న్యూడెమాక్రసీ నేత లింగన్నను కాల్చి చంపిన పోలీసులు ... పోలీసులకు ప్రజలకు ఘర్షణ‌


న్యూడెమాక్రసీ నేత లింగన్నను కాల్చి చంపిన పోలీసులు ... పోలీసులకు ప్రజలకు ఘర్షణ‌

ఎన్ కౌంటర్ లు లేని, నెత్తురు చిందని తెలంగాణ తెస్త అని తెలంగాణ ఉద్యమం సమయంలో ఉపన్యాసాలు ఇచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుండి తెలంగాణల నెత్తురు పారిస్తూనే ఉన్నడు. బూటకపు ఎన్ కౌంటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ల జరిగినట్టే జరుగుతూనే ఉన్నాయి.
ఇవ్వాళ్ళ పొద్దున భద్రాద్రి కొత్త గూడెం జిల్లాఅడవుల్లో పోలీసులు నెత్తురు పారించారు. గుండాల మండలం రోళ్లగడ్డ అడవి ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ దళం పై దాడి చేసిన పోలీసులు న్యూ డెమాక్రసీ రాష్ట్ర కమిటీ సబ్యుడు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి లింగన్న ను కాల్చి చంపారు. మరో ఐదుగురు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది.
లింగన్నను పోలీసులు కాల్చి చంపిన సమయంలో అక్కడికి చేరుకున్న చుట్టు పక్క గ్రామాల ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగారు. తమ అన్నను అన్యాయంగా కాల్చి చంపారని ఆరోపిస్తూ పోలీసులపైకి వెళ్ళారు. కొద్ది దూరం పోలీసులను తరిమి కొట్టారు. ఈ సమయంలో పోలీసులు గాలి లోకి కాల్పులు జరిపారు. అయినా ప్రజలు వెన్ను చూపలేదు.

మరో వైపు లింగన్నది ఎన్ కౌంటర్ కాదని చిత్రహింసలు పెట్టి చంపారని వివిధ సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనను సీపీఐ ఎంల్ న్యూడెమాక్రసీ, తెలంగాణ ప్రజా స్వామిక వేదిక, ఏఐకేఎమ్మెస్,పీవైఎల్,ఐఎఫ్ టీయూ, పీడీఎస్యూ, ఓపీడీఆర్లు తీవ్రంగా ఖండించాయి. వాళ్ళు విడుదల చేసిన మీడియా ప్రకటనలు యదాతథంగా....

హరితహారం పేరుతో అడవుల్లో నెత్తురు పారిస్తున్నా కేసీఆర్.

సి.పి.ఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కా.లింగన్న బూటకపు ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండించండి.
*ఎన్ కౌంటర్లు లేని సమాజం కోసం పోరాడండి.
- తెలంగాణ ప్రజా స్వామిక వేదిక
పత్రికా ప్రకటన

ప్రియమైన ప్రజలారా,ప్రజాస్వామిక వాదులారా!!

గోదావరిలోయ పోరాట యోధుడు, సి.పి.ఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్. లింగన్న ను తెలంగాణా లోని గుండాల మండల అడవుల్లో ఈ రోజు పోలీసులు చుట్టుముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపి బూటకపు ఎన్ కౌంటర్ చెయ్యడాన్నీ తెలంగాణ సమాజం మొత్తం ఖండించాలని టీడీప్ పిలుపుణిస్తుంది.
పోడు భూములు లాక్కుని ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను చేయడానికి కెసిఆర్ ప్రభుత్వం అమానుషంగా దాడికి ,బీభత్సకాండకు పాల్పడుతోంది.
అందులో భాగంగానే ఇవాళ ప్రజలకు అండగా ఉన్న ఉద్యమకారులను కాల్చివేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేక ఉద్యమ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్భంధము చేయడము, ఊపా చట్టాన్ని ఉపోయోగించి,ఉద్యమ కారులను భూటకపు ఎన్కౌంటర్ లు చేసి పాలకులు చంపుతున్నారు.
హరితహారం పేరుతో అటవీ భూములను కార్పొరేట్ కంపెణీలకి అప్పగించి అడవి నుండి ఆదివాసీలను తరిమివేయడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు,ప్రజా స్వామిక వాదులు ఆదివాసీల భూముల రక్షణ కోసం సాగిస్తున్న పోరాటానికి అండగా ఉండాలని పిలుపుణిస్తుంది.
ప్రజా ఉద్యమాలను అణచివేయడాని కేంద్రంలో నరేంద్రమోదీ బి.జె.పి, రాష్ట్రంలో టీ. ఆర్.యస్ ప్రభుత్వం ఒకే తాటి పై నడుచుకుంటూ రాజ్యాంగాన్నీ తుంగలోతొక్కుతున్నవి.
ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాశవిక దాడిని తీవ్రంగా ఖండించి విశాల ఐక్యఉద్యమముతో ఎన్ కౌంటర్లు లేని సమాజము కోసము ఉద్యమిద్దామని తెలంగాణ ప్రజా స్వామిక వేదిక పిలుపుణిస్తుంది.

డిమాండ్స్:
ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసుల పై హత్య నేరము కింద పోలీసుల పై కేసు నమోదు చేయాలి.
సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రజా స్వామిక వందనాలతో
తెలంగాణ ప్రజా స్వామిక వేదిక
కన్వీనర్స్ కమిటీ
ప్రొ. హరగోపాల్, జైనీ మల్లయ్య గుప్తా,ప్రొ.PLV విశ్వేశ్వరరావు, చిక్కుడు ప్రభాకర్,POW సంద్య, గురిజల రవీందర్,కోట శ్రీనివాస్, ప్రొ.లక్ష్మీ నారాయణ,ప్రొ. పద్మ షా,బండి దుర్గాప్రసాద్

పూనేం లింగన్న ఎన్కౌంటర్ హత్యను ఖండించండి.
పోలీసుల అదుపులో ఉన్న నాయకులను విడుదల చేయాలి.

ఈ రోజు తెల్లవారు జామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామ సమీపంలో లింగన్న దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు లింగన్న ను చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. మరి కొద్ది మంది సభ్యులను పోలీసులు అదుపులో ఉంచుకున్నట్లు తెలుస్తుంది వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు.
ఆదివాసి బిడ్డగా పుట్టిన లింగన్న విప్లవ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు. 1977 నుండి తన జీవితాన్ని పీడిత ప్రజల కోసం వెచ్చించాడు. దళ సభ్యుడిగా నాయకుడిగా 23 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను దృఢంగా ప్రతిఘటిస్తూ వస్తున్నాడు.
గత కొంతకాలంగా లింగన్న ను వెంటాడుతూ వస్తున్నారు. ఆదివాసి చట్టాలను నిర్వీర్య పరచడం ,హరితహారం పేరుతో పోడు భూములను గుంజు కుంటున్నారు. అటవీ సంపదని స్మగ్లర్స్ ,బహుళజాతి కంపెనీలు కొల్లగొడుతున్నారు. మల్టీ నేషనల్ కంపెనీల పెట్టుబడులతో ఆదివాసి ప్రాంతంలోని ఖనిజాలను దోచుకొనుటకు వీలుగా లింగన్న ను హత్య చేశారు. ఆదివాసీల పై జరుగుతున్న దమనకాండలో భాగమే లింగన్న హత్య.
లింగన్న ను హత్య చేసిన వారిపై హత్య నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఘటనపై న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలి.
------ లింగన్న హత్యను ఖండించిన వారు AIKMS జిల్లా నాయకులు బి హర్జ,PYL జిల్లా కార్యదర్శి మోకాళ్ల రమేష్ ,IFTUఏరియా కార్యదర్శి ఎల్ రవి,PDSU జిల్లా అధ్యక్షుడు ఎ సాంబ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
యదళ్ళపల్లి సత్యం
జిల్లా కమిటి సభ్యులు
సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ

Keywords : bhadradri kottagudem, telangana, fake encounter, cpiml new democracy
(2023-05-28 02:06:42)



No. of visitors : 1879

Suggested Posts


ʹనా తండ్రిని పోలీసులు పట్టుకొని హింసలు పెట్టి కాల్చి చంపారుʹ

న తండ్రిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని బుధవారంనాడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకుడు లింగన్న కుమారుడు హరిఆరోపించారు.

న్యూ డెమాక్రసీ నేత లింగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరపాలి..హైకోర్టు ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ రాష్ట్ర కమిటీ సబ్యుడు లింగన్న మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని

నాటి ఎమర్జెన్సీ నాటి కంటే ఈ నాటి పరిస్థితులు మరింత ప్రమాదకరం -ప్రొఫెసర్ హరగోపాల్

46 వ ఎమర్జెన్సీ దినం సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ "ఎమర్జెన్సీ నాడు - నేడు" అనే అంశం పై జూన్ 26 న ఆన్లైన్ బహిరంగ సభ ను నిర్వహించింది.ఈ సభ కు సీపీఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరావు

న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌

సి.పి.ఐ. (యం.యల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యుడుగా, ఇ.ఎఫ్.టి.యు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉద్యమ బాధ్యతలు చూస్తున్న కా॥ ముఖ్తార్ పాష 2020 సెప్టెంబర్ 24న, కార్పోరేట్ క్రూర కరోనాతో అమరుడైన విషయం తెలిసిందే.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!

అనేక దశాబ్దాలుగా పొడుగొట్టి తమ జీవనాన్ని సాగిస్తున్న పోడు రైతులను ఈనాడు పెద్ద ఎత్తున పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో మోహరించి తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.అందులో భాగంగానే ఈ రోజు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని

Search Engine

RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
more..


న్యూడెమాక్రసీ