పోలీసుల దుర్మార్గం - వింటేనే ఒళ్లు జలదరించే చిత్రహింసలు
కరెంట్ షాక్లు, మర్మాంగాలకు ఇటుకలను వేలాడదీయడం, అత్యాచార బెదిరింపులు, లైంగిక దాడులు, నగ్నంగా వేలాడదీయడాలు, మర్మావయవాల్లో కారం దూర్చడం, తలకిందులుగా వేలాడదీయడాలు... ఖైదీల పట్ల హర్యానా పోలీసులు అనుసరిస్తున్న హింసాత్మక చర్యల్లో మచ్చుకు కొన్ని ఇవి. తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైన ఒళ్లు గగుర్పొడిచే కఠోర వాస్తవాలివి.
హర్యానా రాష్ట్ర న్యాయ సేవా సంస్థ కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇన్షియేటివ్స్కి చెందిన శబికా అబ్బాస్, మధురిమ ధనుకలతో నియమించిన కమిషన్ తాజాగా వెల్లడించిన ʹఇన్సైడ్ హర్యానా ప్రిజన్స్ʹ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 19 జైళ్లలోని 475 మంది ఖైదీలతో సంభాషించిన బృందం ఈ నివేదికను రూపొందించింది. వందలాది మంది ఖైదీలు రాష్ట్రంలోని జైళ్లలో ఎదుర్కొంటున్న అమానవీయ స్థితిగతుల్ని, అరెస్టు తరువాత పోలీసుల చేతుల్లో అనుభవిస్తున్న క్రూరమైన చిత్రహింసల గురించి నివేదిక వెల్లడించింది.
అధ్యయనంలో భాగంగా ఇంటర్వ్యూ చేసిన 227 మంది దాదాపు 47 శాతం మంది ఖైదీలు పోలీసు రిమాండ్లో అత్యంత హింసను అనుభవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
హర్యానా ముఖ్యమంత్రి, పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు న్యాయ నిపుణులు, జైలు అధికారుల సమక్షంలో ముగ్గురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ నివేదికను ఇటీవల విడుదల చేశారు.
మెజార్టీ ఖైదీల చిత్రహింసలకు హర్యానా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (CIA) యే కారణమని సర్వే గుర్తించింది. అరెస్టు చేసిన వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు CIA వారిని బలవంతంగా, చట్టవిరుద్ధంగా నిర్బంధించిదని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో CIA యూనిట్లు ఉన్నాయని నివేదిక పేర్కొంది.
హర్యానాలో CIA హింసను వ్యవ్యస్థీకృతం చేసిందని, ఇలాంటి దర్యాప్తు, విచారణ పద్ధతుల్లో CIA సభ్యులు రాటుదేలారని సామాజికవేత్త ఏఆర్ దేశాయి, ʹభారతదేశంలో ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనʹ పుస్తకంలో పేర్కొన్నట్లు నివేదిక ఉటంకించింది.
చాలా మంది ఖైదీలు పోలీసుల చిత్రహింసల వల్ల తీవ్ర అంతర్గత గాయాలతో బాధపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అలా.. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఈ ఏడాది ప్రారంభంలో అరెస్టయిన కుమార్ అనే వ్యక్తిని కమిషన్ గుర్తించింది. ʹపోలీసులు నన్ను అదే పనిగా కొట్టడం మాత్రమే కాదు.. నా మర్మాంగానికి తాడుతో ఇటుకను కట్టి వేలాడదీసేవాళ్లు, ఇటుకను బలంగా లాగే వాళ్లుʹ అని కుమార్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది.
కుమార్ని చిత్రహింసలకు గురిచేసిందీ... హర్యానా పోలీస్ క్రైమ్ బ్రాంచ్కి చెందిన CIA యూనిట్ అని, శరీరంలో తీవ్రమైన అంతర్గత గాయాల వల్ల అతడు కనీసం నడవలేకపోతున్నాడని, కస్టడీలో ఉండగానే అతడికి రెండు సార్లు ఆపరేషన్ జరిగిందని నివేదికలో పేర్కొన్నారు.
వైద్యుల స్థితిని కూడా నివేదిక వెల్లడించింది. చికిత్స సందర్భంగా తన వాంగ్మూలాన్ని హిసార్ సెంట్రల్ జైలు వైద్య అధికారి నమోదు చేసుకోలేదని కుమార్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. అరెస్టయ్యే నాటికి అతడి వయసు 17 సంవత్సరాలు మాత్రమే, కానీ పోలీసులు రికార్డుల్లో అతడి వయస్సును తప్పుగా సూచించారంటూ కుమార్ తెలిపినట్లు నివేదికలో వెల్లడించారు.
హర్యానా పోలీసులు అనుసరించే పలు చిత్రహింసా పద్ధతులను నివేదిక పేర్కొన్నది. శరీరంపై ఎలాంటి గుర్తులూ కనిపించకుండా అరికాళ్లపై లాఠీలతో కొట్టడం, నీళ్లలో ముంచడం, తలకిందులుగా వేలాడదీయడం, పిక్కలపై లాఠీలతో బాదడం, కరెంట్ షాక్ ఇవ్వడం లాంటి పద్దతులను అనుసరించే వారని పేర్కొంది. వీటిని నిరూపించడం, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేయడం కూడా బాధితులకు సాధ్యమయ్యే ది కాదు.
తన ఎనిమిది రోజుల పోలీసు కస్టడీలో నాసికా రంద్రాల్లో నీటి ధారను పంపడం, తలపై కొట్టడం, కరెంట్ షాక్ ఇవ్వడం లాంటి తీవ్ర హింసను ఎదుర్కొన్నట్లు అంబాల సెంట్రల్ జైలులోని జస్జీత్ అనే విచారణ ఖైదీ తెలిపాడు.
పానిపట్ జైలులో సల్మాన్ అనే జువెనెల్ ఖైదీని అతడు చేయని నేరాన్ని అతడితో ఒప్పించేందుకు పోలీసులు అరికాళ్లపై లాఠీలతో తీవ్రంగా కొట్టారు. నాసికా రంద్రాల గుండా నీటిని బలవంతంగా పంపారు. మర్మావయవాలకు కరెంట్ షాక్ ఇచ్చారు.
సుమిత్ అనే ఖైదీ పోలీస్ టార్చర్ సందర్భంగా ట్రామాకు గురయ్యారు. వారం రోజుల పాటు నేను పోలీసు కస్టడీలో ఉన్నాను. లాఠీలతో నన్ను పదే పదే తీవ్రంగా కొట్టారు. అంతే కాదు.. నీళ్లలో ముంచారు. నన్ను నగ్నం తలకిందులుగా వేలాడదీశారు అంటూ చెప్పినట్లు నివేదికలో పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా చాలా మంది మహిళా ఖైదీలు లైంగిక దాడులు, అత్యాచార బెదిరింపులు ఎదుర్కొన్నట్లు నివేదిక పేర్కొన్నది.
రీమా అనే ఖైదీని మద్యం సేవించిన పోలీసు ఒకరు తనను సెల్లో నగ్నంగా పడేసి మర్మావయాల వద్ద చిత్రహింసలు పెట్టినట్లు, పోలీసును ప్రతిఘటిస్తే.. కరెంట్ ఇచ్చేవారని నివేదికలో పేర్కొన్నారు. కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా ఏడు రోజుల పాటు తనను అక్రమంగా నిర్బంధించారని, ఈ క్రమంలో ఆమెను మగ పోలీసులే చిత్రహింసలకు గురించేశారని పేర్కొన్నారు.
39 సంవత్సరాల జైనబ్ అనే మహిళది సైతం ఇటువంటి అనుభవమే. 15- 16 గంటలు తనను పోలీస్ కస్టడీలో ఉంచుకున్నారని, తనను ఓ మగ పోలీసు ముందు దుస్తులు తొలగించమన్నారని, అత్యచారం చేస్తామంటూ బెదిరించారని బృంద సభ్యలతో తెలిపింది. ఇలాంటి ఘటనలు హర్యానా పోలీస్ స్టేషన్లలో సర్వ సాదారణమంటూ నివేదిక పేర్కొంది. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఇందు అనే మహిళ తీవ్ర చిత్రహింసలను అనుభవించిందంటూ నివేదికలో పేర్కొన్నారు.
ఓ పోలీసు అధికారి.. తన తొడలపై కాలు మోపి, దుస్తులు తొలగించాలని బెదిరించాడని, తన మర్మాంగంలో మిరపకాయలు దూర్చాడని ఆంచల్ అనే మహిళ అధ్యయన బృందంతో తెలిపింది. మూడు రోజుల పాటు కరెంట్ షాక్ ఇస్తూ, అదే పనిగా తనను చితకబాదారని తెలిపింది. పోలీసుల బెదిరింపుల వల్ల ఈ విషయాలను తాను వైద్యుల ముందు, న్యాయమూర్తి ముందు వెల్లడించలేదంటూ ఆంచల్ అధ్యయన బృందానికి తెలిపింది.
ఇన్ని కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చినా... ఒక్క జైలు కూడా ఖైదీల నుంచి వచ్చిన ఫిర్యాదులను అంగీకరించలేదు. ఈ మొత్తం కేసుల్లో కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇన్షియేటివ్ హక్కుల ఉల్లంఘనను గుర్తించింది. కస్టోడియల్ హింసను గుర్తించేలా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడంతో పాటు, అలాంటి వాటిపై తగు చర్యలు తీసుకోవల్సిన అవసరాన్ని గుర్తించింది.
- గౌరవ్ వివేక్ భట్నాగర్
(కథనంలో ఖైదీల పేర్లు మార్చబడినవి)
source : www.thewire.in
Keywords : police, haryana, prison, torture, violence
(2024-03-22 08:04:43)
No. of visitors : 2837
Suggested Posts
| రాక్షస పోలీసులు.... దళిత మహిళను నడి రోడ్డు మీద బట్టలూడదీసి కొట్టారుతమ ఇంట్లో దొంగతనం జరిగింది చర్య తీసుకోండంటూ వచ్చిన ఓ దళిత కుటుంభంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో సునీల్ గౌతమ్ |
| డేరింగ్ కానిస్టేబుల్ !ఆ కానిస్టేబుల్ సాహసానికి సెల్యూట్ చేయాల్సిందే ! అతను 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. అందుకోసం ఆయన తన ప్రాణాలగురించి కూడా ఆలోచించలేదు. |
| వాట్సప్ అడ్మిన్ లూ... జర జాగ్రత్త !వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేయడం, దానికి అడ్మిన్ గా ఉండటం, అందులో ఫ్రెండ్స్ అందరినీ చేర్చడం చాలా మందికి ఇష్టం. అయితే అడ్మిన్ గా ఉండటం అంత ఈజీ కాదు.... |
| వాళ్ళు పోలీసులు....!కొందరు తాగితే మనుషులు కాదు.... కొందరికి కోపమొస్తే మనుషులు కాదు.... కానీ వీళ్ళు యూనిఫామ్ తొడిగితే మనుషులు కాదు. వాళ్ళ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు..... |
| యజమానురాలి అక్కసు... పోలీసుల కర్కషత్వం... ఓ యువతిపై థర్డ్ డిగ్రీతన ఇంట్లో పని మానేసినందుకు ఓ యజమానురాలికి పని మనిషిపై కోపమొచ్చింది. అమెను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేసింది. పోలీసులేమో తమ చేయి దురద తీర్చుకునేందుకు ఓ మనిషి దొరికిందనే పైశాచికానందంలో ఆ పని మనిషిని చితకబాదారు..... |
| HCU విద్యార్థినులను అత్యాచారం చేస్తామని బెధిరించిన పోలీసులు - నిజ నిర్దారణ కమిటి రిపోర్ట్హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వర్శిటీలో నిరసనలు జరుగుతున్న వేళ, వాటిని అణచి వేయడమే లక్ష్యంగా విరుచుకుపడ్డ పోలీసులు విద్యార్థినులపై అత్యాచారం చేస్తామని బెదిరించారని, యువతులను ఇష్టానుసారం.... |
| మానవ మృగాలు !కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కీచకులు ఓ దళిత యువతి (20)ని చెరబట్టారు.. అన్నా... దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నన్ను వదిలిపెట్టండి.. లేకుంటే నేను చచ్చిపోతా.. అని దీనంగా వేడుకున్నా.... |
| మృత దేహం మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్ళిన పోలీసులు !సీసీ ఫుటేజ్ ద్వారా బయట పడ్డ బీహార్ పోలీసుల అమానుషత్వం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బీహార్ వైశాలి జిల్లాలో గల గంగానదిలో తేలిన ఓ వ్యక్తి శవాన్ని గుర్తించిన గ్రామస్థులు బాడీని బయటకు.... |
| రామోజీ హోటల్ పేకాట స్థావరం !ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కు చెందిన హోటల్ జూదగాళ్ళకు అడ్డాగా మారిందా ? కొంత కాలంగా ఆ హోటల్లో పేకాట జోరుగా సాగుతోందా ? పోలీసు వర్గాలు అవుననడమే కాదు మంగళవారం నాడు ఆహోటల్ పై దాడి చేసి... |
| హింసా రాజ్యం !నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఒక ముసలి అతన్ని గూండాలు కర్రలతో కొట్టి చంపారు. అహమ్మదాబాద్ లో ఓ ఎనిమిదిమంది యువ గూండాలు ఓ పాన్ షాప్ దగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావల్సిన.... |