include 'men';
?>
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
విప్లవ రచయిత వరవరరావుపై పోలీసులు మరో కేసు బనాయించారు. పది నెలలుగా పూణే ఎరవాడ జైలులో ఉన్న వరవరరావును కర్నాటక పోలీసులు కస్టడీ తీసుకొని కర్నాటక తిసుకెళ్ళారు. 2005 లో కర్నాటకలోని తునుకూరు జిల్లా తిరుమాని పోలీసు స్టేషన్ పరిధిలో 6గురు పోలీసులతొ సహా 8 మంది మావోయిస్టుల దాడిలో చనిపోయారనేది కేసు. కోర్టు ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులని విడుదల చేసింది. అయితే ఇంత కాలానికి ఆ కేసును తిరగదోడిన పోలీసులు హైకోర్టుకు అప్పీలు చేశారు. పైగా ఆ కేసులో వరవరరావును ఇరికించారు. విచారణ పేరుతో ఆయనను కర్నాటక పోలీసులు ఈ రోజు పూణే జైలు నుండి తీసుకవెళ్ళారు.
ఎక్కడెక్కడో..ఎప్పుడో జరిగిన కేసులన్నింటిలో వరవరరావును ఇరికించి ఆ 80 ఏండ్ల వృద్దుడిని జైల్లో నుండి బైటికి రాకుండా చేసేందుకు చేయాల్సిన కుట్రలన్నీ పాలకులు చేస్తున్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ అనే తేడా లేదు. మహా రాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. విప్లవ రచయితల సంఘం ఏబయ్యో ఏడులో అడుగు పెడుతున్న సందర్భాన ఆ సంఘం వ్యవస్తాపక సభ్యుడైన వరవరరావును రాజ్యం జైల్లో మగ్గేట్టుగా అక్రమ కేసులు బనాయిస్తున్నది. దీనిపై విప్లవ రచయితల సంఘం మీడియా ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం.
వరవరరావుపై కర్ణాటకలో మరోకేసు ఇది ప్రభుత్వ నీతిమాలిన చర్య
ఇప్పటికే భీమా కోరేగాం కేసులో వరవరరావు పది నెలలుగా నిర్బంధంలో ఉన్నారు. ఆయనపైనా, దేశవ్యాప్తంగా ప్రజల పక్షాన నిజాయితీగా, నిర్భయంగా పోరాడుతున్న మేధావులపైనా భీమాకోరేగాం అల్లర్ల కేసుతో పాటు ప్రధానమంత్రి హత్యకు కుట్ర చేసారనే తప్పుడు ఆరోపణలు చేసి పూణే ఎరవాడ జైల్లో బంధించి ఏడాదిగా బెయిల్ విచారణను కూడా సాగదీస్తూ వస్తున్నారు. నిందితులకు బెయిల్ ఇవ్వాలా వద్దా తేల్చడానికి కూడా ఇంత తాత్సారం చేస్తున్న న్యాయస్థానాల వెనక ప్రభుత్వ కుట్రపూరిత జోక్యం ఉందని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఈలోగా జనవరిలో వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్పై వాళ్లకు ఏ మాత్రం సంబంధంలేని 2016 నాటి కేసు నొకటి బైటికి తీసి అందులో ఇరికించారు. ఇప్పుడు మళ్లీ వరవరరావును మరోకేసు విచారణ నిమిత్తిం కర్ణాటక పోలీసులు పూణే ఎరవాడ జైలు నుండి తమ కస్టడీలోకి తీసుకొని కర్ణాటక తరలిస్తున్నారు. ఇది మావోయిస్టుల దాడికి సంబంధించిన 2005 నాటి కేసు. ఆ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక పావగడ ప్రాంతం తిరుమాని పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు చేసిన దాడిలో ఆరుగురు జవాన్లతో సహా ఎనిమిది మంది చనిపోయారు. ఈ కేసులో నిందితులందరూ ఎప్పుడో విడుదలైపోయారు. ఇన్నేళ్ల తర్వాత దీనిని తవ్వితీసి ఇందులో ప్రధాన కుట్రదారుడు వరవరరావు అని ఇప్పుడాయనను విచారించబోతున్నారు. రేపు విరసం ఆవిర్భావ దినం. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, విరసం యాభయ్యవ ఏట అడుగుపెడుతున్న రోజున ఆయన రాజ్యం కరకు తుపాకీల నీడన, న్యాయం ముసుగేసుకున్న అన్యాయస్థానంలో నిలుచొని జనన్యాయం మాట్లాడతారు. ఇది వరుసగా ఆయనమీద నమోదు చేసిన మూడో కేసు. ఆయన తొణకకుండా అలానే ఉంటారు. విరసం అలానే కొనసాగుతుంది.
ఈ మూడూ తప్పుడు కేసులని పోలీసులకు తెలుసు. కానీ ఆయనకు బెయిల్ వచ్చినా బైటికి రానివ్వకుండా చేయడానికి కుట్రపూరితంగా ఆయనపై కేసులు నమోదు చేసుకుంటూపోతున్నారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఏ ఆధారం లేకుండా ఇలా మేధావుల మీద, సామాజిక కార్యకర్తల మీద కేసులు పెట్టి, బెయిల్ ఇవ్వకుండా, ఏళ్ల తరబడి వాళ్లను జైలుపాలు చేసే అధికారం పోలీసులకు ఉండడం, న్యాయవ్యవస్థ మిన్నకుండా ఉండడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇది అలవాటుగా మారి గిట్టనివాళ్లందరి మీదా కక్ష తీర్చుకునే అవకాశం ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. బిజెపి ప్రభుత్వం నోరెత్తినవాళ్లందరినీ జైలుపాలు చేస్తూపోతోంది. భీమాకోరేగాం తదనంతర పరిణామాలు దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో చీకటి కోణంగా మిగిలిపోనున్నాయి. మిత్రులారా, ప్రజాస్వామికవాదులారా, ప్రభుత్వ నీతి మాలిన చర్యలకు ఖండిస్తూ న్యాయం పక్షాన గట్టిగా మాట్లాడదాం. ప్రభుత్వ దమనకాండకు ఖండిద్దాం.
-విరసం
Keywords : varavararao, maoists, karnataka, maharashtra, virasam, police
(2024-03-22 13:05:19)
No. of visitors : 865
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..