లాక్ డౌన్ ముగిసిన తర్వాత మన వ్యూహం ఏంటి?: కేంద్రానికి 800 మంది శాస్త్రవేత్తల సూటి ప్రశ్న

లాక్

లాక్ డౌన్ ముగిసిన తరువాత వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏ వ్యూహంతో వెళ్లనుందని దేశంలోని సుమారు 800 మంది విద్యా వేత్తలు, ఆరోగ్య రంగంలోని నిపుణులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఏప్రిల్ 1వ తేదీన వారంతా ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకోబోయే ముఖ్యమైన నిర్ణయాల గురించి ముందే వెల్లడించాలని వారు కోరారు. ఐఐఎఫ్ఆర్, ఎన్సీబీఎస్ శాస్త్రవేత్తలు, ఐఐటీయన్లు, ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్సీ ప్రతినిధులు, ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్ మెంట్ ప్రతినిధులు ఈ స్టేట్ మెంట్ పై సంతకాలు చేశారు.

"లాక్ డౌన్ కేవలం తాత్కాలిక సొల్యూషన్ మాత్రమే. ఈ సమయం హెల్త్ కేర్ సిస్టమ్ ను ఎలా కాపాడుకోవాలన్న విషయమై ఆలోచించుకునేందుకు సమయాన్ని ఇచ్చింది. లాక్ డౌన్ తరువాత సమాజం ముందున్న సవాళ్లకు ఇంకా సమాధానాలు లేవు. దీర్ఘకాలిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఐసీటీఎస్ ప్రతినిధి సువ్రత్ రాజు అభిప్రాయపడ్డారు. వైరస్ కు లాక్ డౌన్ ను చికిత్సగా భావించరాదని ఆయన అన్నారు. దేశంలో వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోందని గుర్తు చేసిన ఆయన, లాక్ డౌన్ ను తొలగిస్తే, ఈ మహమ్మారి మరింతగా విజృంభిస్తుందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తరువాతి ప్రణాళికలపై ముందుగానే ఓ అవగాహనకు రావాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. "భౌతిక దూరాన్ని పాటించడం మంచి నిర్ణయమే అయినా, అదొక్కటే సరిపోదు. ఇక ఇంతవరకూ కరోనా నివారణకు ఓ రోడ్ మ్యాప్ ను కేంద్రం ప్రకటించక పోవడం అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ లాక్ డౌన్ ముగిసిన తరువాత మహమ్మారిపై ఎలా పోరాటం చేయాలో ముందే చెప్పాలి" అని కేంద్రానికి పంపిన స్టేట్ మెంట్ లో శాస్త్రవేత్తలు కోరారు.

ఇక, ప్రభుత్వం దేశంలోని కరోనా పాజిటివ్ కేసులను గుర్తించడంలోనూ ఆలస్యం చేస్తోందన్న అభిప్రాయాన్ని సైంటిస్టులు తమ స్టేట్ మెంట్ లో వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రక్త నమూనాల పరీక్షలపై ఆంక్షలున్నాయని, వాటిని తొలగిస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సమయం తరువాత కరోనా సోకి, బయటకు రాకుండా ఉండిపోయిన వారి ద్వారా వైరస్ ఎంతమందికైనా వ్యాపించవచ్చని వారు హెచ్చరించారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

ఇక లాక్ డౌన్ తరువాత ఏర్పడే మరో ప్రధాన సమస్య రివర్స్ మైగ్రేషన్. ఇప్పటికే నగరాలను వదిలి, తమ స్వస్థలాలకు చేరుకున్న వారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సెంటర్లలో కాలం గడుపుతున్న వారు, తిరిగి పనుల్లోకి వస్తారని గుర్తు చేసిన శాస్త్రవేత్తలు, వారి విషయంలోనూ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాల్సి వుంటుందని సూచించారు. రివర్స్ మైగ్రేషన్ ను నిలువరించినా సమస్యలు ఎదురవుతాయని, కూలీలు, పేదల పట్ల మానవత్వాన్ని ప్రదర్శిస్తూనే, వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆహార ధాన్యాల నిల్వలను పోలీసుల సాయంతో అవసరమైన వారికి పంచేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని కోరారు.

Keywords : corona, lockdown, narendra modi, TIFR, NCBS, the IITs, IISERs, IISc, doctors, members of Indian Doctors for Peace and Development.
(2024-03-19 00:24:11)



No. of visitors : 999

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేత‌నాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సు

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన‌ సిఫార్సు చేసింది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


లాక్