CAA,NRC : ఈ దేశ ప్రజలపై పాలకుల హింసాకాండకు ఉత్తరప్రదేశ్ ఓ ఉదహరణ‌

CAA,NRC

పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో శాంతియుత నిరసనలు చేస్తున్న విద్యార్థులు, యువకులు, సామాజిక, హక్కుల కార్యకర్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కేసులు పెడుతున్నది. ఇదే తీరును బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్నాటక, అసోం సైతం పాటిస్తున్నాయి. ఇక పోలీసులైతే ఆందోళనల్లో పాల్గొన్న వారిని దొరికినవారిని దొరికినట్టుగా బాదుతూ.. తిరిగి శాంతిభద్రతలకు భంగం కలిగించారని బాధితులపైనే తీవ్రమైన నేరారోపణ సెక్షన్ల కింద కేసులు నమోదుచేస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. యూపీలో CAAకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న వారిలో సుమారు 21,500 మందిపై కేసులు పెట్టగా, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలోని విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అందరూ కలిపి 1200 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మరోవైపు దేశవ్యాప్తంగా CAAకు వ్యతిరేక పోరాటంలో పోలీసుల బుల్లెట్లు తాకి దాదాపు 26 మంది మరణించగా వారిలో యూపీ నుంచే 21 మంది ఉండటం గమనార్హం.

CAAకు వ్యతిరేక నిరసనల్లో భాగంగా యూపీలోని ముజఫరబాద్‌, కాన్పూర్‌, బిజ్నోర్‌, లక్నో, ఆగ్రా, బులంద్‌షహర్‌, గోరఖ్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే శాంతియుతంగా చేస్తున్న ప్రజల నిరసనలను పలు ప్రాంతాల్లో పోలీసులే హింసాత్మకంగా మారుస్తున్నారు. ఏఎంయూలో CAA నిరసనల సందర్భంగా విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ తీస్తుంటే.. మరోవైపు పోలీసులే ద్విచక్రవాహనాలు, కార్లను ధ్వంసం చేయడం, ఢిల్లీలో ఖాకీలే బస్సుకు నిప్పంటించిన ఘటనలకు సంబంధించి వీడియోలు వైరలయ్యాయి. యూపీలో వారణాసిలోనే 56 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. వీరిలో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారు. పర్యావరణ సమస్యలపై ఎన్జీవో నడుపుతున్న ఏక్తా శేఖర్‌ దంపతులు, దీపక్‌ కబీర్‌, భీమ్‌ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలు జరుగుతున్న తరుణంలో దీపక్‌ కబీర్‌.. తన మిత్రులను విడిపించుకోవడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లగా ఆయనపై అల్లర్లకు ఉసిగొల్పుతున్నాడనీ, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడని కేసులు పెట్టినట్టు అతడి మిత్రులు ఆరోపిస్తున్నారు.
ముజఫరబాద్‌లో పలువురు ముస్లింలతో ʹమేం నిరసనలలో పాల్గొనబోంʹ అని షరతులతో రాసి ఉన్న పేపర్లపై పోలీసులు సంతకాలు తీసుకున్నారు. ఇందులో విద్యాధికులే అధికంగా ఉన్నట్టు సమాచారం. ఇక లక్నోలో అరెస్టు చేసిన వారిలోనూ వారే ఎక్కువగా ఉన్నారు. అలాగే కాన్పూర్‌లో 28 మందిని ʹనేరస్థులుʹగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. అంతేగాక సీసీటీవీ ఫుటేజీలలో గుర్తించినవారిని ʹఆందోళనకారులుʹగా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో వారి ఫోటోలతో కూడిన ʹవాంటెడ్‌ʹ పోస్టర్లను అంటిస్తున్నారు.

మరో వైపు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారినుంచే వాటికి సంబంధించిన పరిహారాన్ని కట్టిస్తామని యోగి సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. సీసీటీవీలలో రికార్డైన వీడియోల ఆధారం గా నిరసనల్లో పాల్గొన్న వారి నుంచే ఆ సొమ్మును రాబడతా మని స్వయంగా పోలీసులే చెబుతున్నారు. ఈ మేరకు ముజ ఫర్‌నగర్‌లో CAAకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొ న్నారని సుమారు 40 దుకాణాలను సీల్‌ చేశారు. వారి షాపు లలో ఉన్న సామానులను తీసుకెళ్లినట్టు బాధితులు చెబుతు న్నారు. బిజ్నోర్‌, కాన్పూర్‌, రాంపూర్‌లలోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన పోలీసులపై ఎందుకు ఎలాంటి కేసులు పెట్టడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

CAA నిరసనలలో పోలీసుల చర్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినా యోగి సర్కారు తీరు మారడం లేదు. ర్యాలీల సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘణ జరిగిందనీ, దీనిపై సమగ్ర నివే దిక సమర్పించాలని పోలీసులను హెచ్చరించినా రక్షక భటులు మాత్రం సాధారణ పౌరులపై తమ ప్రతాపం చూపి స్తూనే ఉన్నారు.
మరోవైపు 21 మంది మరణాలపై హక్కుల కార్యకర్తలు నిజనిర్ధారణ నివేదికను విడుదల చేశారు. ప్రత్యేకంగా ముస్లింలు, హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు జరుగుతున్నాయని వారు తెలిపారు.

Keywords : uttara pradesh, cab, caa, nrc, police, yogi adityanath
(2024-04-24 17:25:34)



No. of visitors : 689

Suggested Posts


నేను ముస్లింను కాను కానీ పోరాటంలో ముందుభాగాన ఉన్నాను, అందుకే నన్ను టార్గెట్ చేశారు

పౌరసత్వ సవరణ బిల్లు (CAB)పై నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు జామియా మిలియా యూనివర్సిటీపై దాడి చేసిన ఘటనలో యూనివర్సిటీ మొత్తం నెత్తురు ఏరులై పారింది. యూనివర్సిటీ రోడ్లు, లైబ్రరీ, హాస్టల్ గదులు విద్యార్హుల నెత్తురుతో తడిసిపోయింది.

NRC,CAA : ఫాసిస్టు చట్టంపై స్పందించండి - టెకీల బహిరంగ లేఖ

పౌరసత్వ సవరణ చట్టం (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారతీయ ఐటీ నిపుణులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం ఫాసిస్ట్‌ చట్టంగా పేర్కొంటూ బహిరంగ లేఖ రాశారు.

అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !

ʹʹసిటిజెన్‌ షిప్‌ అమెండ్‌ మెంట్‌ ఆక్ట్‌ 2019 గురించి ఏ ఒక్క భారతీయ పౌరుడూ భయపడనక్కరలేదుʹʹ అని ఎంత బాగా అన్నారు, అమిత్‌ భాయ్‌! ఆఫ్ఘనిస్తాన, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లలో తాము ఎదుర్కొన్న మతపరమైన వివక్ష

వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లను యూనివర్సిటీ నుండి బహిష్కరించిన విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు

ఇప్పటి వరకు విద్యార్థులను కాలేజీల నుండి, యూనివర్సిటీల నుండి బహిష్కరించే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ లనే చూశాం కదా.... తప్పు చేసిన వైస్ ఛాన్సలర్ ను, రిజిస్ట్రార్ లను యూనివర్సిటీ నుండి బహిష్కరించిన విద్యార్థులు, అద్యాపకులు, ఉద్యోగుల గురించి విన్నారా ఎప్పుడైనా ?

నిరాశ‌ల న‌డుమ‌ కొత్త ఆశ

డీమానిటైజేష‌న్‌, జీఎస్‌టీ, 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు, అయోద్య తీర్పులాంటి ఉప‌ద్రవాలు వ‌చ్చినా స‌మాజం క‌ద‌ల‌వ‌ల‌సినంత క‌ద‌ల‌లేద‌ని, కానీ ఇప్పుడు ఆ నిరాశలోంచి కొత్త కాంతి పుంజాలు వెలుగుచూస్తున్నాయ‌ని అన్నారు. ఇప్పుడు ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో క‌నిపించే యువ‌తే ఆ ఆశ అన్నారు.

జామియా విద్యార్థులకు అండగా నిల్చిన వీసీ - పోలీసులపై కేసు నమోదు చేస్తామని ప్రకటన‌

పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ తీవ్రంగా ఖండించారు

NPR పేరుతో NRC అమలు చేయబోతున్నరు... IAS కన్నన్ గోపీనాథన్

ఎన్పీఆర్ పేరుతో అమిత్ షా ఎన్నార్సీ అమలు చేయదల్చుకున్నాడని మాజీ ఐఏఎస్ కన్నన్ గోపీ నాథన్ మండి పడ్డారు. ఎన్నార్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా ముంబైలో జరిగిన ఓ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఎన్నార్పీలో సరైన వివరాలు ఇవ్వకండి - ప్రజలకు అరుంధతీ రాయ్ పిలుపు

కేంద్ర ప్రభుత్వందొడ్డి దారిన ఎన్నార్సీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ ఆరోపించారు. ఎన్‌ఆర్‌పీ అనేది ఎన్‌ఆర్‌సీకి డేటాబేస్‌గా ఉపమోగపడుతుందని ఆమె అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు.

హైదరాబాద్‌ను తాకిన ʹజామియాʹ నిరసన సెగ.. వందలాది మంది విద్యార్థుల ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అత్యంత దారుణంగా దాడులు చేశారు. ఈ దాడులకు నిరసనగా, జామియా విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్‌లో నిరసనలు వెల్లువెత్తాయి.

పోలీసుల దాడిలో కన్ను కోల్పోయిన విద్యార్థి ఏమంటున్నాడు

దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని పోలీసుల దాడిలో కన్ను పోగొట్టుకున్న‌ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


CAA,NRC