మూకదాడులను ఖండిస్తూ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై కోర్టులో పిటిషన్

మూకదాడులను

ఎన్డీయే ప్రభుత్వం హయాంలో దేశవ్యాప్తంగా పెరిగిపోయిన మూక దాడులు, విద్వేశపూరిత నేరాలు పెరిగి పోయాయని.. వెంటనే వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు రంగాలకు చెందిన ప్రముఖలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బీహార్ కోర్టులో ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్లను ఉటంకిస్తూ కేసు నమోదు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.

ఈ నెల 23న 49 మంది ప్రముఖులు ప్రధానికి లేఖ రాశారు. వీరిలో రేవతి, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యామ్ బెనగల్, అపర్ణా సేన్, గాయని శుభా ముగ్దల్, చరిత్రకారుడు రామచంద్రగుహ వంటి మేధావులు ఉన్నారు. వీరి లేఖ వల్ల దేశం పరువు పోయిందని.. వీరు దేశద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా కోర్టులో పిటిషన్ వేశారు.

వీళ్లు చేసిన పని దేశ సమగ్రతకు భగం కలిగించేదిగా ఉందని.. మతపరమైన మనోభావాలను గాయపరిచారని సదరు న్యాయవాది చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్డీకి విన్నవించారు. అంతే కాకుండా 49 మంది లేఖను వ్యతిరేకిస్తూ మోడీకి లేఖ రాసిన 61 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. సాక్షుల్లో కంగనా రనౌత్, మధుర్ భండార్కర్, వివేక అగ్నిహోత్రి వంటి వాళ్లు ఉన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై అగస్టు 3న విచారణ జరుగనుంది.

గత కొన్నాళ్లుగా దేశంలో మూకదాడులు పెరిగిపోయిన మాట వాస్తవమే. ఒక వర్గం ప్రజల చేత బలవంతంగా ʹజై శ్రీరాంʹ అనిపించడం.. లేకపోతే దాడులు చేసిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనల్లో పలువురు తీవ్ర గాయాలపాలవ్వడమో లేదా మరణించడమో జరిగింది. ఈ విషయాన్నే మోడీ దృష్టికి ఆ 49 మంది తీసుకొని వెళ్లారు. ʹజై శ్రీరాంʹ అనడం ఒక రెచ్చగొట్టే నినాదంగా మారింది.. అలా అనకపోవడం నేరమా అని వీరు ప్రశ్నించారు.

ఇప్పుడు వీళ్లు ఇలా అడగటం రాజద్రోహం అని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మరింత దారుణం. ఇటీవలే యూఏపీఏ చట్టానికి సవరణ తీసుకొని వచ్చి ఎవరినైనా టెర్రరిస్టుగా అరెస్టు చేసేలా మార్పులు చేశారు. ఏకంగా హోం మంత్రే అర్బన్ నక్సల్స్‌ను ఉపేక్షించేది లేదని లోక్‌సభలో ప్రకటించారు. ఇప్పుడు ప్రశ్నించడమే నేరమైపోయింది.

ప్రస్తుత ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాయడమే ఈ కోర్టు పిటిషన్ అని పలువురు భావిస్తున్నారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఒక వర్గం పని చేయడం గమనార్హం. అగస్టు 3న విచారణకు వచ్చే ఈ అంశం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Keywords : Bihar Court, Eminent Citizens, Modi , Lynchings, Hate Crimes
(2024-03-27 17:47:04)



No. of visitors : 812

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మూకదాడులను