అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు

రెండు రోజులుగా ఈ ఖమ్మం సబ్ జైలు దగ్గర పడిగాపులు పడుతున్న ఈ చిన్నారులు అంజలి, సమీరా. అంజలికి 4 ఏండ్లు, సమీరాకు 2 ఏండ్లు. అమ్మ, నాన్నలను వదిలి ఎన్నడూ లేని ఈ చిన్నారులు ఇప్పుడు పది రోజులుగా అమ్మానాన్నలు లేకుండా గడుపుతున్నారు. అమ్మా అంటూ బోరున విలపిస్తున్న ఆ చిన్నారులను ఓదార్చడానికి తల్లీ తండ్రులు అక్కడ లేరు. జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నారంటే వాళ్ళేదో లక్షల కోట్లు ప్రజల సొమ్మును దోచినవాళ్ళు కాదు.... బ్యాంకులను ముంచిన వాళ్ళు కాదు... హత్యలు చేసినవాళ్ళు కాదు... మరెందుకు జైల్లో ఉన్నట్టు ?

వాళ్ళది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు గ్రామం తరతరాలుగా అడవితల్లినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసులు వాళ్ళు. వాళ్ళౌ పేర్లు కణితి రాజు, భద్రమ్మ. పోడు వ్యవసాయం చేయడం ఉన్నదాంట్లో అడవి తల్లి ఒడిలో ఆనందంగా బతకడమే వాళ్ళకు తెలిసింది. అడవి ఆదివాసుల హక్కు అని ఐక్యరాజ్య సమితి చెప్పినా అనేక తీర్పులున్నా...అడవి నుండి ఆదివాసులను విడదీసి ఆ అడవి గర్భాన ఉన్న ఖనిజ సంపదను కార్పోరేట్ల పరం చేయడంకోసం పాలకులు చేస్తున్న కుట్రకు వీళ్ళిద్దరూ ఇవ్వాళ్ళ జైల్లో ఉండడానికి లింక్ ఉంది.

ప్రభుత్వ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారనే అభియోగంతో ఈ నెల 2వతేదీ అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారులు గుండాలపాడు గ్రామంపై దాడి చేశారు. ఆ గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆదివాసులకు, కొందరు ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు... ఆదివాసులకు గాయాలైనందుకు ఫారెస్ట్ అధికారులపై ఎలాంటి కేసూ పెట్టలేదు కానీ అంజలి, సమీరా తల్లితండ్రులైన‌ కణితి రాజు, భద్రమ్మలతో సహా 12 మంది ఆదివాసులపై కేసులు బనాయించి ఖమ్మం సబ్ జైలుకు పంపించారు.

తల్లిదండ్రులు ఇద్దరూ జైలు పాలు కావడంతో ఇక ఇంట్లో కేవలం 4 ఏళ్ల‌ అంజలి, 2 ఏళ్ల‌ సమీరా మాత్రమే మిగిలారు. తల్లిదండ్రులను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని రెండేళ్ల సమీరా తల్లి కోసం తల్లడిల్లిపోతుంది. చుట్టుప‌క్క‌ల వారు.. ఆ పిల్లల పట్ల జాలితో తీసుకెళ్లి బోజనం పెట్టినప్పటికి ఆ చిన్నారులు ఇద్దరు కూడా తల్లిదండ్రులపై బెంగతో బోజనం కూడా సరిగా చేయడం లేదు. ఎవరు కనిపించినా... తమ అమ్మనాన్నలను చూడాలంటూ రోదిస్తూ అడుగుతున్నారు.

రెండు రోజుల నుండి ఖమ్మం సబ్ జైలు దగ్గర పడిగాపులుపడుతున్నారు. అరెస్టు చేసిన పోలీసులు కానీ , జైలు అధికారులు కానీ ఏ ఒక్కరినీ ఆ చిన్నారుల రోదనలు కదిలించలేకపోయాయి. ఈ విషయంపై ప్రతి రోజూ HMTV వార్తలు ప్రసారం చేయడం, ఆ ఛానల్ ప్రతినిధి నాగేందర్, సీపీఐ ఎం ఎల్ న్యూ డమాక్రసీ నాయకుళు రంగారావు తదితరుల చేసిన ప్రయత్నం వల్ల 9 రోజుల తర్వాత ఆ చిన్నారులిద్దరూ ఇవ్వాళ్ళ తల్లితండ్రులను కలుసుకోగలిగారు. ఆ చిన్నారులు తల్లి తండ్రులను చూసిన వెంటనే పరుగున వెళ్ళి కౌగలించుకోవడం, వాళ్ళిద్దరినీ అక్కునజేర్చుకొని ఆ తల్లితండ్రులు బోరుమనడం అక్కడున్నవాళ్ళందరినీ కంటతడి పెట్టించింది. ఆ దృశ్యాలు టీవీల్లో చూసిన వాళ్ళకు కూడా దుఖం రాక మానదు ఒక్క పాలకులకు తప్ప.

Keywords : adivasi, forest department, khmmam, police, jail
(2024-04-24 18:10:40)



No. of visitors : 1797

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అమ్మ‌