విశాఖ‌ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు

విశాఖ‌

12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు..ఆమెకు సహకరించాడనే ఆరోపణలపై మల్లాడి రఘునాథ్ కు కూడా నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన్ను కలిసి నోటీసులు అందించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఎ కింద ఇప్పుడు రఘునాథ్‌కు సీఐడీ నోటీస్ ఇచ్చింది. కుట్రపూరితంగానే సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నోటీసుల నేపథ్యంలో త్వరలో రఘునాథ్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన విచారణలో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకున్న అధికారులు తమకు అందిన ఫిర్యాదుల మేరకు కొందరిపై చర్యలకు సిద్ధమయ్యారు.

LG పాలిమర్స్‌ ప్రమాదంపై ఫేస్‌బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్ పెట్టారంటూ గుంటూరు లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రంగనాయకమ్మకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. IPC సెక్షన్లు 505 ఆఫ్‌ టు, 153 (ఎ), 188, 120-బి రెడ్‌విత్ 34…ఐటీ చట్టం 67 ప్రకారం కేసులు నమోదు చేశారు. సోషల్ ‌మీడియాలో వైరల్‌ అయిన పోస్టులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత.. వాటిని రంగనాయకమ్మే పోస్ట్ చేసినట్లు గుర్తించామని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఆమెకు CRPC సెక్షన్ 41-A ప్రకారం నోటీసులు అందజేశారు. రంగనాయకమ్మకు సహకరించారనే ఆరోపణలతో మల్లాది రఘునాథ్‌ గురించి కూడా దర్యాప్తు చేపట్టి నిన్న ఆయనకు కూడా నోటీసులు అందించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం కేసులో రంగనాయకమ్మ ఏ1 కాగా రఘునాథ్ ఏ2 అని సీఐడీ పేర్కొంది. ఈ కేసులో నేరం రుజువైతే మొదటిసారి 3 ఏళ్ల జైలు, 5 లక్షల జరిమానా విధిస్తారు. అదే నేరాన్ని మరోసారి చేస్తే ఐదేళ్ల జైలు.. 10 లక్షల జరిమానా ఉంటుందని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఈ రోజు రంగనాయకమ్మను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.

ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది చనిపోయారు. 5 గ్రామాల్లోని 15 వేల మంది ప్రజలు మృత్యువుతో సహజీవనం చేస్తున్నట్లు భయపడాల్సిన దుస్థితి. 15 వేల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎల్జీ పాలిమర్స్ పై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం 12 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి కూడా నామమాత్రపు కేసులతో చేతులు దులిపేసుకున్నారు. కానీ, అదే ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ను సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం పగ సాధిస్తోందంటూ ప్రతిపక్షాలు, మానవహక్కుల వేదిక, ఐద్వా మండిపడ్డాయి. ఇది దుర్మార్గమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో దుర్ఘటనపై 20 ప్రశ్నలను ఫేస్బుక్ రంగనాయకమ్మ షేర్ చేశారు. ఆ ప్రశ్నలకు బదులివ్వలేని ప్రభుత్వం..తమపై దుష్ఫ్రచారం చేస్తున్నారంటూ ఓ 66 ఏళ్ల వృద్ధురాలిని కూడా పగబట్టి మరీ కేసులతో వేధిస్తోందంటూ సీపీఐ, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయకమ్మకు అండగా ఉంటామన్నారు. నియంతృత్వపు పోకడలతో ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆరోపించారు. అదేంటని తప్పులను ప్రశ్నిస్తే..వాటిని సరిదిద్దుకోవటం మానేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఫైర్ అయ్యారు.

ఆమె లేవనెత్తిన కీలకాంశాలు

1: ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు
2: కంపెనీ సీజ్ చేయలేదు.
3: చాలా తెలివిగా కంపెనీ లిక్విడ్ ఎస్సెట్ అయిన స్టెరీన్ ను వెనక్కు తరలించారు
4:పోలీసు బాస్ పర్యటన పేరుతో లోపల ఉద్యోగుల హాజరును ఏమార్చారు.
5:క్లూస్ టీం వచ్చి వేలి ముద్రలు సేకరించే అవకాశం లేకుండా చేశారు.
6: స్టెరీన్ ఎవరి పేరు మీద కొనుగోలు చేశారు అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే దానిని వేగంగా దేశం దాటించారు.
7: స్టెరీన్ లో మిక్సింగ్ చేయటానికి తెచ్చిన కెమికల్ మాయం చేశారు
8: అసలు కంపెనీని యల్ జి. పాలిమర్ నడుపుతున్న దా లేక వేరే కంపెనీకి ఉత్పత్తి చేసేందుకు కాంట్రాక్టు ఇచ్చారా?
9: ఇప్పుడు వెనక్కు పంపుతున్న వందల కోట్ల ఖరీదైన లిక్విడ్ స్టెరీన్ కొనుగోలుకు ఏ బాంకు ఋణం తీసుకున్నారు.
10: ఆ బాంకు ఇంత వరకు కంపెనీకి ఎందుకు షో కాజ్ నోటీసులు ఇవ్వలేదు. రేపు కంపెనీ తరలి పోయాక మాకు బాకీ ఉందని ప్రకటించినట్లయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు.
11: కంపెనీ తరలి పోతుందని ప్రభుత్వం ప్రకటించటం వెనక రహస్యం ఏమిటి?అది చేయవలసినది కంపెనీ యాజమాన్యం కదా?
12:ఒక మల్టీనేషనల్ కంపెనీ తన సంస్ధను ఎత్తి వేస్తున్నట్లు ముందుగా కేంద్రానికి కదా తెలియ చెయ వలసినది. రాష్ట్రానికెందుకు అంత తొందర.
13: ఇప్పుడు ఈ స్ధాయిలో ఆధారాలు ధ్వంసం చేశాక యు. యన్ ఓ . కానీ సు. కో. గానీ హై. కో. గానీ ఏమి పరిశోధించి నిజాలు నిగ్గు తేల్చగలరు.
14:హై. కో. నిజంగా విచారణ చేయాలనుకుంటే వెంటనే సి. బి. ఐ. విచారణ కు ఆదేశించి ఉండేది. అలా చేయకుండా తాత్సారం జరిగింది అంటే ఏమిటి అర్ధం.
15: గతంలో ఎప్పుడూ బాధితులను గుర్తించి ఇంత వేగంగా పరిహారం చెక్కులు ఇవ్వలేదు.
16:ఇంత వ్యూహాత్మకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతుంటే ఏ రాజ్యాంగ బద్ద సంస్ధలూ కోర్టు లూ ఏమీ చేయలేవు.
17: గంటల వ్యవధిలో కేంద్రం స్టెరీన్ ను తరలించేందుకు నౌకలను సమకూర్చటము కూడా ఈ కుట్రలో భాగమే. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితులలో ఒక దేశం నుంచి మరో దేశానికి అసలు సరకు రవాణా యే లేదు. మరి వీళ్ళకెలా అనుమతి లభించింది.
18: వారం రోజులు కావస్తున్నా కనీసం కంపెనీ ప్రతినిధులు బయట నిర్భయంగా తిరగ గలగటమూ బాధితులు అరెస్టు కాబడటమూ ఈ దేశంలో ఇదే మొదటిసారి.
19: సంఘటనానంతరం కంపెనీ ని సందర్శించిన పోలీసు అధికారి అరెస్టు లు మా పని కాదు అని ప్రకటించటం దేనిని సూచిస్తుంది
20: ఆ అయిదు గ్రామాలప్రజలు ఇక ఆశ ఒదిలేసుకోవటమే మిగిలింది.
ఇక ఈ రాష్ట్రంలో బాధితులకు న్యాయం జరగటం అనేది ఎక్కడా ఏ సందర్భంలో నూ సాధ్యం కాదు.

Keywords : ranganayakamma, ys jagan, andhrapradesh, cid, case,
(2024-04-22 08:31:23)



No. of visitors : 1271

Suggested Posts


లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా రేపు ఏపీ బంద్ - మావోయిస్టు నేత గణేష్ పిలుపు

విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా సిపిఐ (మావోయిస్ట్) ఆగస్టు 10 న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు,సమాజంలోని అన్ని వర్గాల

తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?

ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో

మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్‌ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు.

గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట‌...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట‌ !

గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు.

నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...

సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే

డేటా చౌర్యంలో దోషులెవరు ?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్‌ (6) ద్వారా ఎన్నికల నోటిఫికేషన్‌ (మార్చ్‌ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది.

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు

ఉద్యోగులను నిట్టనిలువునా ముంచివేసే మోసపూరిత పీఆర్సీ ఫిట్ మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు,జాబ్ క్యాలండర్ కోసం నిరుద్యోగులు, జీతాల పెంపు, రెగ్యులరైజేషన్ కోసం సచివాలయ ఉద్యోగులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని సెక్షన్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ఏఓబీ ఎస్ జడ్ సీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది

రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌

ప్రమాద వశాత్తు మరణించిన మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ ఎలియాస్ రవి, ఎలియాస్ జైలాల్ సంస్మరణ సభ ఆదివారం నాడు జరగనుంది. ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం

రాజును మించిన రాజభక్తి: మోడీ పై భక్తి ని నిరూపించుకోవడానికి జగన్ తహ తహ‌

కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. దేశంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, అత్యవసరమైన ఆక్సీజన్ లేదు. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లో లక్షరూపాయల దాకా పలుకుతోంది.

Andhrapradesh:తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం దశాబ్దాల‌ పోరాటం

న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్‌ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


విశాఖ‌