include 'men';
?>
ఐదు దశాబ్దాల వసంతగానం
మలుపు ప్రచురణగా
విప్లవ సాహిత్య విమర్శ మూడు సంపుటాలు
ఐదు దశాబ్దాల వసంతగానం
————————————-
వర్గపోరాట ఆచరణలో
1. విప్లవ సాహిత్య సిద్ధాంతం
2. తెలుగు సాహిత్య చరిత్ర-ఉద్యమాలు
3. విప్లవ సాహిత్య విమర్శ
సంపాదకులు : పాణి
తెలుగు సృజనాత్మక, మేధో రంగాల్లో విప్లవ సాహిత్యోద్యమ కృషికి సాహిత్య విమర్శ ఒక బలమైన ఉదాహరణ. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు మన దేశంలో వర్గపోరాటాన్ని రంగం మీదికి తీసుకొని వచ్చాయి. ఈ ప్రభావం అన్ని జీవన రంగాలను స్పృశించింది. బ్రాహ్మణీయ భూస్వామ్య, రివిజనిస్టు, శుష్క మానవతా వాద విలువలన్నిటి మీద నక్సల్బరీ తీవ్ర విమర్శ పెట్టింది. వాటిని ఎదుర్కొనే క్రమంలోనే వర్గపోరాట ప్రత్యామ్నాయాన్ని అన్ని రంగాల్లో ప్రవేశ పెట్టింది. అందులో ప్రధానమైనది విప్లవ సాహిత్య విమర్శ.
మార్క్సిస్టు తత్వశాస్త్రం, చారిత్రక భౌతికవాదం, వర్గపోరాట సిద్ధాంతం పునాదిగా విప్లవ సాహిత్య విమర్శ ఆరంభమైంది. అందు వల్లనే సంస్కృత అలంకార శాస్త్రాలను పూర్వపక్షం చేసింది. శిష్ట సాహిత్య విలువలను తుత్తునియలు చేసింది. సమాంతర ప్రజా, దేశీ సాహిత్య సంప్రదాయాలను వెలికి తీసి విశ్లేషించింది. సామాజిక అధిపత్యానికి వ్యతిరేకంగా చరిత్రలో సాగిన ధిక్కార ఆలోచనారీతులను పరిశీలించింది. జీవితంలోని సకల పార్వ్శాలను ప్రగతి గీటురాయి మీద వివరించడానికి అవసరమైన పరికరాలను అందించింది. వేర్వేరు సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని అంచనా వేసింది. మానవ జీవితంలో, వర్గపోరాటంలో కళా సాహిత్యాల పాత్రను విప్లవ సాహిత్య విమర్శ మదింపు వేసింది. జానపదాలు, ప్రజా కళా రూపాల దగ్గరి నుంచి వచన కవిత, కథ, నవల వంటి అనేక ప్రక్రియలకు విప్లవ సాహిత్య విమర్శ విస్తరించింది. వివిధ ప్రక్రియల ప్రత్యేకతల దృష్ట్యా సాహిత్య విమర్శ పద్ధతులను అభివృద్ధి చేసింది.
తెలుగు సాహిత్య రంగంలో ఈ యాభై ఏళ్లలో వచ్చిన అనేక ప్రతీఘాతుక ధోరణులను గుర్తించి ఓడించే క్రమంలో విప్లవ విమర్శ అభివృద్ధి సాధించింది. అలాగే వేర్వేరు పీడిత అస్తిత్వవాదాలతో నిరంతర సంభాషణ ద్వారా విప్లవ సాహిత్యోద్యమం విమర్శ రంగానికి కొన్ని కీలక భావనలు సమకూర్చింది. అలాగే విప్లవోద్యమ ప్రత్యక్ష ఆచరణ నుంచి వెలుబడుతున్న సాహిత్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన నూతన ప్రమాణాలను తీర్చిదిద్దింది. ఇది ఇవాళ దండకారణ్యం నుంచి వెలుబడుతున్న అపార వైవిధ్య భరితమైన కథలకు సాధికార విశ్లేషణ అందించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శను చాలా ముందుకు తీసికెళ్లింది. ప్రయోగం, వైవిధ్యం, జీవితానుభవ ప్రత్యేకతలు మొదలైన వాటిని దృక్పథం గీటురాయి మీద అంచనా వేస్తున్నది.
అభ్యుదయ సాహిత్య విమర్శ కృషిని గుర్తిస్తూనే అందులోని లోపాలు, పరిమితులను ఎత్తి చూపుతూ మొదలైన విప్లవ సాహిత్య విమర్శ ఎప్పటికప్పుడు తనలోని లోపాలను సహితం సవరించుకుంటూ విస్తరిస్తోంది. గత సూత్రీకరణలను విస్తరించుకుంటూ పురోగమిస్తోంది. మూడు తరాల విప్లవ సాహిత్య విమర్శ అనేక ప్రభావాలు వేసినట్లే అనేక ప్రగతిశీల ఉద్యమాల, భావనల ప్రభావాలకు కూడా గురై పదునుదేలుతోంది. సాహిత్య సిద్ధాంతం, సాహిత్య చరిత్ర, అన్వయ, ప్రక్రియా విమర్శగా కొనసాగుతున్నది. ఈ మొత్తానికి విప్లవోద్యమ ఆచరణతోపాటు అనేక జీవన రంగాల్లో సాగుతున్న ప్రజా సామాజిక ఆచరణ ఆలంబన.
విప్లవ రచయితల సంఘం యాభై వసంతాల చారిత్రక సందర్భంలో ఈ ఐదు దశాబ్దాల సాహిత్య విమర్శను మలుపు ప్రచురణగా పాఠకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సాహిత్య సిద్ధాంతం, తెలుగు సాహిత్య చరిత్ర-ఉద్యమాలు, సాహిత్య విమర్శగా మూడు సంపుటాలను ఈ ఏడాదిలో వరుసగా విడుదల చేస్తాం.
మలుపు
Keywords : virasam, naxalbari, revolutionary writers
(2024-03-23 06:25:27)
No. of visitors : 1370
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..