కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!

కూలి

దేశంలో ఏదో ఒక మూల దళితులపై ప్రతినిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. అకారణంగా దళితులపై దాడులు చేస్తూ.. వారిని చంపేస్తున్నారు. తాజాగా తను కష్టపడి పని చేసిన దానికి కూలి అడిగినందుకు ఒక దళితుడిని జేసీబీతో తొక్కించి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా రాణీగంజ్ కైథెలీ గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ పాశవిక హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.

రాణీగంజ్ కైథెలా గ్రామానికి చెందిన శ్రీనాథ్ సరోజ్ కుమారుడు విపిన్ సరోజ్ అనే 18 సంవత్సరాల యువకుడు అదే ప్రాంతంలో ఉంటున్న వికాస్‌సింగ్‌కు చెందిన జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పని చేసిన తరువాత యజమాని వికాస్‌సింగ్‌‌ను బుధవారం (డిసెంబర్ 4) తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగాడు. దీంతో ఆగ్రహించిన వికాస్ సింగ్ డ్రైవర్ సరోజ్‌ను నానా మాటలు అన్నాడు.

బూతులు తిట్టడమే కాకుండా.. పని చేసిన వెంటనే డబ్బులెందుకు ఇవ్వాలంటకూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నానా బూతులు తిడుతూనే విపిన్ సరోజ్‌ను జేసీబీతో తొక్కించి చంపేశాడు. అతడు చనిపోయాడని గుర్తించి వికాస్ అక్కడి నుంచి పరారయ్యాడు.

తమ కొడుకు చావు గురించి తెలుసుకున్న అతని తల్లిదండ్రులు ఘటనాస్థలానికి పరుగు పరుగున వచ్చారు. గుండెలు అవిసేలా రోదించారు. సరోజ్ మరణంతో స్థానికంగానే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. వికాస్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విపిన్ సరోజ్ మృత దేహంతో లక్నో-వారణాసి రహదారిపై ఆందోళన చేపట్టారు.

దళితులమనే చులకన భావంతోనే.. తాము కష్టపడి పని చేసిన డబ్బులు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని... కూలి డబ్బులు అడిగినందుకే తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని విపిన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని.. వెంటనే వికాస్ సింగ్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి తండ్రి శ్రీనాథ్ డిమాండ్ చేశాడు. అతనికి మద్దతుగా వందలాది మంది గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. వికాస్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Keywords : Vipin Saroj, JCB Driver, UP, Murdered, Dalit
(2024-04-17 23:18:16)



No. of visitors : 783

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కూలి