include 'men';
?>
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో ʹఉనాʹ బాధితులు రాష్ట్రపతికి సంచలన లేఖ రాశారు. మమ్ములను ఈ దేశం నుండి బహిష్కరించండి. దళితుల పట్ల వివక్ష లేని మరో ఏదైనా దేశానికి మమ్మల్ని పంపించండి అని ఆ లేఖలో వాళ్ళు కోరారు.
2016 లో గుజరాత్లోని ఉనాలో ఏడుగురు దళితులను స్వయం ప్రకటిత గోరక్షక మూక కట్టేసి దుర్మార్గంగా కొట్టిన విషయం తెలిసిందే. వాళ్ళను కొడుతున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్ళలో వైరల్ అయ్యి దేశ వ్యాప్త ఉద్యమానికి దారి తీసింది.
ఆ బాధితుల్లో ఒకరైన వశ్రమ్ సర్వైయా తన కుటుంబం తరపున రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆయనను కలిసిన ʹది క్వింట్ డాట్ కామ్ʹ ప్రతినిధితో మాట్లాడుతూ ʹʹమేము సీఏఏని వ్యతిరేకిస్తున్నాము, కాని వారు ఈ చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, దళితులను సమాన పౌరులుగా భావించే దేశానికి మమ్మల్ని బహిష్కరించాలి.ʹʹ
ʹʹమేము భారతదేశంలో పౌరులుగా పరిగణించబడటం లేదు. హిందూ సమాజంలో దళితులు దారుణమైన వివక్షకు గురవుతున్నారు. కాబట్టి మేము వివక్షను ఎదుర్కోని వేరే దేశానికి పంపమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను అభ్యర్థిస్తున్నాము. ʹʹ
ʹʹ2016 లో మమ్మల్ని కొట్టిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేరస్తులు బెయిల్పై ఉన్నారు. మాకు వ్యవసాయ భూమి, ప్లాట్లు వాగ్దానం చేశారు కాని వాటిలో ఏ ఒక్క వాగ్దానం అమలుపరచలేదు.ʹʹ
"అప్పటి గుజరాత్ సిఎం,ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన ఆనందీబెన్ పటేల్ 2016 లో మా దగ్గరికి వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఒక నెలలో మళ్ళీ మాదగ్గరికి వస్తానని మాట ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆమె రాలేదు ఆమె ఇస్తానన్న ఉద్యోగాలు రాలేదుʹʹ
దాడికి గురైన సోదరులందరి తరపున వశ్రామ్ రాష్ట్రపతికి రాసిన ఈ లేఖను జనవరి 7 న గిర్-సోమనాథ్ జిల్లాలోని ఉనా ప్రాంతీయ కార్యాలయానికి పంపారు.
గతంలో మేము తమకు కారుణ్య మరణానికి అనుమతి కావాలని కోరాం. ఇప్పుడు ఈ మా అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోకపోతే, నేను నా సోదరులు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు ఆత్మాహుతి చేసుకుంటాంʹʹ అని వశ్రమ్ సర్వైయా చెప్పారు.
(ది క్వింట్ డాట్ కామ్ సౌజన్యంతో..)
Keywords : Una, Dalits, President, Kovind, Letter, Gujarat
(2024-03-12 10:20:26)
No. of visitors : 1749
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..