క్విడ్ ప్రో క్వో !
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల తీవ్ర విమర్షలు వస్తున్నాయి. ఇది క్విడ్ ప్రో క్వో కాదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం కోరుకున్న విధంగా తీర్పులు ఇచ్చినందుకు గొగోయ్ కి దక్కిన బహుమతిగా ఆరోపణలు వస్తున్నాయి. అయోద్య కేసు, కశ్మీర్ లో మానవహక్కుల హననం ,కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలులు, రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు...వీటన్నింటిపై రంజన్ గొగోయ్ తీర్పులు ఇచ్చాడు. అన్ని తీర్పులు బీజేపీ కోరుకున్నట్టుగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను రాజ్య సభకు నామినేట్ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జస్టిస్ (రిటైర్డ్) మదన్ బి లోకూర్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ
ʹʹజస్టిస్ గొగోయ్ ఏ పదవి పొందుతారనే దానిపై కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి ఆ కోణంలో ఆయనను రాజ్యసభకు పంపడం ఆశ్చర్యం కలిగించదు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పదవి ఇంత త్వరగా రావడం. ఇది న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్య్రం, నిష్పాక్షికత, సమగ్రతను పునర్నిర్వచించింది. చివరి బురుజు పడిపోయిందా? ʹʹ
మరో సీనియర్ న్యాయవాది, దుష్యంత్ దేవ్, ది వైర్తో మాట్లాడుతూ, ʹʹఇది పూర్తిగా అసహ్యకరమైనది,ఇది స్పష్టమైన క్విడ్ ప్రో క్వో. న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్య్రం పూర్తిగా నాశనం చేయబడింది. ʹʹ
న్యాయవాది గౌతమ్ భాటియా ట్వీట్ చేస్తూ, "స్వతంత్ర న్యాయవ్యవస్థ చనిపోయిందని స్పష్టంగా కనబడటానికి కొంత సమయం పట్టింది, కాని అధికారికంగా చనిపోయింది.ʹʹ
గోగోయి నామినేషన్పై స్పందిస్తూ సిపి (ఎం) నాయకుడు సీతారాం యెచురీ ఇలా ట్వీట్ చేశారు:
ఓ మాజీ ప్రధాన న్యాయమూర్తిని ప్రభుత్వం గవర్నర్ గా నియమించినప్పుడు "పదవీ విరమణ అనంతర నియామకాలు న్యాయవ్యవస్థ స్వాతంత్య్రానికి మచ్చ అని ఒక బలమైన దృక్పథం ఉంది" అని శ్రీ రంజన్ గొగోయ్ గత సంవత్సరం స్వయంగా చెప్పారు.
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసి సోమవారం, "ఇది ʹక్విడ్ ప్రో క్వోʹ కాదా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే న్యాయమూర్తుల స్వాతంత్య్రంపై ప్రజలకు ఎలా నమ్మకం ఉంటుంది?ʹʹ
బిజెపి మాజీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా ట్విట్టర్లో.. తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసినందుకు ʹనోʹ అని చెప్పే మంచి జ్ఞానం "మాజీ సిజెఐ రంజన్ గొగోయ్ కు ఉంటుందని నేను నమ్ముతున్నాను. లేకపోతే అతను న్యాయవ్యవస్థ ప్రతిష్టకు లెక్కించలేని నష్టాన్ని కలిగించినవాడవుతాడు.
దీనిపై బీజేపీ అభిమానుల వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ చేసినప్పుడు మేమెందుకు చేయొద్దు అనే విధంగా వారు వాదిస్తున్నారు. గతంలో సీజేఐ గా పని చేసిన రంగనాథ్ మిశ్రాను కాంగ్రెస్ రాజ్యసభకు పంపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
Keywords : bjp, ranjan gogoi, supreme court
(2024-03-23 22:28:24)
No. of visitors : 607
Suggested Posts
| లెనిన్ ఎవరూ..!?భగత్సింగ్ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ʹ |
| నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. |
| ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు.... |
| Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ. |
| ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్ఖాన్ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్ఖాన్ స్నేహితుడు అస్లామ్ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.
|
| ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. |
| అవును,దళిత బాలిక కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులుఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. |
| ఏబీవీపీకి భయపడను - అమర జవాను కూతురుʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్.... |
| మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్యూ ప్రత్యేకత - ఉమర్ ఖలీద్మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. |
| కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడిఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.... |