include 'men';
?>
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
ఈ కాలంలో కూడా కులం ఎక్కడుంది..? కుల వివక్ష ఎక్కడుందని చాలా మంది మాట్లాడుతుంటరు. కాని రోజు దేశంలో ఎక్కడో ఒక చోట పరువు హత్యలు కలకలం రేపుతూనే ఉన్నాయి. అగ్రకుల అమ్మాయిని ఒక దళితుడు పెండ్లి చేసుకుంటే.. ఆ అమ్మాయి తండ్రి ఒక ఎమ్మెల్యే.. అందులో బీజేపీ ఎమ్మెల్యే అయితే ఆ జంట ఎంత భయాందోళనకు గురవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడా జంట తమను కాపాడమని పోలీసులను వేడుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్లోని బిథారీ చేన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా. తను అజితేష్ అనే దళితుడిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో చెబితే తమను విడదీస్తారని భావించి ఆ జంట పారిపోయి వివాహం చేసుకున్నారు. ఇక ఆనాటి నుంచి అమ్మాయి తండ్రి వీరిపై వేధింపులు ప్రారంభించాడు. తన అనుచరులైన గూండాలను వారి వద్దకు పంపి బెదిరింపులకు దిగుతున్నాడు. ఆ జంట ఎక్కడకు వెళ్లినా ఈ గూండాలు వారిని వెంబడీస్తూనే ఉన్నారు. ఏక్షణంలో ఏం చేస్తారోనని ఆ జంట భయపడుతోంది.
పోలీసులకు మొరపెట్టుకున్న తమకు రక్షణ లేదని భావించిన ఈ జంట సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో సాక్షి మాట్లాడుతూ.. నాన్నా నేను అజిత్ను ఇష్టపూర్వకంగా పెండ్లి చేసుకున్నాను.. నేను ఎవరి ఒత్తిడికి లొంగలేదు. కాని మీరెందుకు ఇది అర్థం చేసుకోకుండా రోజూ గూండాలను మా దగ్గరకు పంపి బెదిరిస్తున్నారు..? వాళ్లకు మేం దొరికితే తప్పకుండా చంపేస్తారు. నాన్నా నన్ను చంపొద్దు.. దయచేసి మాకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నానని వేడుకున్నారు. అజిత్ కూడా వీడియోలో మాట్లాడుతూ.. నేను దళితుడిననే మా వెంట పడుతున్నారు. ఇవాళ మా వెంట ఆ ఎమ్మెల్యే గూండాలు పడ్డారు. తృటిలో వారి నుంచి తప్పించుకున్నామని చెప్పాడు.
తక్కువ కులం వాడిని ప్రేమించిందనే ఆ ఎమ్మెల్యే కోపం. తన కూతురు ఏమైపోయినా పర్యాలేదు.. నా పరువు పోయింది కనుక వారిని చంపాల్సిందేనని ఆ ఎమ్మెల్యే పగపట్టాడు. అసలే అధికార బీజేపీ పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు మాత్రం ఆ జంటను రక్షిస్తాయా..? ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాలో..!
Keywords : BJP, MLA, UP, Daughter, Sakshi Mishra, Ajitesh, Dalith, Couple
(2024-03-09 01:47:42)
No. of visitors : 2544
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..