అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి

అది

ఏవోబీలో.. దండకారణ్యంలో.. గడ్చిరోలీలో.. జార్ఖండ్, బీహార్, కేరళ, తెలంగాణ‌.. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో రోజూ ఎన్నో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. వాటిలో అత్యధికం నకిలీ ఎన్‌కౌంటర్లన్నది బహిర‍ంగ రహస్యమే. పౌరహక్కుల సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు ఈ ఎన్‌కౌంటర్లపై విచారణ జరుపాలని ఎన్ని సార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం నోరు మెదుపదు.

గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అనేక నకిలీ ఎన్‌కౌంటర్లలో అనేక మంది అమాయకులు మరణించారు. అలా ఏడేండ్ల క్రితం పారా మిలటరీ బలగాలు 17 మంది ఆదివాసులను కాల్చి చంపి చనిపోయిన వాళ్ళు మావోయిస్టులని ఎకౌంటర్ లో మరణించారని ప్రకటించిన సంఘటనలో నిజా నిజాలు ఇప్పుడు బైటపడ్డాయి. ( నిజానికి ఘటన జరిగిన వెంటనే పోలీసులు 17 మంది ఆదివాసులను హత్య చేశారనే విష‌యం బైటపడ్డప్పటికీ ఇప్పుడు ఓ న్యాయమూర్తి అధ్య‌క్షతన ఏర్పడ్డ కమీషనే అవి హత్యలే అని తేల్చింది)

చత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సర్కేగూడలో 2012 జూన్ 28న భద్రతా దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించారు. ఆనాడే వాళ్లు మావోయిస్టులు కాదని, చనిపోయిన వాళ్ళంతా ఆదివాసులని ఎంతగా మొత్తుకున్నా.. భద్రతా దళాలు, అధికారులు, ప్రభుత్వం చనిపోయిన వాళ్లు మావోయిస్టులనే వాదించింది.

కాగా, దానిపై జ్యుడీషియల్ దర్యాప్తు జరుపగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఘటనపై వీకే అగర్వాల్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ చేసిన దర్యాప్తు నివేదికను చత్తీస్‌గడ్ ప్రభుత్వానికి సమర్పించగా.. ఆ నివేదిక ఆదివారం రాత్రి లీకైంది.

వాస్తవానికి జూన్ 28న సర్కేగూడ గ్రామస్థులు ʹబీజ్ పందుమ్ʹ(విత్తన‌ పండుగ) వేడుకల గురించి చర్చించడానికి సమావేశమయ్యారు. అయితే మావోయిస్టులు ఆ గ్రామంలో సమావేశమయినట్లు భద్రతా సిబ్బందికి సమాచారం అందడంతో అక్కడకు చేరుకొని గ్రామస్థులపై కాల్పులు జరిపారు. అసలు గ్రామస్థుల వైపు నుంచి కాల్పులు జరపడం కాని, ప్రతిఘటించడం కాని జరగలేదు.

అక్కడ సమావేశమైన వాళ్లు మావోయిస్టులు అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. చాలా మందిని దగ్గర నుంచే కాల్చి చంపారని దర్యాప్తులో తేలింది. భద్రతా దళాలు కంగారులోనో, పొరపాటుగానో ఆదివాసులపై కాల్పులు జరిపారని కమిషన్ పేర్కొంది. ఎన్‌కౌంటర్ జరగలేదని తమ దర్యాప్తులో తేలిందని కమిషన్ తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ నివేదిక సంచలనంగా మారింది. ఆనాడు కావాలనే భద్రతా దళాలు ఆదివాసులను మావోయిస్టులుగా చిత్రీకరించినట్లు తేటతెల్లమైంది.

పొరపాటుగానో, కంగారులోనో భద్రతా సిబ్బంది 17 మంది ఆదివాసులను కాల్చి చంపారని జ్యూడీషియల్ కమిషన్ తన రిపోర్టులో పేర్కొన్న అంశాన్ని హక్కుల సంఘాలు తోసిపుచ్చుతున్నాయి. ప్రజలని భయపెట్టడానికి కావాలనే భద్రతా దళాలు ఈ హత్యాకాండకు పాల్పడ్డాయని ఆరోపిస్తున్నాయి.

Keywords : Maoists, Judicial Commission, VK Agarwal, Chattisgarh, Sarkeguda Case, Report, Encounter
(2024-04-09 02:03:59)



No. of visitors : 2017

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అది