include 'men';
?>
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు కదం తొక్కారు. అఖిలపక్షం ఇచ్చిన బంద్ పిలుపుతో నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్, పదర మండలాల్లో సంపూర్ణ బంద్ జరిగింది. బంద్ సందర్భంగా పోలీసులు నాయకులను అరెశ్తు చేయడంతో ఆగ్రహించిన వేలాది జనం పోలీసు స్టేషన్ చుట్టుముట్టారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి జనంతో నిండిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
నల్లమల నుంచి యురేనియం వెలికితీయవద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ చేయడంతో పాటు ఈగలపెంట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగర్కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ, అఖిల పక్ష నాయకులు, యురేనియం వ్యతిరేక పోరాట జేఏసీ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొనడంతో వారిని అరెస్టు చేసి ఈగలపెంట పోలీస్ స్టేషన్కు తరలించారు.
నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపడం వల్ల నల్లమల ప్రాంతంలోని 110 చెంచుపెంటలు, వన్యప్రాణులు, అటవీ సంపద నాశనం అయ్యే అవకాశం ఉందని.. వెంటనే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు సై అనడంతో స్థానికులు కూడా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని అంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి, యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని అంటున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
ఇవాళ జరిగిన బంద్, ఆందోళన కార్యక్రమాల్లో నల్లమల ప్రాంతంలోని వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు స్వచ్చందంగా పాల్గొన్నారు. యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎంత దూరమైనా వెళ్తామని వాళ్లు హెచ్చరించారు.
Keywords : uranium,nallamala, agitations, wild life, adivasis, krishna river
(2024-03-09 06:34:17)
No. of visitors : 1049
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..