మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

మళ్ల

(వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన ఈ సంపాదకీయ వ్యాఖ్య (తెలంగాణ) వీక్షణం జూలై 2019 సంచికలో ప్రచురించబడినది)

తెలంగాణొచ్చి ఐదేండ్లయింది గద. అంటె శాన రోజులే గద. ఒక సర్కారు దిగిపోయి రెండో సర్కారు గుడ ఎక్కింది గద. ఎన్నేండ్లు కొట్లాడి తెచ్చుకుంటిమి! ఎంత మంది బిడ్డలు రాలిపోతె ఒచ్చింది! ఏదైన ఎదురుచూడంగ ఎదురుచూడంగ ఒస్తె ఆశ ఎక్కువుంటది గద. తెలంగాణొస్తే ఏమొచ్చింది ఎవరికొచ్చింది అని ఎవరైన అమాయకంగ అడుగొచ్చు. అంతకు ముందు ఎట్లుండె, ఇప్పుడెట్లున్నది అని లెక్కలేసుకోవచ్చు. వాండ్ల బతుకుల్ల ఏమి మారకపోయిన, వాండ్ల ఊళ్ల ఏమి కనబడకపోయిన గుడ ఎవనికో ఒకనికి ఎక్కడ్నో ఒక కాడ వచ్చే ఉంటదిలే, ఏదో ఒక ఊళ్లె మంచి జరిగే ఉంటదిలే, జనానికి ఒరిగే ఉంటదిలే అని సంబుర పడొచ్చు. మారె, అస్సలేమి రాలే, పెనం మీంచి పొయిల బడ్డట్టయింది, పురాగ అన్నాలమై పోయింది, గొర్లను దినెటోడు బోయి బర్లను దినెటోడు ఒచ్చినట్టయింది అని కొట్టిపారేసి నిరాశగ నాలిక చప్పరిచ్చెటోల్లు గుడ ఉండొచ్చు. ఇగ పెద్ద దొర భక్తులూ చిన్న దొర భక్తులూ శానశాన ఒచ్చినయని పెగ్గెలు గుడ చెపుతుండొచ్చు. నీళ్లు దెచ్చినం, పెండ్లిండ్లు జేసినం, ముసలోల్లకు ముద్ద బెట్టినం, పంటకు పెట్టుబడి బెట్టినం, ఢిల్లిల చక్రం దిప్పెడిదుండె, కీసల దప్పిపోయింది అని చాంతాడంత పురాణం జెప్పొచ్చు. అవన్ని నివద్దె. గాని వాటి ఎనుకా ముందు జూడాలె గద. ఇది జేసినం, అది జేసినం అని టుపాకి ఎంకట్రాముని తీర్గ ఒర్రితె గాదు, ఆ పెగ్గెల ఎనుక ఏమున్నది జూడాలె. చెర్ల బియ్యం బోసి తూముల మంటబెట్న మారాజ అంటే ఇనుటానికి బాగనే ఉంటది గాని చెర్ల ఎన్ని బియ్యం బోసిండు, తూముల మంట బెడితె ఉడుకుతాందా లేద, ఉడికినా ఊరి జనానికి మెతుకు మెతుకన్న ఒస్తదా లేదా అని ఇశారించాలె గద. అట్లనే పెద్ద దొర, చిన్న దొర, భక్తులు చెప్పేటియన్ని తిర్లమర్లేసి జూస్తె అసలు సంగతి తెలుస్తది. ఇంతకు ఏమన్న ఒచ్చిందా లేదా అని ఎట్ల జూడాలె? తెలంగాణ ఎందుకు రావాల్నని కొట్లాడినమో అవి ఒచ్చినయా లేదా అని చూడాలె. ఆంధ్రోడు ఎల్లి పోవాలె అని ఎందుకన్నమో అవి జరిగినయా లేదా చూడాలె. జనానికి కావల్సినవి అందినయా లేదా అని చూడాలె. తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేకపాయె, నీళ్లొస్తె మాకేమొస్తది. కొలువులు గావాలె. అవి గావాల్నంటె మస్తుగ మిల్లులు గట్టాలె. కొత్త మిల్లుల సంగతి వదిలిపెట్టు, మూసినయే దెరిపియ్యక పాయె, ఉన్నయి మూయబట్టె. ఇగ పైసలంటే మస్తు పైసలు మిత్తికి దెస్తాండట గద. తెచ్చి ఏం జేస్తాండో తెల్వదు. ఆ అసళ్లు, మిత్తులు ఎవలు గట్టాలె. మా ఊళ్ల కాటిపాపల తాత నోట్లెనుంచి బంగారు గుండ్లు దీసెటోడు. మరెందుకు బిచ్చమడుగుతానవే అంటె, ʹనా సొమ్ము సొక్కమైతే ఇంకాడనో ఉందుʹ అనెటోడు. తెలంగాణ కత గట్లనే ఆయెనా. ఆయినెవలో, నాకు పేరు నోరు దిరగది గని, సాములోరట, గదేదో తూర్పు దేశం నుంచొచ్చి ఐద్రాబాదల జాగ గావాల్నన్నడట. ఐద్రబాదల శాన పిరమాయె. మస్తు పైస గావాలె గద. అయిన, నాకు తెల్వకడుగుత. సాములోరు భూమి పుట్టిచ్చలేడా, పైస పుట్టిచ్చలేడా? గాయినెకు రూపాయికో రెండు రూపాలకో ఎకరం చొప్పున రెండెకరాలు ఇచ్చిండట గద దొర. వారెవ్వా, ఇప్పుడు ఎరుకైంది నాకు. తెలంగాణొస్తే ఏమొచ్చిందా? పెద్దోళ్లకు రూపాయికి ఎకరం ఒచ్చింది మారాజ. పనిపాటలోళ్లకు ఉన్న భూమి ఊడగుంజుకున్నరు మారాజ.
- ఎన్.వేణుగోపాల్

Keywords : telangana, kcr, ktr, trs, lands
(2024-04-23 07:33:50)



No. of visitors : 1611

Suggested Posts


ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మళ్ల