలు జరుగుతున్నాయి. ఉద్యమ ఫలితంగా ఏర్పడిన మహా ఘనత వహించిన తెలంగాణలో మాత్రం హైదరాబాద్ లో ధర్నాచౌక్ లో, హనుమకొండలో ఏకశిల పార్క్ దగ్గర ధర్నాకు అనుమతి నిరాకరించారు. ʹవిప్లవ రచయితల సంఘం నిషిద్ధ సంస్థ కాబట్టి అనుమతి ఇవ్వడం లేదʹని హైదరాబాద్ లో బాజాప్తా కాగితమే రాసి ఇచ్చారు. ఇంత అబద్ధాలతో, వాక్సభాస్వాతంత్ర్యాలను అడ్డుకోవడం తెలంగాణలోనే సాధ్యం. తెలంగాణొస్తే ఏమొచ్చిందంటే ఇదీ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ 1992 కింద విప్లవ రచయితల సంఘంపై నిషేధం విధిస్తున్నట్టు 2005 ఆగస్ట్ 17న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ 373 అనే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ చట్ట ప్రకారమే ఇటువంటి నిషేధం విధించినప్పుడు, ముగ్గురు న్యాయమూర్తుల బృందాన్ని నియమించి ఈ నిషేధం చెల్లుతుందా లేదా పరిశీలించమని కోరాలి. ఆ న్యాయమూర్తుల బృందం దగ్గర నిషిద్ధ సంస్థ తన వాదనలు వినిపించుకోవచ్చు. అలా జస్టిస్ టి ఎల్ ఎన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన న్యాయమూర్తుల బృందం విచారణ జరిపి ఆ నిషేధం చెల్లదని తీర్పునిచ్చింది. అందువల్ల అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2005 నవంబర్ 11 న జి ఓ ఎం ఎస్ 503 ద్వారా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు మళ్లీ ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత పద్నాలుగు సంవత్సరాలుగా ఆ సంస్థ బహిరంగంగా కార్యకలాపాలు జరుపుతున్నది.

కాని మహా ఘనత వహించిన తెలంగాణ పోలీసులకు చట్టంతో, న్యాయమూర్తుల ఆదేశాలతో, నిజాలతో పని ఏముంది?

తెలంగాణొస్తే ఏమొచ్చింది?

ధర్నాకు అనుమతి నిరాకరిస్తే హైదరాబాద్ లో, హనుమకొండలో హాళ్లలో జరిగిన నిరసన సభల ఫొటోలు, విజయవాడ, కర్నూలుల్లో బహిరంగంగా రోడ్డు పక్కన జరుగుతున్న ధర్నాల ఫోటోలు చూడండి. అలాగే విరసం మీద నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జివో చూడండి








- ఎన్.వేణుగోపాల్

Keywords : telangana, intermediate, varavararao, gn saibaba
(2024-03-31 13:14:22)



No. of visitors : 946

Suggested Posts


ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తెలంగాణొస్తే