45 మందిని చంపి నదిలో తోసేసిన‌ పోలీసుల హత్యాకాండపై...ఓ ఐపీఎస్ అధికారి పుస్తకం... ʹహాషీంపురా 22, మేʹ

45

ఈ పుస్తకం తెలుగులో త్వరలో రానుంది
ʹహాషీంపురా 22, మేʹ
మరుగునపడ్డ పోలీసు హత్యాకాండ
రచన : విభుతి నారాయణ రాయ్‌
తెలుగు : వి.వి.జ్యోతి
ప్రచురణ : మలుపు బుక్స్‌

ఢిల్లీ హైకోర్టు 2018 అక్టోబర్‌ 31న ఇచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పులో పదహారు మంది పోలీసు కానిస్టేబుళ్లకు హత్యానేరంపై యావజ్జీవ శిక్ష విధించింది. ప్రొవిన్షియల్‌ అర్మ్‌ డ్‌ కాన్‌ స్టేబులరీ (పిఎసి) కి చెందిన ఆ పోలీసులు 1987 మే 22న మీరట్‌ శివార్లలోని హాషింపురాలో ముస్లిం యువకులను నిర్బంధించి, అందులో నలబై రెండు మందిని కాల్చిచంపారనేది ఆరోపణ. ఆ నేరాన్ని విచారించిన ఢిల్లీలోని తీస్‌ హజారీ సెషన్స్‌ కోర్టు 2015 మార్చ్‌ 21న తగిన సాక్ష్యాధారాలు లేవంటూ వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ తీర్పు హైకోర్టులో పునర్విచారణకు వచ్చింది.

హత్యలు జరిగినరోజున దినకూలీలు, నేతపనివాళ్లు అయిన దాదాపు నలబై ఐదు మంది ముస్లిం యువకులను పిఎసి పోలీసులు ట్రక్కు ఎక్కించి ఘజియాబాద్‌ జిల్లా మురాద్‌ నగర్‌ లో ఎగువ గంగ కాలువ దగ్గర కాల్చిచంపి మృతదేహాలను కాలువలోకి తోసేశారు. చనిపోయినట్టు నటించి కాలువలో ఈదుతూ బైటపడిన ప్రత్యక్షసాక్షి కథనం మేరకు, పౌరహక్కుల సంఘాల ఒత్తిడి మీద హత్యాకాండ కేసు నమోదయింది. చార్జిషీట్‌ దాఖలు చేయడానికి పది సంవత్సరాలు, దాని మీద విచారణ కొనసాగించడానికి మరొక పది సంవత్సరాలు తాత్సారం చేసి, సుప్రీం కోర్టు జోక్యంతో విచారణ జరిపి, చివరికి హత్యాకాండ జరిగిన 28 ఏళ్లకు సెషన్స్‌ కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. కాని హత్యాకాండ జరిగినప్పుడు ఒక ఫొటో జర్నలిస్టు తీసిన ఫొటోలు హతుల నిర్బంధానికి, హత్యకు నిస్సందేహమైన ఆధారంగా ఉన్నాయని నిర్ధారించిన జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌, జస్టిస్‌ వినోద్‌ గోయల్‌ లు పదహారు మంది పోలీసులకు యావజ్జీవ శిక్ష విధించారు. మరొక ముగ్గురు నిందితులు విచారణ క్రమంలో సహజమరణంతో శిక్ష తప్పించుకున్నారు.

ఈ దారుణ మారణకాండను సన్నిహితంగా పరిశీలించిన అప్పటి ఘజియాబాద్‌ పోలీసు సూపరింటెండెంట్‌, రచయిత విభూతి నారాయణ్‌ రాయ్‌ నవలా రూపంలో వ్యక్తీకరించిన ఆగ్రహ ప్రకటన ఇది.

- ఎన్‌. వేణుగోపాల్







Keywords : hashimpura, police, murders, vibhuthi narayana roy, malupu, book
(2024-04-24 18:04:57)



No. of visitors : 1231

Suggested Posts


కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌

ఏదో జరగబోతోందన్న సూచనలు కనిపించాయి. అదే జరగబోతోందన్న ఊహలు కూడా వినిపించాయి. అయినా, ఆగస్టు 5వ తేదీ ఉదయం ఖచ్చితంగా అదే జరిగేటప్పటికి దిగ్భ్రాంతి. ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయిన పరిస్థితి. అనేక వాదనల, ఆలోచనల, ఊహల, పరిష్కారాల- ప్రాతిపదికలన్నిటికీ కాళ్లకింద నేల కదిలిపోయింది. మన హ దయాలు కోతపడి, మెదళ్లు స్తంభించిపోయిన ఆ సమయంలోనే, వెనువెంటనే, నూతన పరిస్థితుల నవీ

నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌

ఈ దేశంలో బూటకపు కేసులు బనాయించి అనేక మంది ముస్లింలను, దళితులను, విప్లవ కారులను, ప్రజా పక్షం వహించే మేదావులను జైళ్ళలోకి నెడుతున్నారు పాలకులు. అలా జైళ్ళలో దశాబ్దాల తరబడి మగ్గి నిర్దోషులుగా బైట‌డినవాళ్ళే ఎక్కువ మంది.

నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల

అల్లం రాజయ్య రాసిన ఈ సైరన్‌ నవలను చదివితే తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గత నలభై, యాభై యేండ్ల కింద రైతాంగం, ఆదివాసులు, సింగరేణి కార్మిక వర్గపు స్థితిగతులు ఎలా ఉండేవో తెలిసి వస్తాయి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


45