జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం, బుగ్గ గ్రామపంచాయతీ పరిధి లోని బుడుగుల గ్రామం లో బుధవారం,21 ఆగస్టు 2019 న ఎన్కౌంటర్ లో జాడి వీరస్వామి మరణించినాడని పోలీసుల చెబుతున్న కథనం నిజానిజాలు తెలుసుకునేందుకు పౌరహక్కుల సంఘం ఆ ప్రాంతాన్ని పర్యటించి స్థానికలతో మాట్లాడింది. అనేక మందితో మాట్లాడి పౌరహక్కుల సంఘం వచ్చిన నిర్దారణ్లపై ఓ ప్రకట్న విడుదల చేసింది ఆ ప్రకటన పూర్తి పాఠం...

పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రకమిటీ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ అధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఈరోజు ఆదివారం,25 ఆగస్టు,2019 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం, బుగ్గ గ్రామపంచాయతీ పరిధి లోని బుడుగుల గ్రామం లో బుధవారం,21 ఆగస్టు 2019 న ఎన్కౌంటర్ లో జాడి వీరస్వామి మరణించినాడని పోలీస్ కథనంపై గ్రామస్తులను కలిసి మరియు ఎన్కౌంటర్ గా చెప్పబడినసంఘటన స్థలాన్ని పరిశీలించి సేకరించిన నిజానిర్దారణ వివరాలు.
మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటలకు కాల్చిచంపినారు పోలీసులు.వెట్టినందయ్య,పద్దమ్ రాంబాబు,పద్దమ్ మాసయ్య మరియు పద్దమ్ నగేష్ లను పోలీసులు తీవ్ర చిత్రహింసలు బూటు కాళ్లతో కిందపడవేసి బాగా కొడితే వెట్టి నందయ్య మరుసటిరోజు 22,ఆగస్టు,2019 న చనిపోయాడు...
జాడి వీరస్వామిని తీవ్రంగా చిత్రహింసలు చేసి పోలీసులు తుపాకీతో చంపి ఎన్కౌంటర్ అనడం ముమ్మాటికీ అవాస్తవం.అది హత్యే. కేసీ ప్రభుత్వం చేసిన హత్య...
జాడి వీరస్వామిని పాశవికంగా హత్యచేసి,వెట్టి నందయ్యను బాగా చిత్రహింసలుచేసి చంపినందుకు,పోలీసులపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యానేరం కేసు నమోదు చెయ్యాలి...
వెట్టి నందయ్య కుటుంబానికి 50 లక్షల రూపాయలు exgratia చెల్లించి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి,ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ప్రభుత్వం ఇవ్వాలి.
ఆర్టికల్ 21,ప్రకారం అదివాసీలపై జీవించే హక్కు,కల్పిస్తూ,ఆదివాసులపై పోలీస్ దాడులు,కూంబింగ్ లు నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది...

1.N.నారాయణ రావు, ప్రదాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ రాష్ట్రం.
2.K.రవి,ఉపాధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం, తెలంగాణ రాష్ట్రం.
3.మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం, తెలంగాణ రాష్ట్రం.
4.నంబురి శ్రీమన్నారాయణ,రాష్ట్ర సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం,ఆంధ్రప్రదేశ్.
5.p. విప్లవ కుమార్,ప్రదాన కార్యదర్శి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘము.
6.D.శిరిషా,vice president,ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘము.
7..కె.శ్రీనివాసరావు,సహాయ కార్యదర్శి,ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘము.
8.ఉపేంద్ర.సహాయ కార్యదర్శి,ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘము...
9.నాగేంద్రబాబు, కోశాదికారి.ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘము.
10.దుర్గారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు.ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘము.
11.నాగేశ్వరరావు.జిల్లా కమిటీ సభ్యులు.ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘము...
..4-30 గంటలు,సాయంత్రం,ఆదివారం,25,ఆగస్టు,2019,,..బుడుగుల,గ్రామం,బుగ్గ,గ్రామ పంచాయతీ.
మణుగూరు,మండలం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..తెలంగాణ రాష్ట్రం..

Keywords : fake encounter, telangana, maoists, police
(2025-03-15 15:52:11)
No. of visitors : 2655
Suggested Posts
| ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది. |
| ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. |
| ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులుఅక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస |
| సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘంGDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. |
| CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన పాలకులపై పోరాడుదాం
ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే. |
|
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹచత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు. |
| మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టుపెద్దపల్లి జిల్లా మంథని పోలీస్స్టేషన్లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది. |
| ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన
14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది. |
| ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడలో పౌరహక్కుల సంఘం సభవిజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్గిరి ఎన్కౌంటర్ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర..... |
| అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు తల్లిని విడిచి తాము ఉండలేమని , తమను మళ్ళీ అడవిలోనే వదిలివేయాలని అధికార్ల కాళ్ళా వేళ్ళా పడ్డారు ఆదివాసులు. బోరున విలపించారు కొందరు... తమను తమ అడవితల్లి దగ్గరికి చేర్చేదాంక అన్నం ముట్టబోమని ఏ ఒక్కరూ అన్నం తిన లేదు. ʹమాకు మీ ఇళ్ళొద్దు...మీ భూములొద్దు మా ఊరికి పంపించండిʹ అంటూ ఆ అడవి బిడ్డల రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది పాలకులకు తప్ప. |