తబ్లిఘీ జమాత్: రెచ్చగొడుతున్న‌ మీడియా .... అందులోనూ కొత్తపద్దతులు ఎంచుకున్న దైనిక్ భాస్కర్

తబ్లిఘీ

ఒకవైపు కరోనా భయం...లాక్ డౌన్ కష్టాల మద్య జనం బతుకులు వెళ్ళదీస్తూ ఉంటే మాత్రం కొందరు మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి పొందే మార్గాలను వెతుకుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాన్ని నడిపించే ఆరెస్సెస్, వీరికి మద్దతుగా నిరంతరం సోషల్ మీడియాలో రాతలు రాసే వారి ఐటీ సెల్, వీరికి మించి తమ ప్రభుభక్తిని నిరూపించుకునేందుకు ప్రతి రోజూ, ప్రతి క్షణం పాటుపడే కొన్ని మీడియా సంస్థలు రకరకాల పద్దతుల్లో బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ప్రజలను మతాలవారీగా విడగొట్టడమనే తన పాతపద్దతులను ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా మానడం లేదు. ముస్లింలపై విషం చిమ్మడం వారిపైకి ఇతరమతస్థులను రెచ్చగొట్టడం సాగిస్తూనే ఉన్నారు.
ఉత్తర భారత దేశంలో సంఘ పరివార్ కు అధికార పత్రిక తీరుగా పనిచేసే దైనిక్ భాస్కర్ అనే దిన పత్రిక దీనికోసం కొత్త కొత్త పద్దతులను కనిపెడుతోంది.

పజిల్స్ నింపడం చాలా మందికి ఇష్టం. ఆ ఇష్టాన్ని మతాన్ని రెచ్చగొట్టడానికి వినియోగించుకుంది దైనిక్ భాస్కర్.

పై విషం చిమ్మడానికి, నరేంద్ర మోడీని ఆకాశానికెత్తడానికి పజిల్ ను ఉపయోగించుకుంది ఆపత్రిక. దీనిపై ది వైర్ వెబ్ సైట్ ఓ కథనాన్ని పోస్ట్ చేసింది. దైనిక్ భాస్కర్ ప్రచురించిన పజిల్ ప్రశ్నలను ʹది వైర్ʹ ʹన్యూస్ లాండ్రీʹ అనే వెబ్ సైట్ నుండి తీసుకుంది.
ది వైర్ కథనం ప్రకారం... దైనిక్ భాస్కర్ ప్రచురించిన పజిల్ లోని ప్రశ్నలు ఇలా ఉన్నాయి...

"ఏ అసోసియేషన్ యొక్క నిర్లక్ష్యం దేశంలో కరోనావైరస్ కేసుల పెరుగుదలకు దారితీసింది? (4,3) "

ʹవేలాది మందిని సమీకరించే ఢిల్లీలోని ఇస్లామిక్ అసోసియేషన్ అధిపతి ఎవరు? (3,2) "

"వేలాది మంది ప్రజలు సమావేశమైన తరువాత ఢిల్లీలోని ఏ భవనం మూసివేయబడింది?"
"వేలాది మంది జమాతీలను ఒకచోట చేర్చికరోనావైరస్ వ్యాప్తికి కారణమైన‌ మౌలానాకు _________ శిక్ష ఇవ్వవచ్చు."

"ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న ఏ రాష్ట్రం జమాత్ సమావేశాల్లో పాల్గొన్న‌ 88 మందిలో 13 కరోనా పాజిటీవ్ కేసులను కనుగొంది?"

"తబ్లిగి యొక్క చురుకైన విదేశీ సభ్యులలో 33 మంది ఈ దేశానికి చెందినవారు."

"ఇస్లామిక్ అసోసియేషన్ అధినేత కరోనావైరస్ ను ఎదుర్కోవటానికి వ్యతిరేకంగా వేలాది మందిని రెచ్చగొట్టడం చాలా __________."

"జమాత్ సభ్యులు ఈ దక్షిణాది రాష్ట్రానికి చేరుకున్నప్పుడు కరోనావైరస్ కేసులు పెరిగాయి."

ఈ జాతీయ దినపత్రిక దైనిక్ భాస్కర్ తాము కరోనాపై పోరాడుతున్నామని ప్రతిరోజూ చెప్పుకుంటుంది . ʹమీరు ఇంట్లో ఉంటే కరోనావైరస్ గొలుసు విరిగిపోతుంది. ఈ కరోనా పజిల్ మీ జ్ఞానాన్ని పెంచుతుందిʹʹ అని ప్రచారం చేసుకుంటుంది

తబ్లిగి జమాత్ పై విషం చిమ్ముతూ నరేంద్ర మోడీని పొగుడుతూ తయారు చేసిన ఈ పజిల్ ను ఈ పత్రిక హర్యానా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, చండీగడ్, న్యూ ఢిల్లీ ఎడిషన్ లలో ప్రచురించింది కానీ రాజస్తాన్ ఎడిషన్ లో మాత్రం ప్రచురించలేదు.

ఇక నరేంద్ర మోడీని బీజేపీ ప్రభుత్వాన్ని పొగడడం కోసం ఇచ్చిన ప్రశ్నలు...

"మన దేశంలో కొరోనావైరస్ కేసులు తక్కువగా ఉండడానికి కారణం మన ప్రభుత్వం తీసుకున్న _______ పరిష్కారాలు. (3) "

"మన దేశప్రజల‌ మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉండటానికి మన‌ ప్రధాన మంత్రి _______ ప్రయత్నాలు చేశారు. (4) "

"మొత్తం లాక్ డౌన్ విధించే నిర్ణయం ________ కానీ అది తప్ప వేరే పరిష్కారం లేదు."

"కరోనావైరస్ ను ఆపడానికి సకాలంలో చర్యలు తీసుకున్న అతిపెద్ద ప్రజాస్వామ్యం."

"ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించడం యొక్క ప్రాధమిక లక్ష్యం దేశ ప్రజలను ________ యొక్క థ్రెడ్‌లో బంధించడం."
దీపం వెలిగించే చర్య కరోనావైరస్ యొక్క ________ నుండి వెలుగులోకి దారి తీస్తుంది. ʹʹ మన దేశప్రజ‌ల _______ ని పెంచడానికి ప్రధానమంత్రి నిరంతరం మన‌తో సంభాషిస్తున్నారు.ʹʹ

ఇటువంటి పనులు పత్రికలు చేయతగ్గవేనా ? అందులోనూ ఇటువంటి విపత్కర పరిస్తితుల్లో ?

Keywords : dainik bhaskar, news paper, rss, bjp, narendra modi
(2024-04-24 16:49:57)



No. of visitors : 659

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేత‌నాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సు

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన‌ సిఫార్సు చేసింది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తబ్లిఘీ