కేరళ:లాక్‌డౌన్ సమయంలో మహిళా అడ్వకేట్ ఇంటిపై పోలీసుల దాడి, వేధింపులు

కేరళ:లాక్‌డౌన్

కేరళలోని మలప్పురం జిల్లా మనతుమంగళం(పెరింతల్మన్న,పోలీస్‌స్టేషన్ పరిధి)లో వున్న ప్రగతిశీల యువజన ఉద్యమం (పివైఎం) సభ్యురాలు, న్యాయవాది అయిన కామ్రేడ్ రెహ్మా తైపారంబిల్ ఇంటిమీద 13వ తేదీ ఉదయం 11 గంటలకు పెరింతల్మన్న డిప్యూటీ సూపరింటెండెంట్ అధ్వర్యంలో కేరళ పోలీసులు దాడి చేసి పండిక్కడ్ కేసుకు సంబంధించి UAPA క్రింద కేసు పెట్టారు (కేసు సంఖ్య 471/2016). గత ఏడాది మార్చి 6 న వైతిరి రిసార్ట్‌లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరుడైన సిపిఐ (మావోయిస్టు) పార్టీ నాయకుడు, వయనాడ్‌కు చెందిన కామ్రేడ్ సిపి జలీల్‌ను ఈకేసులో 4 వ నిందితుడిగా పేర్కొన్నారు.

పోలీసుల కథనం ప్రకారం, మంజేరి కోర్టులో న్యాయవాది అయిన రహ్మా ఇంట్లో మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు వున్నట్లు సమాచారం అందింది. 2020 మే 1 న జరిగిన మల్లాపురంలోని పాండిక్కాడ్‌లోవున్న సిపి జలీల్ పూర్వీకుల ఇంటి మీద దాడి జరిగిన 12 రోజులకి అడ్వకేట్ రహ్మా ఇంటి పైన ఈ దాడి జరిగింది. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం నాడు ఆ దాడి జరిగినప్పుడు రహ్మా కూడా ఇతర వ్యక్తులతో పాటు అక్కడ ఉన్నారు. ఆ రోజున రహ్మాతో పాటు మిగతావారి దగ్గర నుండి జప్తు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్‌లను ఇప్పటివరకు తిరిగి యివ్వలేదు.
రహ్మా అరెస్టును నిరసిస్తూ పివైఎం ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిరసన తెలియచేస్తున్న న్యాయవాదులు, విద్యార్థులు, మేధావులు తదితరులపై NIA పెద్ద ఎత్తున జరుపుతున్నఅణిచివేతలో భాగంగానే న్యాయవాది రహ్మాఇంటిపై ఈ దాడి జరిగింది. కేరళ పోలీసుల సహాయంతో NIA అధికారులు సిపి జలీల్ ఇంటిపై దాడులు జరిపారనీ, ఇలా కేసు వున్నదనే విషయం తమకు అప్పుడే తెలియచేసారని పివైఎం రాష్ట్ర కార్యదర్శి సిపి నహాస్ చెప్పారు.

కేసు నమోదు అయిన 4 సంవత్సరాల తరువాత ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? కేసు వివరాలను పోలీసులు ఎందుకని వెల్లడించడం లేదు? ఈ కేసులో నిందితులుగా పేర్కొనని రహ్మాతో సహా యితరుల ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? 2020 ఏప్రిల్ 24నాడు అనుమతి తీసుకున్న పోలీసులు 7 రోజుల వరకు ఎందుకని దాడి చేయలేదు? NIA పంతీరన్‌కావు కేసుకు సంబంధించి కోజికోడ్‌లో దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసులు పాండిక్కడ్‌లో కూడా ఎందుకని దాడి చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. NIA కోసం కేరళ పోలీసులు దాడులు చేస్తున్నారన్న సిపి జలీల్ కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని ఇవి మరింతగా బలపరుస్తాయి.

లాక్డౌన్ సందర్భాన్ని ఉపయోగించుకుని కార్యకర్తలను అణిచివేయడానికి NIAకు, కేరళ పోలీసులకు సిపిఎం(మార్క్సిస్ట్) నేతృత్వంలోని కేరళ లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఒక వైపు కేరళ ప్రభుత్వమూ, సిపిఐ (ఎం) పార్టీ యుఎపిఎ ప్రయోగించడానికి నిరసనతెలియచేయడం, ఆనంద్ టెల్టుంబే, గౌతమ్ నవ్లఖా, ఇతర భీమా కొరేగావ్ కేసు నిందితులను, ఎన్ఆర్సి- సిఎఎ వ్యతిరేక నిరసనకారులను బిజెపి ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఖండిస్తూనే, మరో వైపు తాము అధికారంలో వున్న రాష్ట్రంలోనే UAPA క్రింద యువకులను జైలు పాలు చేస్తున్నాయి. ఈ ద్వంద్వ వైఖరి వారి కపటత్వాన్ని, రివిజనిజాన్నీ తెలియచేస్తోంది. కేరళలో ఇటీవల జరిగిన ఈ దాడులతో బిజెపి, సిపిఐ (ఎం) రెండూ కూడా రాజకీయ భిన్నాభిప్రాయం కలిగివున్నవారి పట్ల ఒకే పడవలో కలిసి ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
పాండిక్కడ్ యుఎపిఎ కేసుతో ఏ సంబంధం లేని కామ్రేడ్ రహ్మాకు తన ఇంటిపై దాడి ఎందుకు జరిగిందనేది ఇప్పటికీ తెలియదు. దాడి సమయంలో పోలీసులు తన కుటుంబాన్ని భయభ్రాంతులను చేశారని తమ కుటుంబ శాంతిని పూర్తిగా భగ్నం చేశారనీ ఆమె ఆరోపించారు. గంటన్నర పాటు సాగిన దాడిలో అక్రమ క్వారీల కార్యకలాపాలను, పర్యావరణ విధ్వంసం, వరి పంట పొలాలను నాశనం చేయడాన్ని నిరసిస్తూ జరిపిన ఒక బహిరంగ కార్యక్రమానికి సంబంధించి ముద్రించిన ఒక కరపత్రాన్ని మాత్రమే స్వాధీనం చేసుకొన్నారు. మాజీ నక్సలైట్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త ఎ. వాసు రాసిన ʹ5 లెఖంగల్ʹ (5 వ్యాసాలు) అనే పుస్తకాన్ని కూడా పోలీసులు తీసుకెళ్లారు.

ఫోన్లో ఒక సీనియర్ అధికారితో చర్చించిన తరువాత తనను అదుపులోకి తీసుకునే ఆలోచనను విరమించుకున్నారని రహ్మా చెప్పారు. పోలీసులు మాస్కులు వేసుకుని, శానిటైజర్లు వెంట వుంచుకున్నప్పటికీ, చాలా మంది ప్రజలు తన ఇంటి ముందు గుమికూడటం వల్ల భౌతిక దూరాన్ని పాటించాలనే నియమ ఉల్లంఘన జరిగింది. పోలీస్ యూనిఫాంలోనూ, సాధారణ దుస్తుల్లోనూ వున్న 10 మంది అధికారులే కాక 5 మంది సాక్షులను కూడా ఇంటి లోపలికి తీసుకువచ్చారు. పోలీసులు వెళ్లిపోయిన తరువాత యిరుగు పొరుగువారు తన కుటుంబాన్ని వేరు చేశారనీ, తమ గురించి చెడుగా మాట్లాడటం మొదలుపెట్టారనీ ఆమె అన్నారు.
కోవిడ్ 19 సమయంలో సామాజిక దూరాన్ని పాటించమని పౌరులకు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన వేధింపులు, దాడులలాంటి అణచివేత సాధనంతో భిన్నాభిప్రాయాలను కలిగినవారిని సమాజం నుండి వేరు చేస్తూ సామాజిక దూరాన్ని అమలు చేస్తోంది. అడ్వకేట్ రహ్మా, జర్నలిస్ట్‌ అభిలాష్‌ పడాచేరి, పారెలల్ కళాశాల లెక్చరర్లు విజిత్‌ విజయన్‌, ఎల్డోస్‌, సామాజిక కార్యకర్తలు సిపి జిషాద్‌, సిపి రషీద్‌ల ఇళ్లపై దాడులకూ, భీమా కొరేగావ్ కేసుకూ చాలా పోలికలు కనబడుతున్నాయి.

నిషేధానికి గురికాని పుస్తకాలు, ప్రభుత్వము, ఫాసిజాల అమానుష విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య నిరసనలకు ఉపయోగించే పోస్టర్లు, కరపత్రాలు మొదలైనవి మాత్రమే కేరళ పోలీసులకు, ఎన్ఐఏకు లభించిన ఏకైక సాక్ష్యం. కోజికోడ్‌లో శబరిమల అల్లర్ల సందర్భంగా మసీదులను నాశనం చేస్తామని, ముస్లింలను చంపేస్తామని బెదిరిస్తూ కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాలు పట్టుకు తిరిగిన సంఘ్ పరివార్ ఫాసిస్టులను జైలుకు పంపడానికి బదులు కేరళ ప్రభుత్వం పేదలకోసం, న్యాయం కోసం మాట్లాడుతున్న కలాలు, పుస్తకాలు, కరపత్రాలను పట్టుకున్నవారిని జైలుకు పంపుతోంది.
కోర్టులు పనిచేయని, ప్రదర్శనలు, నిరసనలపై పూర్తి పరిమితులు విధించిన లాక్డౌన్ సమయంలో ఈ దాడులు జరగడం అనుమానాస్పదంగా వున్నది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ వీధుల్లో ఎలాంటి ప్రతిఘటన లేదా నిరసన తెలియచేయడానికి వీల్లేని ఈ సమయంలో దాడులు నిర్వహించడానికి రాజ్యం పోలీసులకు అనుమతినిస్తుంది. సంఘ్ పరివార్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాగే జరగడాన్ని మనం చూస్తున్నాం. ఎన్ఆర్సి – సిఎఎలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శిస్తున్నవారి మీద, మావోయిస్టులనే వివిధ ఆరోపణలతో మేధావులమీద సంఘ్ పరివార్ పోలీసులు నిరంతర దాడులు, అరెస్టులు చేస్తున్నారు. ఈ సంఘటనలు సంఘ్ పరివార్‌ను, సిపిఐ (ఎం)లు రెండింటినీ ఒకే తాటి మీద నిలబెడతాయి.
కేరళ పోలీసులు NIAకు సహాయం చేయడాన్ని గమనిస్తే UAPA గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకే ఆలోచనను, అభిప్రాయాన్ని కలిగివున్నాయని తెలుస్తుంది. ఇటీవల కేరళలో సిపిఐ(ఎం) జరిపిన మావోయిస్టుల చట్ట వ్యతిరేక హత్యలకు ఆర్ఎస్ఎస్, బిజెపి మాత్రమే మద్దతునిచ్చాయి.

లాక్డౌన్ సమయంలో పోలీసులను అభినందించి, మద్దతు ఇవ్వా;లని ప్రభుత్వం ప్రజలను కోరింది. కానీ, అత్యసవర సేవల కోసమూ, డయాలసిస్ చికిత్స కోసమూ వెళ్ళే పేద ప్రజలపై దాడి చేస్తున్న, వృద్ధులను గుంజీలు తీయమని బలవంతం చేస్తున్న, వలస కార్మికుల మీద లాఠీ ఛార్జీలు చేస్తున్న, లాక్డౌన్ సమయంలో దాడులు చేస్తున్న /అవసరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులను పేద ప్రజలు ఎలా సమర్థించగలరు?.

మనమందరం కోవిడ్ 19తోపాటు ప్రభుత్వ పోలీసు రాజ్యాన్ని కూడా ఎదుర్కొంటూ మనుగడ సాగించాల్సిన దశలో ఉన్నాము. వైద్యులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులతో కూడిన అర్బన్ మావోయిస్టుల జాబితాను NIA, కేరళ పోలీసులు కలిసి తయారు చేసినట్లు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు చెబుతున్నాయి. పోలీసుల తర్కం ప్రకారం యుఎపిఎ కేసుల నిందితులతో మాట్లాడిన వారు కూడా మావోయిస్టు పార్టీ సభ్యులే. మే 1 నాడు జర్నలిస్ట్ అభిలాష్ పడచేరి ఇంటిపై దాడి చేసి విచారణ జరిపిన ఎన్‌ఐఏ పోలీసులు జైలులో వున్న అలాన్ - తహాలను ఎందుకు కలిసావని అడిగారు.
న్యాయవాది తుషార్ (జనకీయ మనుష్యవాక ప్రస్థానం)తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో, ఒక న్యాయవాది యుఎపిఎ నిందితుల కేసులను చేబడితే కనక ఆ న్యాయవాది కూడా రాజ్య నిఘాలో ఉంటాడు అని రాశారు. రాజ్యం పెట్టే ఈ నిఘా భిన్నాభిప్రాయం కలిగిన, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన కేసులను తీసుకోకూడదని న్యాయవాదులను పరోక్షంగా బెదిరిస్తుంది. దీనివల్ల నిందితులకు న్యాయం, న్యాయమైన విచారణ లభించదు. ఒక మావోయిస్టును విచారణ లేకుండా కాల్చి చంపితే, అలా చేయడం చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమని అంటే, అలా అనడమే చట్టవిరుద్ధమని ప్రభుత్వం అంటుంది. న్యాయవాదులు, మానవ హక్కుల, సామాజిక కార్యకర్తలు చాలా మంది ఉగ్రవాదులనే ఆరోపణలతో జైలులో ఉన్నారు. ఇదంతా మొత్తం సమాజాన్ని నిశ్శబ్దం చేయడానికి అమలుచేస్తున్న ఒక ప్రణాళికాబద్ధమైన చర్య.
ఈ సంఘటనలు కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో కేరళ ముఖ్యమంత్రి, హీంశాఖా మంత్రి అయిన పినరయి విజయన్‌కు వున్న పోలికను తెలియచేస్తాయి. దురదృష్టవశాత్తు కేరళ ప్రభుత్వం సంఘ్ పరివార్ స్థాయికి దిగజారింది. కేరళ ప్రభుత్వం కూడా పోలీస్ రాజ్యంగా నెంబర్ 1 స్థానాన్ని సంపాదించడం కోసం సంఘ్ పరివార్ రాష్ట్రాలతో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

Keywords : kerala, cpm, bjp, police, arrests, maoists, UAPA
(2024-04-03 19:19:17)



No. of visitors : 714

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

దళిత నటి విషాద గాథ‌ !

అప్పుడే రెండో ఆట చూడడానికి.. తనను తాను తెర పై చూసు కోడానికి వచ్చిన రోజీపై దాడి చేశారు. భయంతో పరుగులు తీసి రోజీ ఒక పూరి గుడిసెలో ఆశ్రయం పొందింది. ఆమె ధైర్యం తమ కులాధిపత్యానికి చేటు కలిగిస్తుందనే మూర్ఖులు... ఆమెని వెంబడించి ఆ ఇంటిని దహనం చేశారు. ఇంటివాళ్ళు ప్రాణభయం తో పారిపోయారు

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కేరళ:లాక్‌డౌన్