అప్పుడు టీఆరెస్..ఇప్పుడు బీజేపీ...రైతులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడంలోఒకరికి మించి మరొకరు

అప్పుడు


నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత పై రైతులు పోటీ చేసినప్పుడు వారిని పోటీ చేయకుండా ఆపడానికి టీఆరెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో...ఎన్ని రకాల బెధిరింపులకు పాల్పడ్డారో...పోలీసుల సహాయంతో అడ్డుకోవడానికి ఎలా అయితే దుర్మార్గంగా ప్రవర్తించారో...ఇప్పుడు సేమ్ టూ సేమ్ ఆ పాత్రను బీజేపీ పోషిస్తోంది. నిజామాబాద్ లో నామినేషన్లు వేయడానికి రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలందించిన బీజేపీ వార‌ణాసిలో మోడీ పైపోటీ చేస్తున్న రైతులపై దుర్మార్గ దాడులకు దిగింది.

పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర అనే డిమాండ్లతో తమ నిరసనను తెలియజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వారణాసిలో నిజామాబాద్ రైతులు పోటీకి సిద్ధమయ్యారు. ఐతే.. వారంతా నామినేషన్లు వేయకూడదనేదే మోదీ సర్కారు లక్ష్యం. వారణాసిలో మోదీ సేన వారికి అడుగడుగునా చుక్కలు చూపిస్తోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పసుపు రైతులను అడ్డుకుంటున్నారు. నామినేషన్లు వేసేందుకు వారికి ప్రతిపాదకులు లేకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఏకంగా రైతన్నలపై ఇంటెలీజెన్స్‌ బ్యూరో(ఐబీ)ని దింపింది. ఐబీ అధికారులు ఉదయం రైతులు బస చేసిన సిల్క్‌ సిటీ లాడ్జిపై దాడి చేశారు.

గదుల్లో దిగినవారి అడ్రస్‌ ప్రూఫ్‌లు ఇవ్వాలని లాడ్జి యజమానిపై ఒత్తిడి తెచ్చారు. గమనించిన రైతులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేశారు.తాము అద్దెకు తీసుకున్న బస్సులో అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించగా.. ʹమీరు బస్సెక్కితే.. బస్సుతోపాటు మిమ్మల్ని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్తాం..ʹ అని పోలీసులు బెదిరించారు. దీంతో వారంతా పోలీసులకు చిక్కకుండా గ్రూపులుగా విడిపోయి.. ఆటోల్లో సిటీ దాటారు. చివరికి స్థానిక మీడియా, లాయర్ల సాయంతో అదే లాడ్జికి తిరిగి వచ్చారు. ఇన్ని రోజులు స్థానిక బీజేపీ నేతలతో బెదిరింపులకు గురిచేసినా..మాట వినడం లేదనే అక్కసుతోనే ఆదివారం ఐబీని రంగంలోకి దింపారని రైతులు ఆరోపిస్తున్నారు. మీడియా, లాయర్ల సహకారంతో సోమవారం నామినేషన్లు వేసితీరుతామని రైతులు ప్రకటించారు.

మరో వైపు తమిళనాడు రైతులు కూడా మోడీపై పోటీ చేయడానికి సిద్దమై వారణాసి చేరుకున్నారు. వారిని కూడా పోలీసుల సహాయంతో బీజేపీ అడ్డుకుంది. దీంతో నిజామాబాద్‌, తమిళనాడుకు చెందిన రైతుల ఆందోళన చేపట్టారు. తమను నామినేషన్‌ వేయకుండా ఎన్నికల కమిషన్ (ఈసీ), పోలీసులు అడ్డుకున్నారని పేర్కొంటూ వారు ఆందోళనకు దిగారు. ఈసీ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు మద్దతిచ్చిన స్థానికులను కూడా బెదిరించారని రైతులు ఆరోపించారు.

Keywords : nizamabad, farmers, kalvakuntla kavitha, bjp, trs, modi
(2024-04-04 09:37:49)



No. of visitors : 709

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అప్పుడు