హైదరాబాద్ శివార్లలో.. ఆకలితో..ఆగ్రహంతో...తిరగబడ్డ వలసకార్మికులు ...రెండు నెలలుగా జీతాలివ్వని కంపెనీ

కరోనా లాక్ డౌన్ వలస కూలీల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఉన్న ఊరిని వదిలి పొట్టచేతపట్టుకొని వందలు, వేల కిలోమీటర్ల దూరం బతకడానికి పోయిన కార్మికులకు లాక్ డౌన్ ఆశనిపాతంలా మారింది. తినడానికి తిండి లేక ఉండడానికి ఇంత జాగాలేక అష్టకష్టాలు పడుతున్న వలస జీవులు నడిచైనా స్వంత ఊర్లకు వెళ్ళడానికి సిద్దపడుతున్నారు. వందలు వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. వెళ్ళనివ్వని చోట్ల తిరగబడుతున్నారు.

హైదరాబాద్ నగర శివార్లలో...సంగా రెడ్డి జిల్లా కంది వద్ద కడుతున్న ఐఐటీ భవన నిర్మాణాల కోసం వచ్చిన కార్మికులు ఇవ్వాళ్ళ ఆకలితో, అసహనంతో తిరగబడ్డారు. పనులు చేయించుకొని జీతాలు ఇవ్వని కంపనీ ఒకవైపు, ఊరికి వెళ్ళలేని లాక్ డౌన్ మరో వైపు వాళ్ళను నిలవనివ్వలేదు. దాదాపు 2 వేల మంది కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. జీతాలైనా ఇప్పించండి..స్వంత ఊర్లకైనా వెళ్ళనివ్వండి అంటూ నినాదాలు చేశారు.

ఐఐటీ భవనాల నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ , షాపూర్ పౌలోమీ కంపెనీలు చేపట్టాయి. అక్కడ భవన నిర్మాణాల కోసం 2, 400 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీళ్ళంతా బీహార్ , ఝార్ఖండ్ , రాజస్థాన్ , ఒడిషా, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందినవాళ్ళు. ఐఐటీ వెనక వైపు వీరి కోసం ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లలోనే వీరి నివాసం. ఈ ప్రాంతాన్ని కంది లేబర్ కాలనీగా పిలుస్తారు. ఒక్కో షెడ్డులో 10 నుండి 16 మందికి తక్కువ కాకుండా ఉంటారు. ఏ విధమైన కనీస వసతులు లేకుండా, భౌతిక దూరం పాటించే అవకాశమే లేకుండా ఉంటుంది వీళ్ళ జీవితం.

లాక్ డౌన్ కారణంగా పని ఆగిపోయింది. పని చేసిన కాలాని సంబంధించి అంతకు ముందు నెల జీతం కూడా ఇవ్వలేదు యాజమాన్యం. అంటే ఇప్పటికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కార్మికులు యాజమాన్యాన్ని జీతం కోసం ఎప్పటి నుండో అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా భవన నిర్మాణ పనులు మళ్ళీ మొదలు పెట్టింది యాజమాన్యం. నాలుగు రోజులుగా కార్మికులు పనులకు వెళుతున్నారు. కానీ ... రెండు నెలలుగా చెల్లించాల్సిన వేతనాలు మాత్రం యాజమాన్యం ఇవ్వడం లేదు. అప్పటికే ఆకలితో, ఆహనంతో, ఆగ్రహంతో ఉన్న కార్మికులు ఈ రోజు ఒక్క సారిగా తిరగబడ్డారు. ఆఫీస్ ను ధ్వంస చేశారు. రోడ్డు మీదికి వచ్చి తమ జీతాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకొని వచ్చిన పోలీసులు వీళ్ళపై లాఠీచార్జ్ చేశారు. దాంతో కార్మికులు పోలీసులపై రాళ్ళదాడికి దిగారు. కొన్ని పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. దాంతో అధికారులు కార్మికులకు నచ్చజెప్పి కలక్టర్ వద్ద చర్చలకు ఒప్పించారు. తమకు యాజమాన్యం బకాయి పడ్డ రెండు నెలల జీతం ఇప్పించాలని, ఒకే రూమ్ లో 16 మందిని ఉంచుతున్నారని, ఇటువంటి సమయం లో భౌతిక దూరం పాటించకుండా ఉండలేమని చెప్పి తమకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేసి, ఉండడానికి సరైన వసతి కల్పించాలని కోరారు.
కార్మికులకు యాజమాన్యం బకాయిపడిన వేతనాలను ఇప్పిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. వెంటనే ఎల్ అండ్ టీ, షాపూర్ పౌలోమీ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడారు. రెండు , మూడు రోజుల్లో వేతనాలు ఇచ్చేందుకు యాజమాన్యాలు అంగీకరించడంతో కార్మికులు ఆందోళన విరమించారు.

Keywords : migrant workers, hyderabad, sangareddy, IIT, lockdown, corona
(2024-04-03 11:58:19)



No. of visitors : 1096

Suggested Posts


గాయపడ్డ తండ్రిని ఎక్కించుకొని1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన13 ఏళ్ళ చిన్నారి

లాక్ డౌన్ వలస కార్మికులను ఎన్నో కష్టాల పాలుచేస్తోంది. వాళ్ళు ఎన్ని రిస్క్ లైనా భరించి స్వంత ఇంటికి చేరుకోవాలని భావిస్తున్నారు. ఒకే ట్రక్కులో వందల మంది కిక్కిరిసి వెళ్తున్నారు. వేల కిలోమీటర్లు నడుస్తున్నారు.

లాక్ డౌన్: వలస కార్మికుల ఆకలి కేకలు - స్మశానంలో పడేసిన కుళ్ళిన అరటిపళ్ళు తింటూ....

లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీ నగరంలోని వేలాది మంది వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళకు ఉండడానికి షెల్టర్‌ లేక అల్లాడి పోతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా యమునా నది ఒడ్డున ఫ్లై ఓవర్ ల కింద బతుకులీడుస్తున్నారు. ఆ నదీ తీరాన వందల మంది వలస కార్మికులు తిండీ తిప్పలు లేక పస్తులతో అలమటిస్తున్నారు.

రైలు టిక్కట్ల పేరుతో వలస కార్మికులను దోచుకున్న బీజెపి నేత....ప్రశ్నించినందుకు కార్మికుడిపై దాడి

అసలే లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను ఓ బీజేపీ నాయకుడు నిలువుదోపిడీ చేశాడు. పైగా ఈ విషయంపై ప్రశ్నించినందుకు ఓ కార్మికుడిని రక్తం కారేట్టు తీవ్రంగా కొట్టాడు.

సైకిల్ పై స్వంతూరుకు బయలు దేరిన వలస కార్మికులు... భార్యాభర్త మరణం,అనాధ‌లైన చిన్నారులు

చత్తీస్ గడ్ కు చెందిన కృష్ణ‌, అత‌ని భార్య ప్ర‌మీల ఉపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ లోని ల‌క్నో‌కు వ‌ల‌స వచ్చి అక్కడి జాన్కీపుర మురికివాడ‌లో నివ‌సిస్తున్నారు. వీరికి నాలుగేండ్ల కూతురు చాందినితోపాటు మూడేండ్ల కొడుకు నిఖిల్ ఉన్నారు.

వలస కూలీలు స్వంతూర్లకు పోవడానికి సహకరించిన వాళ్ళపై కేసులు...బిల్డర్ల కోసం కర్నాటక బీజేపీ ప్రభుత్వం దుర్మార్గం

వలస కార్మికులను తమ స్వంతూర్లకు వెళ్ళడానికి సహాయం చేస్తున్న సామాజిక కార్యకర్తలపట్ల బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా కోపంగా ఉన్నారు. ఆ వ్యాపారులకు మద్దతుగా ప్రభుత్వం రంగంలోకి దిగి కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోంది.

సూరత్ లో మళ్ళీ తిరగబడ్డ వలస కార్మికులు...పోలీసుల లాఠీచార్జ్, అరెస్టులు

గుజరాత్ రాష్ట్రం సూరత్ లో వలస కార్మికులు మరో సారి తిరగబడ్డారు. కార్మికులు ఇలా తిరగబడి పోలీసులతో ఘర్షణ పడటం నెల రోజుల్లో దాదాపు ఇది ఆరోసారి. అనేక రాష్ట్రాల నుండి బతకడానికి సూరత్ వచ్చిన లక్షల మంది కార్మికులు లాక్ డౌన్ కారణంగా పనులు కోల్పోయారు.

కడుపు మండి సూరత్ లో మళ్ళీ రోడ్డెక్కిన వలస కూలీలు... లాఠీలు, టియర్ గ్యాస్ తో విరుచుకపడ్డ పోలీసులు

గుజరాత్ లోని సూరత్ లో సోమవారం మధ్యాహ్నం పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సంఘటన సూరత్ శివార్లలోని వారెలి సమీపంలో జరిగింది. వలస‌ కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి పంపమని డిమాండ్ చేయడంతో గొడవ చెలరేగింది.

బిల్డర్లతో మీటింగ్ తర్వాత వలస కార్మికుల రైళ్లను రద్దు చేసిన కర్నాటక సీఎం !

కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప రాష్ట్రంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సమావేశమైన కొంత సేపటికే వలస కార్మికులను తమ సొంత పట్టణానికి తీసుకెళ్లే రైళ్లన్నింటినీ రద్దు చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో తిరగబడ్డ వలస కూలీలు... పోలీసులపై దాడి, పోలీసుల లాఠీచార్జ్

మే 4వ తేదీ నుండి వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను వారి వారి స్వంత గ్రామాలకు పంపిస్తామని ప్రకటించిన కేంద్రం యూటర్న్ తీసుకోవడం వలస కూలీల గుండెల్లో మరింత మంటను రాజేసింది.

ఆకలితో రోడ్డెక్కిన వలస కార్మికులపై లాఠీచార్జ్....వేయి మందిపై కేసులు...కార్మిక నాయకుడి అరెస్ట్ !

వాళ్ళు దేశంలోని ఎక్కడేక్కడినుండో ము‍ంబై వచ్చి రోజూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కడుపు నింపుకునే వలస కార్మికులు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హైదరాబాద్