ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు

ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రావడం పేదల ప్రాణాలమీదికొచ్చింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఆయన పర్యటించనున్నారు. ఆయన తిరిగే ప్రాంతంలో పేదలెవ్వరూ ఆయనకు కనపడవద్దని భావించిన బీజేపీ ప్రభుత్వం పేదల కాలనీలకు అడ్డంగా గోడలు కట్టడం, పేదలను ఇండ్లు ఖాళీ చేయించడం పనిగా పెట్టుకుంది. అసలే మోడీ స్వంత రాష్ట్రం కావడంతో..ఆయన తల్చుకున్నాడు దెబ్బలకు కొదవేముంటుంది.
అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ట్రంప్ విడిది కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 24న ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ ట్రంప్ మొతేరా స్టేడియంలో ఉంటారు. ట్రంప్ రాక నేపథ్యంలో గుజరాత్ ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు అధికారులు. ట్రంప్ వెళ్లే దారితో పాటు మొతేరా స్టేడియం చుట్టు పక్కల ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. ఎక్కడా స్లమ్ ఏరియాలు కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మొతేరా స్టేడియం సమీపంలోని దేవ్ సరన్ స్లమ్ ఏరియా కనిపించకుండా గోడ కట్టేశారు. దీంతో మురికి వాడలో ఉంటున్న పేదలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మురికి వాడలో నివాసం ఉంటున్న వారికి షాక్ ఇచ్చారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు.

ఆ స్లమ్ ఏరియాలో సుమారు 65 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారందరికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అధికారులతో తీరుతో అక్కడ నివాసం ఉంటున్నవారు ఆవేదన చెందుతున్నారు. ఇదెక్కడి న్యాయం అని వాపోయారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారంతా భవన నిర్మాణ కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. పని చేస్తే ముద్ద దొరుకుతుంది. లేదంటే పస్తులు ఉండాల్సిందే. మొతేరా స్టేడియానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్లమ్ ఏరియాలో.. 22 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని స్థానికులు చెప్పారు.

తామంతా నిరు పేదలం అని, ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోమంటే.. ఎక్కడికి వెళ్లాలని వారు వాపోయారు. ఒక్కో కుటుంబాలో నలుగురు అంతకన్నా ఎక్కువమంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు, వృద్దులు ఉన్నారు. ముందస్తు సమాచారం లేకుండా సడెన్ గా వెళ్లిపోండి అంటే.. ఎక్కడికి వెళ్లాలని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు.

ʹʹవీలైనంత త్వరగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. ట్రంప్ వస్తున్నాడని ఖాళీ చేయమన్నారు. 22 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము. మేమంతా కూలీలం. రోజుకు 300 రూపాయలు కూలీ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం అని అంటే ఎలా ? ప్రతి కుటుంబంలో నలుగురు అంతకన్నా ఎక్కువమంది ఉన్నాము. సడెన్ గా వెళ్లిపోండి అంటే.. ఎక్కడికి వెళ్లాలి. మెరుగైన జీవనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కడుపు చేత పట్టుకుని అహ్మదాబాద్ వచ్చాము. మాకు మరో ఆధారం లేదు. అధికారులేమో.. వెళ్లిపోండి అంటున్నారు. పిల్లలు, వృద్దులతో ఎక్కడికి వెళ్లాలి. పేద వాళ్లం కావడం మేము చేసిన నేరమా?ʹʹ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

దీనిపై మున్సిపల్ అధికారుల వాదన మాత్రం మరో విధంగా ఉంది. ఇండ్లు ఖాళీ చేయమని తామిచ్చిన నోటీసులకు ట్రంప్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ ప్రాంతం ఆక్రమణకు గురైందని చెప్పారు. ఆ భూమిని తిరిగి సొంతం చేసుకోవడానికే.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చామన్నారు.
ఆ జాగా నిజంగా ఆక్రమణకు గురయ్యిందా లేదా తెలియదు కానీ అధికారులకు ఇన్నేండ్లుగా గుర్తుకు రాని ఆక్రమణలు ట్రంప్ పర్యటన సమయంలోనే ఎందుకు గుర్తొచ్చినట్టో ?

Keywords : gujarat, ahmedabad, trump, slums, modi
(2024-04-16 08:53:56)



No. of visitors : 2516

Suggested Posts


After JNU,HCU & DU, ABVP Loses Gujarat Central University Polls

Akhil Bharatiya Vidhyarthi Parishad (ABVP) has lost the student body election held in Gujarat Central University by a big margin, reports National Herald. This loss comes ahead of a hotly-contested Assembly elections in Gujarat....

పెప్సీని, లేస్ ను బ‌హిష్కరిద్దాం... రైతులను కాపాడదాం !

ఏప్రిల్ మొదట్లో అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో... పెప్సీ కంపెనీ ఓ లా సూట్ ఫైల్ చేసింది. ఫలితంగా సబర్‌కాంతా జిల్లాలో... రైతులైన బిపిన్ పటేల్,ఛాబిల్ పటేల్, వినోద్ పటేల్, హరిభాయ్ పటేల్ లాంటి అనేక మంది రైతులు బంగాళా దుంపల పెంపకం, అమ్మకాలు జరిపేందుకు వీలు లేకుండా పోయింది.

ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం

ప్రపంచ పోలీసుగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం వస్తున్న సందర్భంగా మోడీ చేస్తున్న పని విమర్షలకు తావిస్తోంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు ట్రంప్ వస్తున్నాడు.

సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !

గోద్రా ఘటన జరిగిన రోజు హిందువులు ఆగ్రహావేశాలతో ఉన్నారని ఆ ఆగ్రహాలు బయటకు వెళ్లగక్కనీయండని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముస్లింలకు గుణపాఠం చెప్పాల్సిందేననే అర్థంలో స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి తన నివాసంలో జరిగిన పోలీసు ఉన్నత అధికారుల సమావేశంలో చెప్పాడని సంజీవ్‌ భట్‌ అనే సీనియర్‌ పోలీసు అధికారి సుప్రీంకోర్టుకు తెలియచేశాడు. ఆ సమావేశంలో తాను కూడా ఉ

ముస్లిం మహిళ వేళ్ళు నరికేసి ఆమె కొడుకు చేతులు విరగ్గొట్టిన భజరంగ్ దళ్ మూకలు !

గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఓ వృద్ధ ముస్లిం మహిళ, ఆమె కొడుకుపై భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దుర్మార్గంగా దాడి చేశారు. మహిళ చేతి వేళ్ళను నరికేసిన భజరంగ్ దళ్ ముష్కరులు ఆమె కొడుకు చేతులను విరగొట్టారు.

ʹNot Joining Congress, But Aim To Bring BJP Down,ʹ Says Gujarat Dalit Leader Jignesh Mevani

The 36-year-old lawyer and activist, who has led protests in Gujarat against attacks on Dalits after four men were stripped and brutally thrashed with iron rods by cow vigilantes in the stateʹs Una last year, declined an invitation to meet Congress president Rahul Gandhi in Ahmedabad today....

షరతులు విధిస్తూ రైతులపై కేసు ఉపసంహరించుకున్న పెప్సికో....ఇక పోరాటం ఆపేద్దామా !

రాబోయే కాలాన మన భూములమీదా, మన పంటల మీదా, మన భూగర్భ జలాల మీదా ఆఖరికి మనం ఎలా, ఏది తినాలి అనే విషయం మీదా ఆ కంపెనీ ఆధిపత్యాన్ని ఆపగలగాలా వద్దా? అంటే బ్యాన్ పెప్సీ, బ్యాన్ లేస్ అనేది తాత్కాలిక నినాదంగా ఆగిపోకూడదు.

ఓ ఆదివాసీని కొట్టి చంపారు..ప్రశ్నించిన వారిపై కాల్పులు జరిపి మరొకరిని చంపేశారు

గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా జేసావాడా పట్టణ పోలీసు స్టేషన్ లో కమేశ్ గమారా అనే ఆదివాసీని పోలీసులు కొట్టి చంపారు. దీనిని ప్రశ్నించడానికి వచ్చిన 500 మంది ఆదివాసులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామాసు మొహానియా అనే అదివాసీ ప్రాణాలు కోల్పోయాడు.

శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది

12 సంవత్సరాలు గడచిపోయినా, గుజరాత్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 78 మంది నిందితులు యింకా జైల్లోనే ఉన్నారు

కులాంతర పెండ్లిళ్ళు, సెల్ ఫోన్లు బ్యాన్... స్త్రీలపై 12 గ్రామాల తీర్మానం, మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లా దంతేవాడ తాలూకాలోని 12 గ్రామాల్లోని ఠాకూర్లు ఈ నెల (జూలై, 2019) 14 న సమావేశమయ్యారు. ఠాకూర్లు అంటే ఆ కులపు స్త్రీ పురుషులందరూ కాదు మగోళ్ళు మాత్రమే అన్ని గ్రామాల్లోని 800 మంది మగోళ్ళు సమావేశమయ్యారు. సమాజం మనువు చెప్పినట్టు నడవ‌డం లేదని గుండెలు బాదుకున్నారు. పిల్లలు మన చేతుల్లో లేకుండా పోతున్నారని, మగ పిల్లలు ఎలా ఉన్నా పర్వా

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ట్రంప్