మతోన్మాద మూక ప్రాణాలు తీస్తుంటే - వీళ్ళు కడుపులో పెట్టుకొని రక్షించారు.

మతోన్మాద

మనిషికి మతం కన్నా మానవత్వమే ముఖ్యమని చాటి చెప్పారు ఢిల్లీ ప్రజలు. తరాలుగా తమతో పాటు కలిసిమెలిసి ఉన్న వాళ్ళపై దుర్మార్గమైన దాడి జరుగుతూ ఉంటే తమ కడుపులో పెట్టుకొని కాపాడారు. ఢిల్లీలో చెడ్డీ గ్యాంగ్ ముఠాలుముస్లింల‌ ఇండ్ల మీద పడి దాడులు చేస్తున్నప్పుడు. ఇండ్లు, షాపులు తగలబెడుతున్నప్పుడు తమ ప్రాణాలకు తెగించి వందలాది ముస్లిం కుటుంభాలను తమ తమ ఇండ్లలో దాచారు స్థానిక హిందువులు. ఇద్దరు ముగ్గురు ఉండగలిగే ఇండ్లల్లో పదుల సంఖ్యలో ముస్లింలను దాచారు హిందువులు.

శివ విహార్ ఏరియాలోకి కర్రలు, రాడ్లు, రాళ్ళు చేతుల్లో పట్టుకొని వందల మంది చెడ్డీ గ్యాంగ్ మూకలు ప్రవేశించి ముస్లింల ఇండ్లు టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్నప్పుడు స్థానికంగా ఉండే రెండు హిందూ కుటుంభాలు వాళ్ళ ఇండ్లల్లో 20 మంది ముస్లింలను ఆశ్రయం ఇచ్చారు. ఆ ముస్లిం కుటుంబాలు ఇండ్లు పూర్తిగా తగలబెట్టారు. వాళ్ళు ఇండ్లు విడిచి పారిపోతుంటే వాళ్ళను రక్షించిన రెండు హిందూ కుటుంభాలు రెండు రోజులపాటు వాళ్ళను తమ ఇంట్లోనే ఉంచుకున్నాయి. పోలీసులు బుధవారం సంఘటన స్థలానికి చేరుకుని వారిని సురక్షితమైన ప్రదేశానికి తరలించారు.

హెయిర్ కటింగ్ సెలూన్లో పనిచేసే మహ్మద్ రిజ్వాన్ కుటుంభం గత 30 సంవత్సరాలుగా హిందూ ప్రాబల్యం ఉన్న‌ ప్రాంతంలో నివసిస్తున్నార తామెన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలెదన్నాడు రిజ్వాన్.
అతని దుకాణం ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది మరియు అతని కస్టమర్లలో ఎక్కువ మంది హిందువులు.
"ఏమి జరిగిందో నాకు తెలియదు ... ఒక గుంపు నా షాపులోకి ప్రవేశించి దానిని ధ్వంసం చేసింది. నా కుటుంబ సభ్యులను మా పొరుగున ఉండే పంకజ్ గుప్తా రక్షించారు. నేను ఏదో ఒకవిధంగా నా ప్రాణాన్ని రక్షించకోగలిగాను. మేము టెర్రస్ మీదికి పారిపోతున్నప్పుడు గుప్తా తన ఇంటిపై నుండి మా వైపుకు దూకి నా కుటుంబాన్ని తన ఇంట్లోకి తీసుకెళ్ళాడుʹʹ అని రిజ్వాన్ చెప్పాడు.

అలాగే వికాస్ సింగ్ అనే మరో హిందువు ఎడుగురు సభ్యులున్న ఓ ముస్లిం కుటుంబాన్ని రక్షించి తన ఇంట్లో వారికి ఆశ్రయం కల్పించాడు.

రుక్షర్ అనే గృహిణి తన ఇంటి బైట‌ సందులో గొడవ విన్నప్పుడు ఆమె వంటగదిలో ఉంది. ఏమి జరుగుతుందో ఆమె అర్థం చేసుకోకముందే ఆమె బావ వారి ఇంటి వైపు వస్తూన్న గుంపు గురించి అరుస్తూ హెచ్చరించాడు.

"మేము సహాయం కోసం మా పక్కింటికి వెళ్ళాము వారు మాకు ఆశ్రయం ఇచ్చారు. బయట ఆపి ఉంచిన మా ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారుʹʹ అని శ్రీమతి రుక్షర్ అన్నారు.

హింస మూడు రోజుల పాటు సాగింది. ఆ తర్వాత ముస్తఫాబాద్‌కు చెందిన ముస్లిం కుటుంబాలు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టడం ప్రారంభించాయి. ముసుగులు ధరించిన సాయుధ వ్యక్తులు వచ్చి ఈ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లోని మురికివాడలకు, వాహనాలకు నిప్పంటించారని కుటుంబాలు తెలిపాయి.

ముస్తఫాబాద్ నివాసి షౌకత్ అలీ మాట్లాడుతూ, అల్లర్లు చెలరేగినప్పుడు తాను ఆశ్రయం పొందిన స్థలం నుండి మూడు రోజుల తరువాత బయటకు రాగలిగాను. " దాడులు జరిగిన రోజు నుండి నా పిల్లలు ఏమయ్యారో తెలియదు. వాళ్ళు కనపడటం లేదు. నా ఇల్లు పూర్తిగా తగలబెట్టారు. నేను నా జీవితంలో సేవ్ చేసిన ప్రతిదాన్ని కోల్పోయాను. నేను ఘజియాబాద్‌లో నా బంధువులతో కలిసి ఉండబోతున్నానుʹʹ అని కూలీగా పనిచేసే మిస్టర్ అలీ అన్నారు.
(ʹహిందూʹ సౌజన్యంతో)

Keywords : delhi, attacks, rss, muslim, hindu, shiva vihar
(2024-04-07 08:16:10)



No. of visitors : 1083

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

అవును,దళిత బాలిక‌ కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులు

ఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మతోన్మాద