లాక్ డౌన్ ను అవకాశంగా తీసుకుంటున్న కులోన్మాదులు ...4రోజుల్లో నలుగురు దళితుల హత్య‌!

లాక్

"తమిళనాడును అత్యాచారాల రాష్ట్రంగా ప్రకటించాలి. ఇక్కడ వున్నట్లుగా కుల సమస్య మరే రాష్ట్రంలోనూ లేదు" అని మదురైకి చెందిన ఎన్జీఓ ʹఎవిడెన్స్ʹ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ కదిర్ ఆవేదన.
కరోనావైరస్ గత్తర సమయంలో కుల ఆధారిత హింస తమిళనాడులో కొత్త స్థాయికి ఎదిగిందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ʹఎవిడెన్స్ʹ చేసిన అధ్యయనంప్రకారం మార్చి 25 న దేశవ్యాప్తంగా మొదటి లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి, రాష్ట్రంలో కనీసం 30 కుల ఆధారిత పెద్ద హింసాత్మక సంఘటనలు జరిగాయి. అనేక చోట్ల కొన్ని అగ్రకుల వర్గాలు లాక్‌డౌన్‌ను దళితులపై దాడి చేయడానికి అవకాశంగా ఉపయోగిస్తున్నాయని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
"చాలా సంఘటనలలో, 40-50 మంది గుంపుగా వచ్చి దాడి చేస్తున్నారు. లాక్డౌన్లో ఇది ఎలా సాధ్యమవుతుంది?" అని కదిర్ ప్రశ్నిస్తున్నారు. "గత నాలుగు రోజులలో, నలుగురు దళితులు హత్య చేయబడ్డారు. పరువు హత్యలు, మూక దాడులు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులు అన్నీ జరిగాయి. సమాజంలో గృహ హింస మాత్రమే కాదు కుల ఆధారిత హింస కూడా పెరిగింది. లాక్డౌన్ కారణంగా బాధితులు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఎస్సీ / ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం, నిందితుడు బెయిల్ కోసం వెళితే, ఆ విషయాన్ని బాధితురాలికి తెలియచేయాలి. హైకోర్టు కరోనా వ్యాప్తి ప్రమాదం వల్ల నిందితులు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పడాన్ని నిందితులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుని బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. " అని డిమాండ్ చేశారు కదిర్
నేరాల తీవ్రత స్థాయి కూడా వేగంగా పెరుగుతోంది. ఒక నెలలో సగటున 100 కేసులు ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద నమోదు అవుతున్నాయి. వీటిలో సాధారణంగా దాదాపు నాలుగైదు పెద్ద నేరాలు వుంటాయి. అయితే ఈ నెలలో దాదాపు 30 సంఘటనలు తీవ్రస్థాయిలో వున్నాయి. అంటే క్రూరమైన నేరాలు వేగంగా పెరుగుతున్నాయి.
వీటిలో అరనిలోని మొరప్పంతంగల్ గ్రామంలో జరిగిన సంఘటన పరువు హత్య. ఒడ్డర కులస్థుడు ఓం సుధాకర్‌ను వన్నియార్ కులానికి చెందిన అతని ప్రేమికురాలి బంధువులు మార్చి 29న హత్య చేశారు. ఆమె తండ్రితో సహా ఇద్దరు నిందితులు అరెస్టు అయారు.
పుదుక్కో ట్టై జిల్లాలోని కరంబక్కుడిలో ఏప్రిల్ 21 న ఎంబీఏ గ్రాడ్యుయేట్ మురుగనందం అనే దళిత యువకుడు తాను ప్రేమించిన భానుప్రియను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన వెంటనే భానుప్రియ బంధువులు మురుగనందంపై దాడి చేసి ఆమెను ఎత్తుకెళ్లారు. ఎవిడెన్స్ సంస్థ భానుప్రియను విడిపించింది.
పట్టణంలో ఏప్రిల్ 24 న జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసిన సంఘటన వార్తని అందించిన రాజకీయ పార్టీ విదుతలై చిరుతైగల్ కచ్చి(విసికె)కి చెందిన టివి ఛానల్ వెలిచం రిపోర్టర్ ఆది సురేష్ మీద దాడి జరిగింది.
మే 8 న తూటికోరిన్‌లోని ఉదయకుళం గ్రామంలో అప్పు విషయమై వివాదం జరిగి దేవర్ వర్గానికి చెందిన ఒక గుంపు ఏ. పాలవేసంని, అతని అల్లుడు ఆర్, తంగరాజ్‌లను హత్యచేసింది. సేలంలో అదే రోజు, విష్ణుప్రియన్ అనే దళితుడిని అగ్రకులస్థులు హత్య చేశారు.
నగరాల నుండి గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు సంబంధించి ఈ సంఘటనలు పెరిగాయి. వీరిలో చాలా మంది అట్టడుగు కులాలకు చెందిన వారు. ముఖ్యంగా కోవిడ్ -19 ప్రధాన కేంద్రంగా వున్న కోయంబేడు నుండి తిరిగి వచ్చి క్వారెంటైన్‌లో వున్న వారు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. తిరువన్నమలై జిల్లాలోని కొన్ని గ్రామాల్లో, దళితులు కాలనీల నుంచి బయటికి రాకుండా అగ్ర కులస్థులు ముళ్ళ కంచెలను అడ్డుగా పెట్టారు.
సాధారణ వివక్షకు ఈ ఘటనలు తోడై దళితుల జీవితాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి.
దళితులు శుభ్రంగా వుండరని సామాన్లు అమ్మడానికి నిరాకరించిన సంఘటనలు నీలకొట్టైలో జరిగాయి. పారిశుద్ధ్య కార్మికులు, స్కావెంజర్లు, పనిమనుషులు మొదలైన వారు పరిశుభ్రంగా వుండరనే అభిప్రాయం తోడవడంతో కుల వివక్ష అనేక రెట్లు పెరిగింది. అందరి ఇళ్లలో బాత్‌రూమ్‌లు వుండవు. ప్రభుత్వ శౌచాలయాలు ఉపయోగించుకోగలిగే స్థితిలో వుండవు, కాబట్టి చాలామంది ఇప్పటికీ బహిరంగ ప్రదేశాలనే ఉపయోగిస్తున్నారు. వాళ్ళు వూరి బయటకు రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
"తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ మద్యం షాపులను తెరవడం వల్ల మరిన్ని కష్టాలపాలవుతున్నారు. షాపులు తెరచిన మొదటి రోజునే 175 కోట్ల రూపాయలను ఆదాయం వచ్చిందని అంటున్నారు. అందులో కనీసం 80 శాతం పేద ప్రజల ద్వారా వచ్చి వుంటుంది. కనీస తిండి కోసం కూడా లేకుండా ఇబ్బంది పడే స్థితిలో వుంటారు కాబట్టి మద్యం కొనడానికి అప్పు తీసుకుంటారు. ఈ అప్పు వివాదాల కారణంగానే తూత్తుకుడిలో ఇద్దరు దళితులు హత్యకు గురయ్యారు. ఇది ఒక విష వలయంʹ అని కదిర్ వేదనపడుతున్నారు.
కుల ఆధారిత హింసకు హెల్ప్‌ లైన్ ఏర్పాటు చేయాలని కదిర్ అభిప్రాయపడితే, వివక్షను ఆపడానికి ఏకైక మార్గం ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయడం అని తమిళనాడు అంటరానితనం నిర్మూలన ఫ్రంట్ (టిఎన్‌యుఇఎఫ్) అధ్యక్షుడు పి సంపత్, అంటున్నారు.
"ఈ గత్తర కాలంలో కూడా, కులతత్వం ఆగిపోలేదు. కార్మికులుగా ఉన్న చాలా మంది దళితులు ఇంటికి తిరిగి వస్తున్నారు, వారు చాలా కోపంగా ఉన్నారు. దురదృష్టవశాత్తు, కుల వివక్షకు నిర్దిష్ట సమయం లేదు. ఇది అన్ని సమయాల్లోనూ ఉంటుంది. భారతదేశంలో కుల ఆధారిత వివక్షక వ్యతిరేక చట్టాలకు కొరత లేదు. కేసు పెట్టడానికి అనేక సెక్షన్లు ఉన్నాయి. ఇతర దేశాల్లో కుల సమస్య లేదు, కానీ అక్కడ వున్న జాత్యహంకారంతో పోరాడటానికి భారతదేశంలో వున్నన్ని చట్టాలు లేవు. అయితే ఇక్కడి ప్రభుత్వం వున్న చట్టాలను అమలు చేయాల్సి వున్నది. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులను సమాజంలో ప్రభుత్వం కల్పించాలి. దాడి చేసేవారిని రాష్ట్ర గూండా చట్టం క్రింద అరెస్టు చేయాలి" అని కదిర్ అభిప్రాయపడుతున్నారు.

"ప్రపంచం లాక్డౌన్లో ఉంది, కాని కులతత్వం లాక్డౌన్‌లో లేదు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. వైద్యులపై దాడి చేసే వ్యక్తులమీద జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేస్తామని అంటున్నారు. మరి దళితులపై దాడి చేసిన వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? వారు గుంపులుగా వచ్చి ఎలా దాడి చేస్తున్నారు. కరోనావైరస్‌తో చచ్చినా ఫరవాలేదు కానీ కులాన్ని మాత్రం వదలరు. కరోనా వైరస్ సమాజాన్ని తనిఖీ చేస్తోంది. కొంతమందిలో వున్న కుటిలత్వాన్ని బయటకు తీస్తోంది. క‌రోనావైరస్ కంటే కులం చాలా ప్రమాదకరమైనది.ʹʹ అంటున్నాడు కదిర్

Keywords : tamilanadu, dalits, murder, uppercast, lockdown,
(2024-04-19 22:16:24)



No. of visitors : 2124

Suggested Posts


కరోనా కన్నా కులమే ప్రమాదకర‌ వైరస్...పా రంజిత్

కరోనా మహమ్మారి సమయంలో కూడా దళితులను హత్య చేయడం వారిపై దాడులు, హింస పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ దేశంలో కరోనా కన్నా కులం ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు.

ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !

చోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు.

వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌

నిలబడ్డవాళ్ళ కాళ్ళపై పడి మొక్కుతున్న ఆ వృద్దును పేరు కాశీ. వెట్టి కార్మికుడు... అంటే ప్రజాస్వామ్య భారతంలో భానిస. తమిళనాడు కాంచీపురం జిల్లా కొన్నెరకుప్పం గ్రామంలో ఓ కట్టెల మిల్లులో పదేళ్ళుగా వెట్టి చేస్తున్న భానిస. అది కూడా పదేళ్ళ కింద ఆయన చేసిన వేయి రూపాయల అప్పు కోసం...

కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన‌ వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket

A Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal

పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌

మొబైల్ షాపు న‌డుపుకునే ఇద్ద‌రు తండ్రీ కొడుకుల్ని లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో అరెస్టు చేసిన పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేశారు. త‌మిళ‌నాడు తూతుకూడి జిల్లా శ‌తాంకులంలో ఫెనిక్స్‌ (31) చిన్న మొబైల్ షాపు న‌డుపుతుంటాడు.

న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌

తంజావూర్‌ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు.

వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !

1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద

వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలు

పోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.

నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట

కేంధ్ర ప్రభుత్వం ఎంత సమర్దించుకుందామని ప్రయత్నించినా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా నిరసన గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ రెండింటిపై తమ నిరసన గళ్ళాన్ని వినిపించారు. అయితే ఇప్పుడు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


లాక్