దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం
(విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం గురించి ʹప్రసాద్ ఇఫ్టూ ʹ తన ఫేస్ బుక్ వాల్ పై చేసిఅన్ పోస్ట్ మీ కోసం...)
ప్రియమైన మిత్రులారా!
మల్లెల విప్లవ స్ఫూర్తితో తొమ్మిదేళ్ల క్రితం ఈజిప్ట్ రాజధాని కైరో లోని తెహ్రిక్ స్క్వేర్ ఒక ఉద్యమ స్ఫూర్తి కేంద్రంగా వర్ధిల్లింది. దానితో దీన్ని పోల్చవచ్చో లేదో వేరే సంగతి! కానీ ఇండియాలో నేడు NRC, CAA & NPR వంటి ఫాసిస్టు చట్టాల వ్యతిరేక పోరాట స్ఫూర్తితో ఢిల్లీ "షాహీన్ బాగ్" మహిళల పోరాటం కూడా అలాగే వర్ధిల్లుతోంది. పొద్దున 8గంటలకు ఇళ్లల్లో పనుల్ని ముగించుకొని పరుగుపరుగున షాహీన్ బాగ్ కి వచ్చి ధర్నా శిబిరంలో పాల్గొనడం నేడు స్త్రీల సాంప్రదాయం గా మారింది. పైగా మున్నెన్నడూ ఇంటి గడప దాటని ముస్లిం మహిళలు అధికసంఖ్యలో పాల్గొనడం విశేషం! అది నేడు దేశవిదేశాల సందర్శకుల వేదికగా మారింది. అంతేకాకుండా, దాని ఉద్యమ స్ఫూర్తితో అదే తరహాలో దేశంలోని అనేక ప్రాంతాల్లో దీక్షాశిబిరాలు వెలుస్తున్నాయి. అలాంటిదే నిన్న 24-1-2020న విజయవాడలో కూడా ఒక ధర్నా శిబిరం విజయవంతంగా ప్రారంభమైనది. దాని విశేషాలు తెల్సుకుందాం.
తొలుత చిన్న ఉపోద్ఘాతంలోకి వస్తా. NRC, CAA, NPR లపై విజయవాడలో ఈనెల 2వ తేదీ నుండి ధర్నా సెంటర్ లో "రాజ్యాంగ పరిరక్షణ కమిటీ" ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్షలు జరుగుతున్నాయి. అవి చాలా గొప్ప ప్రభావం కలిగిస్తున్నాయి. ప్రజా సమీకరణకూ, ప్రజా చైతన్యానికి వేదికగా మారాయి. మరోవైపు "Alliance against NRC, CAA &NPR" ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అలయన్స్ అధ్వర్యంలో నిన్న "శాంతి బాగ్" ప్రారంభమైనది. దాన్ని ప్రస్తావిద్దాం.
ఢిల్లీ షాహీన్ బాగ్ ధర్నా శిబిరం డిసెంబర్ 16న ప్రారంభమైనది. నిన్నటికి సరిగ్గా 40 రోజులు నిండింది. 40వ రోజు విజయవాడ ఆటో నగర్ లోని సనత్ నగర్ లో ఇది ప్రారంభమైనది. ఐతే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దీని వేళలుగా నిర్వాహకులు నిర్ణయించారు. కారణం వుంది. ప్రధానంగా శ్రామిక వృత్తులకు చెందిన ప్రజల నివాస ప్రాంతమిది. పగలు పనిచేయకపోతే పొట్టగడవని నిరుపేద కుటుంబాలు ఎక్కువ! చిన్న వర్తకులు, చిన్న పరిశ్రమల యజమానుల ఆర్ధిక స్థితి కూడా అంతంత మాత్రమే! తమ వర్తక వేళలు, పని వేళల్లో కొంత త్యాగం చేసి 6 గంటలకే ఇక్కడకు చేరే స్ఫూర్తితో చేసిన నిర్ణయమని తెలిసింది. అదే సమయానికి ఇంటి పనుల్ని ముగించుకొని ముస్లిం కుటుంబాల మహిళలు అక్కడకు చేరుకునేలా చేసిన నిర్ణయమని తెలిసింది. ఇదీ దీని నేపధ్యం!
నిన్న ప్రారంభిస్తున్న వార్త తెలిసి పరిశీలన కోసం వెళ్లాలని ఆసక్తి కలిగింది. నేను, రవిచంద్ర (పి.డి.ఎస్.యూ. రాష్ట్ర అధ్యక్షులు) సరిగ్గా ప్రారంభ సమయానికి నిన్న సాయంత్రం అక్కడకు చేరుకున్నాం (ఆహ్వానం లేకుండా పరిశీలకులుగా వెళ్లినప్పుటికీ, మమ్మల్ని గుర్తుపట్టిన ఒకరిద్దరు నిర్వాహకులు వేదిక పైకి ఆహ్వానించిన కారణంగా ఇచ్చిన మా సందేశాల సంగతి అప్రస్తుతం) మా పరిశీలనలో గమనించిన ఆసక్తికర అంశాలు మిత్రుల దృష్టికి తెస్తున్నా. ప్రధాన స్రవంతి ప్రచార మాధ్యమాల ద్వారా తగు ప్రాచుర్యం జరగని నేపధ్యం తెల్సిందే! కనీసం సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర అంశాలనైనా వెలుగులోకి తేవడం బాధ్యతగా భావించి చేస్తున్న ప్రయత్నామిది.
6-30pm కి సుమారు 100 మంది మహిళలు, 150 మంది పురుషులు, 50 మంది పిల్లలు చేరారు. ఇద్దరు బాలికలు శ్రావ్యంగా పాడిన "సారే జహా సే అచ్చా..." పాటతో...! ఈ సంఖ్య 7pm కి 200, 300, 100 కలిపి సుమారు 600 కి పెరిగింది. 8-15pm కి దగ్గరలోని మసీదు లో నమాజ్ సమయానికి పై సంఖ్య 350, 400, 150 కి పెరిగింది. పురుషులు 8-10pm కి నమాజ్ కి వెళ్లారు. తిరిగి 8-30pm కి శిబిరం వద్దకి చేరారు. అంతవరకూ స్త్రీలే నిర్వహించారు. ముగ్గురు మహిళల ప్రసంగాలు కన్నీళ్లు తెప్పించాయి. ముఖ్యంగా ఒక మహిళ చేసిన ప్రసంగంలో భావి విషాద భారతదేశ దృశ్యాన్ని మన కళ్లెదుట ఆవిష్కరింపజేసింది. ఇంతకంటే వివరాలకు వెళ్లడం లేదు. ఆమె మాటలు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటే, కన్నీటి సిరా చుక్కలతో ఈ అక్షర లేఖనం జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. 8-30pm కి మొత్తం సంఖ్య వెయ్యు మందికి చేరింది. మహిళలు 400 మందికి చేరారు. 9pm కి జనగణమన గానంతో ప్రోగ్రాం ముగిసింది. ప్రతిరోజూ ఇలాగే కొనసాగించాలని చివరలో నిర్వాహకులు ప్రకటించారు.
తల్లుల ఒడిలో పసిపిల్లలూ వున్నారు. ఇంకా మూడేళ్ల పిల్లల నుండి పదహారేళ్ళ నూనూగు యువకుల వరకూ వున్నారు. ఆ పిల్లలు ట్యూషన్లకి వెళ్లాల్సిన సమయమది. ఏ ఆందోళన వారిని అక్కడకు రప్పించింది? బురఖాలు ధరించిన మహిళలను ఏ భయం అక్కడకు రప్పించింది? అక్కడ జాతీయ జండా, గాంధీ, అంబేద్కర్ చిత్రాలు ధరిస్తున్న ప్రేక్షకుల గుండెల్లో ఏ భావోద్వేగాలు ఉన్నాయి? వారి గుండె చప్పుళ్ళు ఎలా వినిపిస్తాయి? వారి హృదయ వేదనల వీక్షణ ఏమిటి? వారి కళ్ళల్లో కనిపించే దృశ్యాలు ఏమిటి? వక్తలు ప్రసంగాలు వింటున్న వారి తదేక దృష్టి వెనక ప్రేరేపక అంశాలేమిటి? అవన్నీ చెప్పేందుకు మాటలు రావడం లేదు. అక్కడి బాధిత హృదయ స్పందనలు స్వయంగా హాజరై వినీ, కనీ తీరాల్సిందే! ప్రజాతంత్ర, లౌకిక, ప్రగతిశీల శక్తులు "చలో శాంతి బాగ్" చేపట్టి స్వయంగా తరించడమే మంచిది. ఐతే ఒక విషాద కాలంలో ఈ శిబిరం విజయవంతంగా ప్రారంభం కావడం సంతోషకరమైన పరిణామమే! కానీ కేవలం ముస్లిముల ఆందోళనగా కొనసాగడం విచారకరం! హిందూ ముస్లిం క్రిస్టియన్ బేధాలు లేకుండా NRC, CAA, NPR లది అందరి ఆందోళన, బాధగా మారకపోవడం లోటు! ఆ లోటు భర్తీకై పైన పేర్కొన్న ప్రగతిశీల శక్తులూ, సంస్థలూ పూనుకోవలసి ఉందని విజ్ఞప్తి!
✍ *ఇఫ్టూ ప్రసాద్* (పిపి)
జాతీయ కార్యదర్శి,
భారత కార్మిక సంఘాల సమాఖ్య
(INDIAN FEDERATION OF TRADE UNIONS----IFTU)
25-1-2020
Keywords : shaheen bagh, delhi, CAA, NRC, NPR, Vijayawada
(2024-03-12 09:23:38)
No. of visitors : 938
Suggested Posts
| సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టుపౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. |
| నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులుఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు. |
| మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసిCAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది. |
| శాంతి ప్రదర్శనపై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులుఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC లకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై |
| CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారంపౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది. |
| స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసుపౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది. |
| బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న కోర్టుకర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. |
| CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శనలు ఆపక పోతే |
| బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. |
| కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడిజవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి.
బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు. |