కరోనా నేపథ్యంలో...జి.ఎన్.సాయిబాబాను వెంటనే విడుదల చేయాలి -సాయిబాబా రక్షణ, విడుదల కమిటీ ప్రకటన
డాక్టర్ జి. ఎన్. సాయిబాబా రక్షణ- విడుదల కమిటీ పత్రికా ప్రకటన
నాగపూర్ జైలులో వున్న డాక్టర్ జి. ఎన్. సాయిబాబాను విడుదల చేయాలి!
COVID-19 వైరస్ వల్ల సాయిబాబా జీవితానికి మరింత ప్రమాదం వున్నది.
ప్రజాస్వామ్యాన్ని నినదించే నిర్బంధ స్వరాలనన్నింటిని విడుదల చేయాలి!
వారి జీవించే హక్కును ఎత్తి పట్టాలి.
నాగ్పూర్ సెంట్రల్ జైలులో గత ఆరు సంవత్సరాలుగా, జైలు శిక్ష అనుభవిస్తున్న డాక్టర్ జి. ఎన్. సాయిబాబా ఆరోగ్యం ప్రమాదకరంగా క్షీణించింది. ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు ప్రొఫెసర్. మానవ హక్కుల కార్యకర్త. బాల్యంలో పోలియో వచ్చిన తరువాత రెండు కాళ్ళకు సోకిన పక్షవాతం వల్ల తొంభై శాతం పైగా శారీరక వికలాంగుడు. చక్రాల కుర్చీలేకుండా కదలలేడు. జైలు నిర్బంధం వల్ల ఇప్పుడు అనేక వ్యాధులపాలయ్యాడు. అతని ఆరోగ్యం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది.
2014 మే 9, న మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీ నుంచి ఎత్తుకెళ్ళి చట్టవ్యతిరేక కార్యకలాపాలు (నిరోధక) చట్టం (యుఎపిఎ) లోని అనేక సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. జి.ఎన్. సాయిబాబా ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న ఎలక్ట్రానిక్ పత్రాలను కోర్టులో ప్రవేశపెట్టలేదు, వాటికి సంబంధించిన సాక్షులను పరీక్షించలేదు లేదా సాక్ష్యంలో భాగంగా చూపించలేదు.
ఈ ఎలక్ట్రానిక్ పత్రాలను నేరుగా 313 ప్రకటనలో భాగంగా ప్రవేశపెట్టారు తప్ప, ప్రధాన సాక్ష్యంలో భాగంగా కాదు. సాక్ష్యాధారాలలో భాగం కాని ఈ పత్రాలను 313 లో భాగంగా తీసుకురావడానికి సంబంధించి వున్న సుప్రీంకోర్టు తీర్పులు వేటినీ న్యాయమూర్తి లెక్కచేయలేదు.
ఇలా ఉపయోగించిన పత్రాలు విచారణలో భాగం కాదు. డాక్టర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి 2017 మార్చి 7 న గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదును విధించింది.
2016 లో కొద్ది కాలం మినహాయించి, అరెస్టు చేసినప్పటి నుండి అతన్ని నాగ్పూర్ సెంట్రల్ జైలులోని అండాసెల్లో ఒంటరిగా ఉంచారు. భారతీయ జైళ్లు సామర్థ్యానికి మించి నిండిపోయి, కనీస ప్రాథమిక వైద్య సదుపాయాలు లేకపోవడము వల్ల, దేశవ్యాప్తంగా వ్యాపించిన COVID-19 గత్తర.. ప్రత్యేకించి వృద్ధులు, యిప్పటికే తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారిని మరింతగా యిబ్బంది పెడుతున్న ఈ సందర్భంలో డాక్టర్ జి. ఎన్. సాయిబాబా భవిష్యత్తు మరింత విషాదకరంగా కనబడుతున్నది.
డాక్టర్ జి. ఎన్. సాయిబాబా తన రాజకీయ జీవితమంతా ఆదివాసీలు, దళితులు, ముస్లింలు తదితర అణగారిన వర్గాల హక్కుల కోసం మాట్లాడారు. మధ్య భారతదేశంలోని ప్రజలమీద ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో జరిగిన రాజ్యప్రాయోజిత దాడికి వ్యతిరేకంగా మాట్లాడారు. తన విద్యార్థులకు అండగా నిలబడి విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామ్య సూత్రాలు, సామాజిక న్యాయం కోసం వాదించారు. నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడించారు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడానికి అవిశ్రాంతంగా కృషి చేశాడు.
ఇంతటి తీవ్ర శారీరక వైకల్యంతోనూ అనారోగ్యంతోనూ బాధపడుతున్న వ్యక్తిని చూసుకోవటానికి అవసరమైన సదుపాయాలు లేవని నాగ్పూర్లోని ఆస్పత్రులూ, జైలు అధికారులూ పేర్కొన్నప్పటికీ కూడా అతను యింకా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు, చికిత్స జరగడం లేదు, బెయిల్ యివ్వడం లేదు. ఏది ఏమయినప్పటికీ, వైద్య సదుపాయాల కొరతతో అమానుషంగా గౌరవప్రదమైన జీవితం అనే ప్రాథమిక ప్రాథమిక హక్కు తిరస్కరించబడినప్పటికీ అతను తన పోరాట స్ఫూర్తిని సజీవంగా నిలుపుకున్నాడు.
కండరాల క్షీణత వల్ల డాక్టర్ జి. ఎన్. సాయిబాబాకు చేతుల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. ప్యాంక్రియాటైటిస్, అధిక రక్తపోటు, కార్డియోమయోపతి, దీర్ఘకాలిక వెన్నునొప్పి, కదలకుండా వుండడం, నిద్రలేమి వగైరా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నాగ్పూర్లోని వాతావరణ పరిస్థితులు, కిటికీలేని ఒంటరి అండా సెల్ అతని గుండెస్థితిని మరింతగా దెబ్బతీసింది. పర్యవసానంగా, అతని శారీరక రుగ్మతలు తీవ్రతరమవుతున్నాయి, నొప్పి నివారణా మందులు, సరిపడా వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే నాజూకుగా ఉన్న ఆరోగ్యస్థితి మరింత క్షీణిస్తోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ మరియు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ, కోర్టులు అతనికి బెయిల్ మంజూరీని మళ్ళీ మళ్ళీ నిరాకరిస్తున్నాయి.
సుప్రీంకోర్టు జీవించే హక్కును సమర్థించింది. ఖైదీల స్థితిని పరిశీలిస్తూ ʹమానవ గౌరవాన్ని కించపరిచి, అవసరమైన చిత్రహింసలకు గురిచేసి, మృగ స్థాయికి దిగజార్చేలా ఒక మనిషినితో ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా ఏకపక్షంగా వుంటుంది. ఇలా చేయడాన్ని ఆర్టికల్ 14 కింద ప్రశ్నించవచ్చుʹ అని అన్నది.
మానవుల స్వాభావిక గౌరవాన్నీ, పౌర, రాజకీయ స్వేచ్ఛను ఆస్వాదించే స్వేచ్ఛా మానవుల ఆదర్శాన్నీ గుర్తించే పౌర-రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (ఐసిసిపిఆర్) మీద భారతదేశం సంతకం చేసింది. అంతేకాకుండా, 2007 అక్టోబర్ 1న వికలాంగుల హక్కులపై యుఎన్ కన్వెన్షన్ (సిఆర్పిడి) ను కూడా భారతదేశం ఆమోదించింది. ఖైదీల చికిత్స కోసం ప్రామాణిక కనీస నియమాలపై(వీటినే నెల్సన్ మండేలా రూల్స్ అని కూడా పిలుస్తారు) ఐక్యరాజ్యసమితి తీర్మానం 70/175 ను కూడా భారత్ స్వీకరించింది. ఈ ఒడంబడికలు, సమావేశాలు, తీర్మానాలు అందరు వ్యక్తులు, ఖైదీలు వికలాంగుల జీవితానికి, గౌరవానికి హామీనిస్తాయి. వాటి అమలుకు అవసరమైన ప్రమాణాలను రూపకల్పన చేస్తాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశంలోని జైళ్ళలో సగటున 117% ఖైదీలను వుంచగా, మహారాష్ట్ర లో ఆ సంఖ్య సగటున 149% కంటే ఎక్కువగా ఉంది. అలాంటి ప్రదేశంలో COVID-19 వైరస్ వ్యాప్తి ప్రభావం డాక్టర్ సాయిబాబాకు మరణశిక్షగా పరిణమించే అవకాశం ఉంది.
జి.ఎన్. సాయిబాబా రక్షణ- విడుదల కమిటీ అతని జీవిత భద్రత గురించి ఆందోళన చెందుతోంది. COVID-19 వైరస్ వల్ల ఆయన ప్రాణాలకు కలగబోయే ముప్పుని గ్రహించి వెంటనే విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలనే విజ్ఞప్తి చేయాలని అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, వ్యక్తులను కమిటీ కోరుతోంది
ప్రొ. హరగోపాల్
ప్రొ. జగమోహన్ సింగ్
ప్రొ. మనోరంజన్ మొహంతి
ప్రొ. అమిత్ భాదురి
అరుంధతి రాయ్
నందితా నారాయణ్
కరేన్ గేబ్రియల్
సుమిత్ చక్రవర్తి
అశోక్ భౌమిక్
సంజయ్ కక్
పి కె విజయన్
వికాస్ గుప్తా
బిశ్వజిత్ మొహంతి
రాకేశ్ రంజన్
హనీ బాబు
శ్రీకృష్ణ దేవ రావ్
సీమా ఆజాద్
ఏ కె రామకృష్ణ
ఎన్. రఘురాం
అనిర్బన్ కర్
సుబ్రత్ కుమార్ సాహు
11 ఏప్రిల్ 2020
(ఇంగ్లీష్ ప్రకటన కు తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)
Keywords : gn saibaba, haragopal, nagpur jail, court, police
(2024-03-09 16:11:13)
No. of visitors : 761
Suggested Posts
| సాయిబాబాను చంపేస్తారేమో !సాయిబాబాని మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నాగ్పూర్ సెంట్రల్ జైల్లో కలిసాను. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించింది. ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందనిపించింది. జైలు అధికారులు ఎటువంటి... |
| A Complaint lodged to NHRC for deteriorating health of Dr. G.N. Saibaba by Defend in IndiaMost humbly this is to bring to your notice that I came to know from the wife of Professor Saibaba that on 22nd February 2017, Prof. G. N. Saibaba was admitted in ICU of a hospital for a mild chest pain and breathlessness and a severe pain in abdomen.... |
| Prof. G N Saibabaʹs emotional letter from jail to his wife Now you are the lone fighter fighting for my freedom. Donʹt get disheartened in these dark days we should not lose our hopes and dreams for the darkness canʹt permanently overshadow the light. These are not empty words..... |
| iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. SaibabaNow it is 47.5 degrees C. On 25th May at around 11.15 am I suffered severe chest pain, syncope attack and high-level dehydration together all at the same time. I was sitting at my table and had just started eating. I hardly took two spoonfuls of rice into my mouth. |
| ʹరాముడికి వర్తించే న్యాయం ప్రజలకు వర్తించదాʹ"సాయిబాబను కలిసేందుకు ఈనెల 13న నాగ్పూర్ సెంట్రల్ జైలుకు వెళ్లాను. జాలీ ములాఖత్. కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం లభించింది. రెండు వైపులా మసకబారిన అద్దాలు. వాటి గుండా చూస్తే అవతలి వైపు మనుషులు అంతంత మాత్రంగానే కనిపిస్తారు. మాట్లాడేది సరిగ్గా వినిపించదు కూడా. సాయిబాబ చాలా బలహీనంగా ఉన్నారు.... |
| Saibabaʹs health worsening - Delegation seeks NHRC intervention A delegation headed by Delhi University professor G N Saibabaʹs wife, Vasantha Kumari, on Thursday sought the intervention of the National Human Rights Commission to ensure proper medical care for the jailed academic. The condition of Saibaba... |
| RELEASE G.N. SAIBABA IMMEDIATELY - TVVWhen judiciary itself starts bypassing its role, then it points towards a dying democracy. It is ironic that even while holding these six people are so dangerous that they should be incarcerated for major part of their lives, the judgment fails to point out... |
| Freedom and Justice for GN Saibaba!The Popular Resistance – Left Anti-imperialist Cooperation condemns this decision of the Indian court. We send our unequivocal support to GN Saibaba, his comrades and the movement of support that grows in India.... |
| పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్రపంచానికి తెలియకుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
నెల వారీ ఫోన్ కాల్ అవకాశంలో భాగంగా నిన్న సాయిబాబా కుటుంభ సభ్యులతో మాట్లాడినప్పుడు కానీ ఆయన 10 రోజులు నిరాహారదీక్షకు పూనుకున్న విషయం తెలియలేదు. ప్రస్తుతం తాను గ్లూకోజ్ బాటిళ్లపై ఆధారపడి ఉన్నానని తెలిపారు |
| ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష
నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా ఈ నెల (అక్టోబర్) 21 వ తేదీ నుండి ఆమరణ నిరాహార ధీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 90 శాతం అంగవైకల్యంతో సహా అనేక రకాల అనారోగ్యాలతో సతమతమవుతున్న సాయిబాబాకు సరైన వైద్యం అందించడం లేదు |