కిడ్నాపులు, ఇళ్లపై దాడులు, కుట్ర కేసులతో తెలంగాణలో సైలెంట్ ఎమర్జెన్సీ - విరసం
ప్రజాసంఘాల నాయకుల అరెస్టులు , అక్రమ కేసులపై విప్లవ రచయితల సంఘం ప్రకటన పూర్తి పాఠం
చైతన్య మహిళా సంఘం నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప, తెలంగాణ విద్యార్ధి వేదిక నాయకుడు మెంచు సందీప్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యదర్శి మెంచు రమేష్లను వెంటనే విడుదల చేయాలి
చైతన్య మహిళా సంఘం నాయకులు దేవేంద్ర, స్వప్నలను ఈరోజు(18వ తేదీ) ఉదయం అక్రమంగా తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదు నగరం నాచారంలోని స్వప్న ఇంట్లో ఉండగా తెల్లవారుజామునే పోలీసులు దాడి కొత్తగూడెం తీసికెళ్లారు. అలాగే నల్లకుంటలో తన రూంలో ఉన్న టీవీవీ నాయకుడు మెంచు సందీప్ను కూడా అరెస్టు చేశారు. అక్టోబర్ 20వ తేదీన కొత్తగూడెం స్టేషన్లో ఒక అక్రమ కేసు నమోదు చేసి అందులో తెలంగాణలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు, సభ్యులు 45 మందిని నిందితులుగా చేర్చారు. ఈ అక్రమ కేసులో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే నిన్న(17వ తేదీ) హైదరాబాదులోనే చైతన్య మహిళా సంఘం నాయకురాలు శిల్పను, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడు మెంచు రమేష్ను అరెస్టు చేశారు.
కొన్ని నెలలుగా విద్యార్థి, ప్రజాసంఘాల నాయకుల కిడ్నాపులు, ఇళ్లపై దాడులు, కుట్ర కేసులతో తెలంగాణలో ఒక సైలెంట్ ఎమర్జెన్సీ మొదలైంది. గద్యాల కుట్ర కేసులో ఇప్పటికే తెలంగాణ విద్యార్థి నాయకులు నాగన్న, బలరాం, మద్దిలేటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడు నలమాస క్రిష్ణ, విరసం కార్యవర్గ సభ్యుడు జగన్ లను అరెస్టు చేశారు. వాళ్లు మహబూబ్నగర్ జైల్లో ఉన్నారు. ఆ తరువాత అనిల్ (రాజకీయ ఖైదీల విడుదల కమిటీ), సురేష్ లను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అయోధ్య తీర్పు ప్రకటించాక రచయితలు అనూరాధ, రవి లను అరెస్టు చేశారు. వీళ్ళతోపాటు విరసం కార్యవర్గ సభ్యుడు కాశీం, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తదితరులపై కేసు నమోదు చేశారు.
ఈరోజు చైతన్య మహిళా సంఘం నాయకులు దేవేంద్ర, స్వప్న, టీవీవీ నాయకుడు మెంచు సందీప్లను అరెస్టు చేశారు. దీనికంటే ముందు పదిహేను రోజుల కింద చైతన్య మహిళా సంఘం బాధ్యులను పోలీసులు రకరకాలుగా వేధించారు. కుటుంబ సభ్యులను బెదిరించారు. తెలంగాణలో రాష్ట్రం ఏర్పాడ్డాక మిగిలిన నికార్సైన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి వేదిక, చైతన్య మహిళా సంఘంలాంటి ప్రజాసంఘాలు నిలబడ్డాయి. వివి, కాశీం, అనూరాధ, రవిశర్మ, వేణుగోపాల్ లాంటి కొద్దిమంది రచయితలు, బుద్ధిజీవులు, పౌరహక్కుల నేతలు మాత్రమే నిజమైన ప్రజల గొంతుగా నినదిస్తున్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఫాసిస్టు వ్యూహంలో భాగంగా ప్రజా సంఘాల నాయకులను, ప్రజా మేధావులను అక్రమంగా అరెస్టు చేస్తున్నాయి. అనేక మంది మీద తప్పుడు అరోపణలతో కేసులు నమోదు చేసి బెదిరిస్తున్నాయి. ఫాసిస్టు ప్రభుత్వాలకు ఎంత అణవేత చరిత్ర ఉన్నదో ప్రజలకు, ప్రజా సంఘాలకు, బుద్ధిజీవులకు అంతే ధిక్కార చరిత్ర ఉన్నది. ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని, అక్రమ కేసులను ఎత్తియాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని విరసం డిమాండ్ చేస్తోంది.
పాణి
విరసం కార్యదర్శి
18. 12.2019
Keywords : tpf, tvv, virasam
(2024-04-03 01:44:07)
No. of visitors : 626
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |