include 'men';
?>
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
"కశ్మీర్లో అంతా ప్రశాంతంగా ఉంది.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అత్యధిక మంది కశ్మీరీలు ఆనందోత్సాహాలతో ఉన్నారు.. నిరసన తెలిపిన వాళ్లు కూడా 100 మంది కంటే ఎక్కువ లేరు"- ఇదీ బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వ పెద్దలు గత కొన్ని రోజులుగా మీడియాకు చెప్పుకుంటూ వస్తోంది. నిజంగా కశ్మీరీలు సంతోషంగా ఉన్నారా..? 370 ఆర్టికల్ రద్దు తర్వాత 10 వేల మందికి పైగా శ్రీనగర్లో నిరసన తెలియజేయలేదా అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి సిద్దంగా లేదు. అంతా అబద్దమే అని కొట్టిపారేస్తోంది.
కాని అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి కొంత మంది మేధావులు, హక్కుల కార్యకర్తలు జమ్ము, కశ్మీర్లో పర్యటించారు. దానికి సంబంధించిన వాస్తవాలను చెప్పడానికి ఇవాళ ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రిపోర్టు తయారు చేసిన వాళ్లో ప్రముఖ ఆర్థివేత్త జీన్ డ్రీజ్, రాజకీయ కార్యకర్త కవితా క్రిష్ణన్ వంటి వాళ్లు ఉన్నారు. ఐదు రోజుల పాటు జమ్ముకశ్మీర్లో పర్యటించి ఈ రిపోర్టును తయారు చేశారు. అక్కడి వాస్తవ సంఘటనలను చిత్రీకరించిన వీడియోలతో ఒక 10 నిమిషాల డాక్యుమెంటరీ కూడా రూపొందించారు.
కాగా, తీరా ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు సదరు డాక్యుమెంటరీ వీడియోను ప్రదర్శించవద్దని ప్రెస్ క్లబ్ అధికారులు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఉన్న ప్రొజెక్టర్ను కూడా ఉపయోగించవద్దని వాళ్లు హుకుం జారీ చేశారు. ఇది కూడా రాతపూర్వకంగా కాకుండా అనధికారికంగా మాటల్లో చెప్పారు. తమపై చాలా ఒత్తిడి ఉందని, ఇక్కడ నిఘా కూడా కొనసాగుతోందని అన్నారు. మీడియా సమావేశం నిర్వహించుకోండి కాని వీడియోలను ప్రదర్శించవద్దని వాళ్లు చెప్పారు. అవసరమైతే ఆ వీడియోలను సీడీల రూపంలో విలేకరులకు ఇవ్వమని ఒక సలహా ఇచ్చారు. దీంతో ప్రెస్ కాన్ఫరెన్స్లో పూర్తి విషయాలు చెప్పలేకపోయామని కశ్మీర్లో పర్యటించిన బృందం చెప్పింది.
ఈ ఒక్క ఘటన చాలు ప్రభుత్వం కశ్మీర్లో జరుగుతున్న అణచివేత బయటకు పొక్కకుండా ఎంత జాగ్రత్త పడుతోందో.. ! కశ్మీర్లో ప్రజలు పూర్తి అణచివేతకు గురవుతున్నారని.. అక్కడ కనీసం ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదని బీబీసీ రిపోర్టు చేసినా ప్రభుత్వం మాత్రం తమ పని తాను చేసుకొని పోతోంది.
Keywords : Kashmir, Article 370, Press Club of India, Delhi
(2024-03-09 05:34:15)
No. of visitors : 1060
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..