కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం

కరోనాతో

కోవిడ్ 19 వ్యాప్తి దృష్ట్యా జైళ్లలోని ఖైదీలందరినీ విడుదల చేయాలి.
రాజకీయ భిన్నాభిప్రాయాల కారణంగా అక్రమ నిర్బంధంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న సాయిబాబా, ఎనభై ఏళ్ల వరవరరావు, కాశీం వంటి రచయితలను, మేధావులను, ప్రజాసంఘాల కార్యకర్తలను విడుదల చేయాలి.

కరోనా వైరస్ నుంచి పౌరుల జీవించే హక్కును కాపాడటానికి ప్రభుత్వం ప్రజలందరినీ స్వీయ నిర్బంధంలోకి తీసికెళ్లింది. ఇది ప్రత్యేక పరిస్థితి. అయితే ఇది మనముందుకు ఒక ప్రశ్నను తీసుకొచ్చింది. జీవించే హక్కులో అంతర్భాగమైన స్వేచ్ఛ ప్రధానమా? లేక జీవించడం ప్రధానమా? అంటే.. బతికుంటేనే స్వేచ్ఛ కదా! అనే వాదన దిశగా ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. దీని న్యాయాన్యాయాలతో సంబంధం లేకుండా తాత్కాలికమే అయినా ఇది ఇప్పటి అవసరమని ప్రపంచ ప్రజలంతా కట్టుబడ్డారు.
ప్రభుత్వం పాటిస్తున్న ఈ సూత్రాన్ని ఖైదీలకు కూడా అన్వయించాలి. నేరారోపణలతో స్వేచ్ఛను నియంత్రించి నిందితులను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. ఆధారాలు ఉన్నా లేకున్నా కేవలం నేరారోపణలతోనే జైళ్లలో ఎందరో ఉన్నారు. అలాగే సాక్ష్యాధారాలు, నేర విచారణ, శిక్షాస్మృతి మంచి చెడ్డల సంగతి ఎలా ఉన్నా శిక్షలు అనుభవిస్తున్న వాళ్లూ జైళ్లలో ఉన్నారు. స్వేచ్ఛకన్నా బతుకు ముఖ్యమని ప్రభుత్వం ఈ సందర్భంలో అనుకున్నట్లయితే ఖైదీలను ప్రత్యేకంగా నిర్బంధించాల్సిన అవసరం లేదు. జైళ్లలో ఖైదీలకు కరోనా అంటుకోకుండా నిరోధించడం సాధ్యం కాదు. ఒకవేళ జైళ్లలో కరోనా సోకితే రిమాండ్ ఖైదీలు, శిక్షపడిన ఖైదీలు, జైలు సిబ్బంది వ్యాధిగ్రస్తులవుతారు. భారీ ఎత్తున చనిపోతారు. అట్లాగే వైరస్ కూడా ప్రబలిపోతుంది.
మన దేశంలో జైళ్ల సామర్థ్యానికి మించి సగటున 114 శాతం అధికంగా ఖైదీలు ఉన్నట్లు 2019 నాటి భారతీయ న్యాయ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ సగటు లెక్క ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. ఒకేచోట ఇంత సాంద్రతతో మనుషులు నిర్బంధంలో ఉండటం ఇప్పుడెంత ప్రమాదమో చెప్పనవసరం లేదు. జైలు సామర్థ్యానికి తగినట్లే ఖైదీలు ఉన్నా అక్కడి వాతావరణం వాళ్ల జీవించే హక్కుకు విఘాతం కలిగిస్తుంది. ఈ విషయంలో ఖైదీల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆందోళనకు గురవుతారు. ఖైదీలు కూడా దేశ ప్రజలే. ప్రభుత్వం కరోనా బారి నుంచి ప్రజల బతుకు విషయంలో తీసుకొనే జాగ్రత్తలు ఖైదీలకు కూడా వర్తింపజేయాలి. కాబట్టి కరోనా సమస్య పూర్తిగా తీరే వరకు వారిని బైటనే ఉంచాలి. ఆ తర్వానే న్యాయ, శిక్షా ప్రక్రియలను కొనసాగించాలి.
రాజకీయ ఖైదీల విషయంలో కూడా ఇదే వైఖరి తీసుకోవాలి. మావోయిస్టు రాజకీయ సంబంధమైన ఆరోపణలతో దేశంలో ఎందరో జైళ్లలో ఉన్నారు. వీళ్లలో ఎక్కువ మంది రాజకీయ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కారణంగానే నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు. మానవ జాతినే సవాలు చేసే ముప్పు ముంచుకొచ్చిన కరోనా సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మనుషులందరం కలిసి దీనిని ఎదుర్కోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. సిఎఎ వంటి ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరి నుండి భీమాకొరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మంది వరకు ఎంతో మంది రాజకీయాల కారణంగానే జైళ్ళలో ఉన్నారు. వీరిలో వరవరరావు ఎనభై ఏళ్ల వయోభారంతో ఏడాదిన్నరగా జైలులో ఉన్నారు. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటివారికి కరోనా ముప్పు ఎక్కువ. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖైదీలందరినీ విడుదల చేయాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది. ఇందులో భాగంగానే మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖైదీలను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఖైదీలను విడుదల చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే అందులో ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడిన ఖైదీలను, ఏడు సంవత్సరాల లోపు శిక్షా నేరాలు ఆరోపించబడిన అండర్ ట్రయల్ ఖైదీలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం వల్ల ఈ పరిధిలోకి సాయిబాబా గాని, భీమా కోరేగాం నిందితులు గానీ, దేశవ్యాప్తంగా ఊపా కింద అరెస్టు కాబడిన వందలాది రాజకీయ ఖైదీలు గానీ వచ్చే అవకాశం లేదు. అంటే ఈ విపత్తు సమయంలో కూడా రాజకీయ కక్ష సాధింపు కొనసాగుతుంది. ఇది చాలా అమానవీయ చర్యగా, ఫాసిస్టు దమనకాండగా చరిత్రలో నిలిచిపోతుంది.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కోర్టుల్లో విచారణ కూడా సాగడం లేదు కాబట్టి రిమాండ్ ఖైదీలను జైళ్లలో ఉంచడమంటే వాళ్లను కరోనా వైరస్ కు అప్పగించినట్లే. వాళ్లు నేరం చేశారని నిర్ధారించకముందే వాళ్లను శిక్షించినట్టు అవుతుంది. తెలంగాణలో విప్లవ రచయితల సంఘం కార్యదర్శి, రచయిత కాశీం సహా గత ఆర్నెల్లలో అరెస్టు చేసిన రచయితలు, మేధావులు, ప్రజాసంఘాల బాధ్యులకు సంబంధించిన బెయిళ్ల విచారణ కూడా సాధ్యం కాదు. ఇది న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం. కాబట్టి వారి జీవించే హక్కును కాపాడటానికి తక్షణం జైళ్ల నుంచి విడుదల చేయాలి. ఈ సూత్రం కేవలం రిమాండ్ ఖైదీలకే కాకుండా కింది కోర్టుల్లో శిక్షపడి అప్పీలు తేలకుండా జైళ్లలో ఉన్న ఖైదీల విషయంలోనూ వర్తిస్తుంది. ప్రొ. సాయిబాబా తీవ్ర అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా బెడద తీరేదాకా జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించాలి. దేశ ప్రజలందరూ కరోనా విపత్తు వల్ల గృహ నిర్బంధంలో ఉన్న స్థితిలో ఖైదీలను కూడా ఇళ్ళకు పరిమితం చేయవచ్చు. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయస్థానాలు కూడా ఇందులో జోక్యం చేసుకొని అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
-అరసవిల్లి కృష్ణ (విరసం అధ్యక్షుడు), బాసిత్ (విరసం ఉపాధ్యక్షుడు), రివేరా (విరసం సహాయ కార్యదర్శి)
30-03-2020

Keywords : varavararao, saibaba, kashim, political prisoners,
(2024-04-05 09:52:31)



No. of visitors : 761

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కరోనాతో