include 'men';
?>
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది యురేనియం తవ్వకాల గురించే. తెలంగాణలోని నల్లమల ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని.. వాటిని వెలికితీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వాటి వల్ల సంభవించే నష్టాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే కడప జిల్లా వాసుల కష్టాలు తెలుసుకోవాలి. కడప జిల్లాలో యురేనియం తవ్వకాల వల్ల వల్ల వచ్చిన నష్టాలు, ప్రమాదాల గురించి వరలక్ష్మి తన ఫేస్బుక్పై ఒక పోస్టు పెట్టారు. అది యధాతథంగా...
----------------------------------
"మా జీవాలు (గొర్రెలు, మేకలు) గడ్డి తినడం మానేసినాయి. గుట్టెక్కుతాంటే గసపోసుకోబట్టె. నోట్లోనుంచి సొంగ కార్చుకునె. బురుగులు (నురగలు) కక్కుకోని అట్టనే పడి సచ్చిపాయె.." కనంపల్లెలో ఉండేదంతా సుగాలీలే. గుట్టల వాలుగా ఊరు. ఆ గుట్టల్లోకి గోర్లు తోలుకొనిపోయి మేపుకుంటారు. గొప్పగా బతికేవాళ్ళు కాదుగానీ, ఏదో బతుకుతెరువుకింత ఉండేది. కొంత మందికి భూములు కూడా ఉన్నాయి. యురేనియం తవ్వకాలు మొదలై వ్యర్థాలు ఏ నియంత్రణ లేకుండా అక్కడ పారబోయడం మొదలైయ్యాక ఊరికి ʹచేతబడిʹ చేసినట్లయ్యింది. ఇప్పుడా భూముల్లో పంటలు పండవు. వందలకొద్దీ జీవాలు చచ్చిపోతే గుట్టుచప్పుడు కాకుండా UCIL వాళ్ళు తలా ఇంత డబ్బిచ్చి విషయం బైటికి పొక్కకుండా చూసుకున్నారు.
యురేనియం తవ్వకాల కోసం ఆ ఊర్లో భూములు తీసుకుంటారని తెలిసినప్పుడు 2006లో మొదటిసారి ఆ గ్రామం వెళ్లాం. అట్లా గ్రామాలు తిరిగడం అప్పుడు నాకు కొత్త. బాలగోపాల్ గారు గ్రామస్తులతో మాట్లాడిన మాటలు మాకు బాగా గుర్తు. ఈ పక్కనే యురేనియం వ్యర్థాలు నిలువ చేసే చెరువు వస్తుంది. అందరికన్నా ఎక్కువ ʹకొట్టాలʹ (ఇప్పుడు టెయిలింగ్ పాండ్ ఉండే ఊరు) వాళ్ళు, మీరు నష్టపోతారు అన్నారాయన. ఇప్పుడు కొట్టాల గ్రామంలో ఎవరిని పలకరించినా అంతుచిక్కని రోగాల గురించి చెప్తారు. ఒళ్ళంతా దురదలు, మంటలు పుట్టి చర్మం రంగు మారడం, చిట్లిపోవడం, దద్దుర్లు, పొక్కులు రావడం అక్కడ మామూలు. వీటికి తోడు కాళ్ళు, చేతులు ఒకటే నొప్పులు.
భూమయ్యగారి పల్లె రైతులు యురేనియం మైనింగ్ ప్లాంటును తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసు కేసులయ్యి జైలుకెళ్ళారు. చివరికి వైఎస్ కుటుంబం ముందు ఓడిపోయారు. ఊరు కాస్త తగ్గులో ఉంది. బోరు వ్యవసాయం. ఎక్కడ చూసినా అరటి తోటలు కనిపిస్తాయి. ఇది రాయలసీమలా లేదు అన్నారు అప్పట్లో మాతో పాటు ఆ ఊర్లు చూడ్డానికి వచ్చినవాళ్ళు. ఇప్పుడక్కడ 1200 అడుగులు బోరు వేస్తె కానీ నీళ్ళు పడవు. పడినా కొన్ని నెలల లోపలే నీళ్ళు పడిపోతాయి. రైతులు కదా, పంట మీద ఆశ చావక మళ్ళీ బోరు వేస్తారు. ఇట్లా ఊరంతా చెట్లు మొలిచినట్లు బోర్లు వెలిసాయి. ఒక్కో రైతు పది పన్నెండు బోర్లు వేసాడు. ఇట్లా ఇంకెన్ని రోజులు వేయగాలరో, ఎంత ధార మిగిలి ఉందో గానీ ఆ నీళ్ళు చూస్తే భయమేసింది. బాత్రూం వెళితే ఏదో హారర్ సినిమాలాగా బకెట్ లో ఎర్రగా నీళ్ళు. ఒక్కోసారి జిడ్డుగా వస్తాయట. నీళ్ళు నిలువ చేసిన పాత్రల్లో సుద్దలాగా తెల్లని పొడి పేరుకుపోతుంది. ఈ నీళ్ళతో స్నానం చేస్తున్నందుకే ఒళ్ళంతా దురదలు, పుండ్లు. ఈ ఊర్లో చిన్న పిల్లలకు కూడా ఒళ్ళు నొప్పులే అని చేత్తో నాలుగడుగుల ఎత్తు చూపించి "ఇదో ఇంత పిల్లోల్లు కూడా నొప్పులు అంటాండారు" అని చెప్పారు. గిడ్డంగివారిపల్లెలో ఈ లక్షణాలు ఇటీవలే మొదలయ్యాయి. సుమారు యాభై ఏళ్ళ వయసున్న ఒక రైతు "ఈ ఊర్లో ఇంగ మాదే చివరి తరం" అన్నాడు. ఆ పక్కనే ఉన్న బక్కన్నగారి పల్లెలోనూ ఇదే కథ.
పులివెందుల పులుల బారినపడ్డ మేకలు. ఎవరు కాపాడాలి వీళ్ళని? ఆరేళ్ళ తర్వాత ఆ పల్లెలకు వెళితే ఒకరిద్దరు గుర్తుపట్టి "బాగుండావ్ మ్మా" అని పలకరిస్తే.. నిజం చెప్పొద్దూ...ఏడుపొచ్చింది. పదేళ్ళ క్రితం యురేనియం ఉద్యమం ఇక ఓడిపోయింది అని తెలిసొస్తున్నప్పుడు వాళ్ళన్న మాటలు జీవితంలో మర్చిపోలేను. "యురేనియం ఎప్పుడో సంపుతాది. కాదంటే రాశ్శేకర్రెడ్డోల్లు ఇప్పుడే సంపుతారు." అప్పుడే ఒకవ్వ బకాసురుని కథ చెప్పింది. చెప్పి "బండి అన్నం పంపమంటే పంపుతాము. రోజుకొక మనిషిని యాడ పంపేది" అంది. ఇప్పుడింత జరిగి సర్వ నాశనం అయ్యేటప్పుడు కూడా తలెత్తని ఆవేశాలను చూస్తే ʹఇదిరా నాయనా రాయలసీమ... బానిస బతుకుల పౌరుష గడ్డʹ అనాలనిపిస్తుంది. రాయలసీమంటే, పులివెందులంటే ఏమో అనుకునేరు..! నలభై ఏళ్ళుగా ఒక్క కుటుంబం అన్ని ఊర్ల జనాన్ని తన కాళ్ళ కింద పెట్టుకుందంటే ఇది కదా వెనకబాటుతనం. ఇది కదా అసలు దౌర్భాగ్యం!
అసలు విషయం. గురువారం ఉదయం 11 గంటలకు కడప జిల్లా యురేనియం బాధిత ప్రజలు విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసుకు తమ బాధలు చెప్పుకోనీకి వస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రజాసంఘాల మిత్రులు వాళ్లకు మద్దతుగా అక్కడే ఆఫీసు ముందు నిరసనలో పాల్గొనాల్సిందిగా మనవి. ఇది ముందుగా అనుకున్నది కాదు కాబట్టి, ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయాం.
- వరలక్ష్మీ విరసం
ఫేస్బుక్ లింక్ : https://www.facebook.com/varalakshmi.puduru/posts/2479304978797891
Keywords : Kadapa, Uranium, Excavation, Nallamala, Telangana, AP, India, BARC, NFC
(2024-03-11 01:38:04)
No. of visitors : 1883
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..