include 'men';
?>
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
కులం.. కులం.. కులం.. ప్రస్తుతం దేశంలో అగ్రకుల అహంకారమే నడుస్తోంది. వారి అరాచకాలే పెచ్చుమీరిపోతున్నాయ్. మిర్యాలగూడ మారుతీరావు లాంటి వాళ్లు దేశంలోని ప్రతీ ఊరిలో.. ప్రతీ గల్లీలో కనపడుతూనే ఉన్నారు. దళితులను తమ ఇంటివాళ్లుగా చేసుకోవడానికి మనసొప్పక ఏకంగా హత్యలు చేస్తున్నారు. మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయిస్తే.. ఈ గుజరాతీ మారుతీరావు ఏకంగా పోలీసుల ముందే అల్లుడిని తెగనరికాడు.
గుజరాత్లోని కచ్ ప్రాంతంలో వర్సమోడీ అనే గ్రామానికి చెందిన హరేష్ సోలంకి ఒక దళితుడు. అహ్మదాబాద్ సమీపంలోని వార్మోర్ గ్రామానికి చెందిన ఊర్మిళ అనే యువతి రాజ్పుత్ కులానికి చెందింది. వీళ్లు గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే ఊర్మిళ గర్భవతి కావడంతో రెండు నెలల క్రితం ఆమె పుట్టింటికి వచ్చింది. ఆమెను తీసుకెళ్లాలని హరేష్ అనుకున్నాడు. అయితే వాళ్ల పుట్టింటి వాళ్ల ఇబ్బంది పెడతారేమోనని ముందుగానే ఊహించిన హరేష్ మహిళా సహాయ కేంద్రాన్ని సంప్రదించాడు.
గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ʹఅభయంʹ సహాయ కేంద్రానికి వెళ్లి పూర్తి విషయం వివరించాడు. అక్కడి సిబ్బంది.. సరే మీ భార్యను మేం తీసుకొని వస్తామని చెప్పారు. దానికి హరేష్.. మీరు వెళ్లిగా ఆ గ్రామంలో ఎవరూ కూడా మీకు ఆ ఇంటి అడ్రస్ చెప్పరు.. ఆ ఊరిలో మా మామయ్య దశరథ్ సిన్హా చాలా పలుకుబడిన వ్యక్తి,, కాబట్టి మీతో పాటు నేను వస్తానని చెప్పాడు.
దీంతో హరేష్తో పాటు ఒక మహిళా కానిస్టేబుల్, అభయం కౌన్సిలర్ భవిక కలసి అక్కడికి వెళ్లారు.
హరేష్ పోలీసు కారులోనే ఉండగా.. భవిక, కానిస్టేబుల్ కలసి దశరథ్ సిన్హా ఇంటిలోకి వెళ్లి మాట్లాడారు. మరో నెల రోజుల్లో నా కూతురుని పంపుతానని చెప్పడంతో వాళ్లు వెనుదిరిగారు. వారితో కలసి బయటకు వచ్చిన దశరథ్ కారులో హరేష్ ఉండటం చూశాడు.
వెంటనే బిగ్గరగా కేకలు వేస్తూ.. "నా బిడ్డను తీసుకెళ్లింది ఒక హరిజనుడు. అతడు డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు. అతన్ని బయటకు లాగి చంపేయండి" అని అనుచరులకు చెప్పాడు. వెంటనే ఎనిమిది మంది వ్యక్తులు కత్తులు, కొడవళ్లతో కారును చుట్టు ముట్టి హరేష్ను విచక్షణా రహితంగా నరికారు.
ఆ సమయంలో పోలీసు కానిస్టేబుల్ ఉన్నా.. తాను నిరాయుధురాలు కావడంతో ఏం చేయలేక పోయింది. భవిక వెంటనే బలగాలు పంపమని పోలీసులకు చెప్పడంతో సాయుధులైన వారు అక్కడికి చేరుకున్నారు. కాని అప్పటికే హరేష్ చనిపోయాడు.
కేవలం ఒక హరిజనుడిని పెండ్లి చేసుకుందనే కోపంతో.. అప్పటికీ కూతురు గర్భవతి అని కూడా ఆలోచించకుండా విచక్షణా రహితంగా అల్లుడిని చంపడం గుజరాత్లో సంచలనం సృష్టించింది.
Keywords : Maruti Rao, Caste, Gujarat, Dasharath Sinha, Rajputh, Dalith
(2024-03-08 20:10:45)
No. of visitors : 3157
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..