ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!

ఏపీ

జగన్ గారూ,

ఆ 23 మంది గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మీ పుణ్యాన మా హక్కుల్ని కాలరాచిన వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సి వస్తోంది. మాట్లాడితే 23 అంటారు. మీరు గెలిచారు సరే. ఆ 23 మంది కూడా పాపం మీ లాగే డబ్బు ఖర్చు పెట్టుకొని, ఓట్ల కొనుక్కొచ్చుకున్నారు. వాళ్ళూ మీ జాతి వాళ్ళే. మీ పద్ధతిలో గెలిచారు కనకనే అసెంబ్లీకి వచ్చారు. వాళ్ళ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు. కానీ మిమ్మల్ని, మీ వాళ్ళను కోరుకున్నట్లుగా, 23 నియోజకవర్గాల్లో ఓటు వేసిన వారిలో మెజారిటీ ప్రజలు వాళ్ళ కోసం బటన్ నొక్కారు. మీ జాతి వాళ్ళనే మీరు పురుగుల్లా చూస్తున్నారే. రా, చూసుకుందాం అంటారు. మేం లేస్తే మీరు పారిపోతారు అంటారు. మెజారిటీ బలం ఇందుకేనా? అసెంబ్లీలో మైనార్టీని లెక్క చెయ్యని మీరు ఇక నోరు లేని, ముఖం లేని జనాన్ని ఏం చూస్తారు? అందుకే, మూడు రోజులుగా మీ ఇంటికాడ ఆందోళన చేస్తున్న జనం మీ కళ్ళకు ఆనలేదు.

మేం లేస్తే మీరు పారిపోతారు అంటున్నారు. పారిపోకపోతే తరుముతున్నారు. పులివెందుల గ్రామాల లాగానే, రాష్ట్రంలో చాలా గ్రామాలున్నాయి. జనం ఎవరో ఒకరి పంచనో చెరకపోతే బతకలేరు. పించన్ కావాలన్నా, వాచ్ మెన్ పని కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా ఏ నాయకున్నో ఆశ్రయించక తప్పదు. ఎవరి దగ్గర పని జరుగుతుందో వాళ్ళ దగ్గరికే పోతారు. మీ వాళ్ళూ అంతేగా! ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీలోకి చేరిపోతారు. అట్లా ఆశయించిన మామూలు జనాన్ని తరుముతున్నారే! మీరు సాధించిన మెజారిటీ అవతలి పార్టీ అశ్రితుల్ని తరమడానికి, వాళ్ళు పొందుతున్న అతి స్వల్ప ప్రయోజనాలను లాక్కోడానికి పనికొస్తోంది. మీరేమో అసెంబ్లీలో, మీ తమ్ముళ్లేమో ఊర్లల్లో.. రాజన్న రాజ్యాన్ని బాగా నెలకొల్పుతున్నారు. విషాదమేమిటంటే గెలిచినా, ఓడినా గొప్పోళ్ళు మీరు మీరుగానే ఉంటారు. బుద్ధిలేక, గత్యంతరం లేక మీ పంచన చేరినవాళ్ళు చస్తారు. మీరిట్లాగే అరుస్తుంటే చంద్రబాబు అసెంబ్లీ నుండి వాకౌట్ అంటాడు. మీలాగే ఊళ్లు పట్టుకొని తిరుగుతాడు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటాడు. ఏమైనా మీమీ డెమాక్రసీలకు జరిగే డామేజ్ పెద్దగా ఉండదు. జనం మాత్రం బతుకు తెరువులు, బతుకులు కోల్పోతారు.

మీ కాన్వాయ్ అంబులెన్స్‌కు దారి ఇవ్వడమే మాకెంత మురిపెమో. ఒక అత్యవసర పౌరధర్మం సి.యం. అంతటివాడు పాటించాడు చూడండి అని చెప్పుకుంటున్నారు. తమను తాము ఎంతో అల్పజీవులం అనుకునే ప్రజలు పాపం. నిజమే. నెలకింత పించన్ దానం చేసే గోప్పోల్లకు దాన్ని మహాప్రసాదంగా అందుకొనే ప్రజలు కనిపిస్తారా? అసెంబ్లీలో మిమ్మల్ని చూసి భయమేసింది. ʹఅయితే ఏంటిʹ అని తలెగరేసే మీ నాయన కన్నా ఇంకా భయంకరంగా కనపడుతున్నారు మీరు. ఇలాంటి తలపొగరు జనాన్ని ఏం చేస్తుందా అని భయం.

చంద్రబాబు తక్కువ చేసాడా అంటారు. లేదు. అక్కడ ఆయన మీమీద గుడ్లురిమి చూసిందానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ జనం మీద జులుం చేసాడు. మెజారిటీ బలం ఉందని ఎవర్నీ మాట్లాడనివ్వలేదు. జనాన్ని కనీసం ఏడవనివ్వలేదు. తమ గోడు వేల్లబోసుకోనీకి ధర్నా చేయడానిక్కూడా లేదన్నాడు. పోలీస్ స్టేషన్ కు పోయి మాకు ఫలానా సమస్య ఉంది, మేం ఏడవచ్చా అండీ అని పర్మిషన్ తీసుకోవాలని ఆర్డర్ వేసాడు. ఇప్పుడు వయసు కన్నా గౌరవమివ్వమని ఏడ్చే స్థితికొచ్చాడు. ఇప్పుడు మీది ఇంకా పెద్ద మెజారిటీ. అంటే ఇంకా ఎక్కువ అధికారం. కాబట్టి ఇది చంద్రబాబు మీదో, ప్రతిపక్షం మీదో సానుభూతి కాదు. అంతకంతకూ విశృంఖలమవుతున్న ʹఅధికారంʹ గురించి ఆందోళన.

ఇట్లు

మాటిమాటికీ ప్రజాస్వామ్యం గుర్తుచేసే మూర్ఖులు
అభివృద్ధి నిరోధకులు
అర్బన్ నక్సలైట్లు

- పి. వరలక్ష్మీ, విరసం.
(ఫేస్‌బుక్ పోస్టు)

Keywords : YS Jagan, AP CM, Chandrababu, Assembly, Urban Maoists
(2024-03-09 10:18:25)



No. of visitors : 3935

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఏపీ