దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు


యురేనియం తవ్వకాలకు సంబందించి యురేనియం నమునాలను సేకరించడానికి యుసిఐఎల్ సంస్థ(యురేనియం కార్పొరేషన్ ఆప్ ఇండియా)
వేయబోయే బోర్ పాయింట్లను గుర్తించడానికి నిన్న(9/9/2019) రాత్రి 8 గంటలకు జియోలాజికల్ సర్వే ఆప్ ఇండియాకు చెందిన ప్రత్యేక బస్ లో సుమారు 30 ముంది జియాలాజిస్ట్ లు (వారికి తెలుగురాదు)దేవరకొండ లోని విష్ణు ప్రియ లాడ్జ్ కి చేరుకోవడం జరిగింది. ఈ విషయంపై రాత్రి 10 గంటల ప్రాంతంలో సమాచారం అందిన వెంటనే తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కమిటి స్పందించి దేవరకొండ ప్రాంతానికి చెందిన విద్యావంతుల వేదిక సబ్యులకు,దళిత యువజన జేఏసి,విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం అందించడం జరిగింది.

*సన్నద్దమైన విద్యావంతుల వేదిక*

మంగళవారం ఉదయం 6 గంటలకే విద్యావంతుల వేదిక సబ్యులు లాడ్జ్ ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి వాళ్లు యురేనియం కు సంబందించిన వారు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేసా‌రు. జియోలాజికల్ సర్వే సంస్థకు సంబందించిన వారని,
వేరే సర్వే కోసం వచ్చారని పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.


అయినప్పటికీ అక్కడ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విద్యావంతుల వేదిక సబ్యులు ఎంతకు వినిపించుకోక పోవడంతో పోలీసులు జియాలాజిస్ట్ లు బస చేసిన హోటల్ లోకి ప్రవేశించి జియోలాజికల్ సర్వే వారితో మంతనాలు జరిపారు.ఇరువై నిమిషాల చర్చల అనంతరం పోలీసులు ,జియాలాజికల్ సర్వే వారు హోటల్ నుంచి వెలుపలకు వచ్చారు. తాము జియాలాజిస్ట్ లమని, ప్రయోగాలు చేయడానికి వచ్చామని ఒక పత్రం ఇచ్చారు. స్పందించిన నాయకులు యురేనియం పేరుతో ప్రయోగాలకు, పరిశోధనలకు ఈ నల్లమల్ల, దేవరకొండ లో తావులేదని, వెంటనే ఇక్కడి నుంచి వెల్లిపోవాలని డిమాండ్ చేసారు.కొద్దిసేపు,జియాలాజికల్ సర్వే ఆప్ ఇండియా వారికి,విద్యావంతుల వేదిక బృందానికి గలాట జరుగడంతో పోలీసులు జోక్యం చేసుకొని నాయకులను పక్కకు తప్పించి ఆ అధికారులను అక్కడి నుంచి పంపించడం జరిగింది.అనంతరం అధికారుల బస్సు హైదరాబాద్ వైపు వెళ్ళిపోయింది.

ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక బాధ్యులు ఎర్ర క్రిష్ణ జాంస‌న్ మాట్లాడుతూ--- నల్లమల్ల లో యురేనియం పేరుతో ఏలాంటి సర్వేలు,పరిశోధనలు జరపడానికి వీలు లేదన్నారు.అన్యాయం గా ఈ ప్రాంతం పై ఆధిపత్యం చేసి యురేనియం తవ్వకాలు జరపాలని చూస్తే సహించేది లేదన్నారు.ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్న గిరిజన ఆదివాసి జీవితాలను బుగ్గి పాలు చేయోద్దన్నారు.అనేక ఉధ్యమాలకు పురుడు పోసిన ఈ గడ్డ పై అణు విధ్వంసానికి చోటు లేదన్నారు.ఇక్కడి ప్రజలతో మమేకమై యురేనియం వ్యతిరేక ఉధ్యమాన్ని మరింత ముంధుకు తీసుకపోతామన్నారు. ఈ అందోళన కార్యక్రమంలో నాయకులు కొర్ర రాంసింగ్, లక్ష్మణ్ నాయక్, వలమల్ల ఆంజనేయులు,ఎస్.శ్రీనివాస్, కట్రావత్ రాజు, పొట్ట ప్రభు, ఎర్ర నగేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్లమల్ల పై ప్రయోగాలను సహించం :
విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు.

విష ప్రయోగాలకు నల్లమల్ల అటవి ప్రాంతంలో చోటులేదని, యురేనియం పేరుతో విధ్వంసక అభివృద్ధి ఈ ప్రాంతంలో అవసరం లేదన్నారు. మానవాళిని, జీవ కోటిని నాశనం చేసే అభివృద్ధి అవసరం లేదని, అభివృద్ధి ప్రజల కోణంలో జరగాలే తప్ప కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే కోణంలో కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పాలకులకు ఉందన్నారు.

Keywords : uranium, nalgonda, devarakonda, police
(2024-04-24 17:49:55)



No. of visitors : 1238

Suggested Posts


ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ

ఈ విదేశీ కంపెనీలన్నీ.. బిజినెస్​ పేరుతో 200 ఏళ్లు, వలస పాలనతో మరో 200 ఏళ్లు ఇండియాని నిలువునా దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ సంతతివే కావటం గమనార్హం. ఈ నిజాలు బయటపెట్టకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలు చెబుతూ యురేనియం కార్పొరేషన్ ప్రజలను మోసగిస్తోంది. ప్రకృతితో పరాచికాలాడాలని ప్రయత్నిస్తోంది. సూర్యాపేట జిల్లాలోనూ అన్వేషణ యురేనియం కోసమే కానీ బంగారం కోసం క

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


దేవరకొండలో