ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ప్రతి

ప్రతి ఎన్ కౌంటర్ ను హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఇవ్వాళ్ళ (18 జూలై, 2019) తీర్పునిచ్చింది. 2009 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్ కౌంట‌ర్ జరిగినప్పుడు ప్రతీ సారి ఎఫ్ఫైఆర్ నమోదు చేయాలని ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలన్న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం, ఏపీ పోలీసు అధికారుల సంఘం సుప్రీంకోర్టుకు వెళ్ళగా పదేళ్ళ తర్వాత ఇవ్వాళ్ళ దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి‍ంది. ఈ కేసు పూర్వాపరాలపై వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్...

ఒక చిన్న ఆశారేఖ

ఎన్ కౌంటర్లను హత్యా నేరం కింద విచారించాలన్న సుప్రీం కోర్టు

మిత్రులారా, చుట్టూ అలముకుంటున్న గాఢాంధకారంలో ఒక సన్నని ఆశారేఖలా, 2009 ఫిబ్రవరి 6న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇవాళ సుప్రీం కోర్టు ఎత్తిపట్టింది. ఆ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు ప్రతి ఎన్ కౌంటర్ సందర్భంలోను అందులో పాల్గొన్న పోలీసులపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ ఐ ఆర్) నమోదు చేయాలని, వారిపై హత్యా నేరం కింద ఐపిసి సెక్షన్ 302 కింద విచారించాలనీ ఆదేశించింది. ఆ తీర్పుపై స్టే విధిస్తూ 2009 మార్చ్ 4న తాను ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఇవాళ తొలగించింది. ఆ తీర్పును కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించింది.

ఈ కేసు చరిత్ర ఆసక్తికరమైనది: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. ఆ రిట్ మీద 2009 ఫిబ్రవరి 6న జస్టిస్ గోడ రఘురాం, జస్టిస్ వివిఎస్ రావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జి భవానీప్రసాద్ ల బెంచి తీర్పు చెప్పింది. ఆ తీర్పులో ʹతన విధుల నిర్వహణలో భాగంగా గాని, భాగంగా అని చెప్పుకుని గాని, ఆత్మరక్షణకు అని చెప్పుకుని గాని ఒక పోలీసు అధికారి ఎవరైనా ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు, ఆ పరిస్థితులను నమోదు చేస్తూ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు రిజిస్టర్ చేయాలిʹ అని ఆ తీర్పులో చెప్పారు.

ఆ చట్ట పరిభాషకు అర్థమేమంటే, ఒక ఎన్ కౌంటర్ మరణం జరగగానే ఎఫ్ ఐ ఆర్ తయారైందంటే, అందులో పాల్గొన్న పోలీసు అధికారుల పేర్లు నమోదు కావాలి, వారి మీద హత్యా నేరానికి దర్యాప్తు జరగాలి. దొరికిన సాక్ష్యాధారాల ప్రకారం చార్జి షీట్ తయారు కావాలి. వారి మీద న్యాయస్థానంలో విచారణ జరగాలి.

రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించేహక్కును, ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తున్న ఈ తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయవలసింది. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం వెంటనే ఈ తీర్పును కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. సుప్రీంకోర్టు కూడ తక్షణమే మధ్యంతర ఉత్తర్వుగా ఆ తీర్పు మీద స్టే ఇచ్చి, విచారణను వాయిదా వేసింది.

ఆ విచారణ అలా పది సంవత్సరాలు సాగి, చివరికి ఇవాళ తీర్పు వెలువడింది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద స్టేను ఎత్తివేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు అధికారుల సంఘం అభ్యర్థనలను కొట్టివేసింది, హైకోర్టు తీర్పు చట్టబద్ధమైనదేనని నిర్ధారించింది.
ఈ కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటిది కాబట్టి, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు విభజిత రాష్ట్రాలకూ వర్తిస్తుంది.

ఇప్పుడిక ప్రతి ఎన్ కౌంటర్, ప్రతి చట్టవ్యతిరేక హత్య కేసులోనూ 2009 హైకోర్టు తీర్పును అక్షరాలా అమలు చేయాలని, దాని స్ఫూర్తిని ఎత్తిపట్టాలని విశాల ఉద్యమం నిర్మించవలసిన సమయం ఆసన్నమైంది.

ఈ సందర్భంలో, ఇంతకాలంగా ఈ కేసును ముందుకు నడిపిన పౌరహక్కుల సంఘం బాధ్యులకూ, ఈ కేసులో వాదనలు వినిపించిన న్యాయవాదులందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ కౌంటర్ హత్యల చరిత్ర గురించి 2007 అక్టోబర్ 13 ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో అచ్చయిన నా వ్యాసాన్ని మీతో పంచుకుంటున్నాను.
-ఎన్.వేణుగోపాల్

Keywords : supreme court, high court, maoists, police, encounter, case, murder case
(2024-04-18 17:04:49)



No. of visitors : 2914

Suggested Posts


ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు

తల్లిని విడిచి తాము ఉండలేమని , తమను మళ్ళీ అడవిలోనే వదిలివేయాలని అధికార్ల కాళ్ళా వేళ్ళా పడ్డారు ఆదివాసులు. బోరున విలపించారు కొందరు... తమను తమ అడవితల్లి దగ్గరికి చేర్చేదాంక అన్నం ముట్టబోమని ఏ ఒక్కరూ అన్నం తిన లేదు. ʹమాకు మీ ఇళ్ళొద్దు...మీ భూములొద్దు మా ఊరికి పంపించండిʹ అంటూ ఆ అడవి బిడ్డల రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది పాలకులకు తప్ప.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రతి