మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

మాన‌సిక

శుక్ర‌వారం తెల్ల‌వారుజాము 3గంట‌ల‌కు బారాముల్లాకు చెందిన ఫాతిమా అనే మ‌హిళను అప‌స్మార‌క‌ స్థితిలో ఆమె కుటుంబ స‌భ్యులు శ్రీన‌గ‌ర్‌లోని SHMS హాస్పిట‌ల్‌కి తీసుకు వ‌చ్చారు. అనేక సెక్యురిటీ చెక్ పోస్టుల‌ను దాటుకుంటూ... భ‌ద్ర‌తా సిబ్బందికి సమాధానాలు చెప్పుకుంటూ రాత్రి పూట అతి క‌ష్టం మీద వాళ్లు ఆసుప‌త్రి చేరుకున్నారు. ప‌రీక్ష‌ల అనంత‌రం ఫాతిమా మాన‌సిక ఆందోళ‌న‌తో బాధ‌ప‌డుతోంద‌ని వైద్యులు తేల్చారు. త‌న కుటుంబ స‌భ్యుల భ‌ద్ర‌త గురించి కంగారు ప‌డుతున్న‌ఆ మ‌హిళ వారం రోజులుగా భ‌యాందోళ‌న‌ల‌తో వ‌ణికి పోతోంది.

ఫాతిమా లాగే, కుప్వారాకు చెందిన న‌జీర్ అహ్మ‌ద్. అప‌స్మార‌క స్థితిలో ఉన్న న‌జీర్‌ను రాత్రికి రాత్రి కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఫాతిమా, న‌జీర్ మాత్ర‌మే కాదు, ఇప్పుడు.. క‌శ్మీర్‌లో వంద‌లాది మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రి పాల‌వుతున్నారు.

ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న వెనువెంట‌నే క‌శ్మీర్‌లో ప‌రిస్థితులు వేగంగా మారిపోయాయి. ల‌క్ష‌లాది సైన్యం మోహ‌రింపుతో క‌శ్మీర్ ఒక చెర‌సాల‌గా మారింది. క‌శ్మీర్‌లో లోయ‌లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్తితులు ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఫ‌లితంగా... ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు డ‌క్క‌న్ క్రానిక‌ల్ ప‌త్రిక‌కు తెలిపారు. SHMS ఆసుప‌త్రి రికార్డుల ప్ర‌కారం ఆగ‌స్టు 5 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 550 మంది మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రిలో చేరారు. ఇలాంటి మాన‌సిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారిలో అన్ని వ‌య‌సులవారు ఉన్నారు. ఇలా ఆసుప‌త్రి వస్తున్న కేసుల్లో 85 కేసుల్లో రోగులు అప‌స్మార‌క స్తితిలోనే ఆసుప‌త్రికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న ఉంద‌ని, ఆ ఒత్తిడి కార‌ణంగా మాన‌సిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని, ఇది మ‌రింత తీవ్ర స్థాయికి చేరుకునే ప్ర‌మాదం ఉంద‌ని డాక్ట‌ర్ హుస్సేన్ తెలిపారు. నేను చాలా భ‌య‌ప‌డ్డాను. గ‌త ప‌దిరోజులుగా నిద్ర‌కూడా లేదు. ప్ర‌స్తుత ప‌రిస్తితుల కార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రిలో ఆందోళ‌న, భ‌యం నెల‌కొన్నది. ఈ ప‌రిస్తితి తొల‌గిపోవాల‌ని వేడుకుంటున్నాను. అని ఆసుప‌త్రిలో చేరిన హ‌మీద్ మీర్ భార్య తెలిపారు.

రోగుల‌కు ఆరు నుంచి ఎనిమిది గంట‌ల పాటు హాస్ప‌ట‌ల్ వార్డులో చికిత్స అందించిన త‌రువాత డిశ్చార్జ్ చేస్తున్నామ‌ని ఓ లేడి డాక్ట‌ర్ తెలిపారు. రోజుల‌కు అవ‌స‌ర‌మైన కౌన్సిలింగ్ అందిస్తున్నామ‌ని ఆమె తెలిపారు.

అధిక శాతం రోగులు అర్థ‌రాత్రి నుంచి తెల్ల‌వారుజాము ప్రాంతంలో ఆసుప‌త్రికి వ‌స్తున్నార‌ని, ఆ స‌మ‌యంలోనే వారు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ని వైద్యులు తెలిపారు. ఆగ‌స్టు 5 నుంచి ఆసుప‌త్రికి వ‌స్తున్న వంద‌లాది మంది పేషెంట్ల‌ ఒత్తిడి, ఆందోళ‌నకు ప్ర‌స్థుతం క‌శ్మీర్‌లో నెల‌కొన్న ప‌రిస్తితులే కార‌ణ‌మ‌ని వైద్యులు అంటున్నారు.

షోపియాన్‌, కుప్వారా, బారాముల్లా, ఖాజిగూడ త‌దిత‌ర సుదూర ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు వ‌స్తున్నార‌ని, వారిలో తెలియ‌ని ఆందోళ‌న క‌నిపిస్తోంద‌ని రిజిస్టేష‌న్ విభాగంలో ప‌నిచేసే ఎండీ ర‌యీస్ తెలిపారు. రోజువారి దిన పూర్తిగా మారిపోయింద‌ని, ఈ వాతావ‌ర‌ణం పిల్ల‌లపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని డాక్ట‌ర్ హుస్సేన్ అంటున్నారు.

పిల్ల‌ల‌కు ఆట పాట‌లు మాత్ర‌మే కాదు... క‌నీసం మాట‌లు కూడా క‌రువ‌య్యాయ‌ని, క‌నీసం ఫోన్‌లో కూడా ఎవ‌రితో మాట్లాడ‌లేని స్తితి నెల‌కొన్న‌ద‌ని, ఇది పిల్ల‌ల మాన‌సిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని అంటున్నారు. పిల్ల‌లో నెగెటివ్‌ మ‌న‌స్త‌త్వానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని అంటున్నారు.

(డ‌క్క‌న్ క్రానిక‌ల్ సౌజ‌న్యంతో...)

Keywords : kashmir, anxiety, depression, Mental suffering, article 370, 35(a)
(2024-04-24 17:58:29)



No. of visitors : 3066

Suggested Posts


పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మాన‌సిక