include 'men';
?>
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
ప్రజల హక్కులను పరిరక్షించడంలో సుప్రీంకోర్టు తన పాత్రను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ ఖట్జూ అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తుత పనితీరుకు సంబంధించి ఆయన ʹది వైర్ʹ ఆన్లైన్ వైబ్సైట్లో ఒక వ్యాసం ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. సుప్రీంకోర్టు తన ప్రధాన విధి అయిన రాజ్యాంగాన్ని కాపాడడం, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని మానుకుందని భారత్లోని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని తాను సుప్రీంకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తితో కూడా ఫోన్ ద్వారా పంచుకున్నానని తెలిపారు. అనేక సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేసినప్పటికీ, తాను ఇప్పుడు జడ్జిని కాదని, ప్రజల్లో ఒకరినని అన్నారు. తాను ప్రజల తరపున ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నానే తప్ప మాజీ జడ్జిగా కాదని వెల్లడించారు. రాజకీయ, అధికార పెత్తనం, ఏకపక్ష వైఖరి, చట్టఉల్లంఘనలకు వ్యతిరేకంగా పౌరుల హక్కులను కాపాడుతూ రాజ్యాంగ విధిని సుప్రీంకోర్టు నిర్వర్తించడం లేదన్నది ప్రజల అభిప్రాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు సుప్రీంకోర్టు పూర్తిగా లంగిపోయినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
లాక్డౌన్ ముగిసిన తర్వాత సుప్రీంకోర్టుకు చెందని న్యాయమూర్తులందరితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తాను ఫోన్ ద్వారా మాట్లాడిన జడ్జిని అడిగానని చెప్పారు. ఆ సమావేశంలో తన అభిప్రాయాలను పంచుకుంటానని పేర్కొనగా, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. ప్రజల హక్కులను కాపాడడంలో సుప్రీంకోర్టు విఫలమైందని పేర్కొంటూ పలు ఘటనలను ప్రస్తావిస్తూ తాను గతంలోనే పలుమార్లు లేఖలు రాశానని అన్నారు. ఈ నేపథ్యంలో వాటిని మరలా ప్రస్తావించదలచుకోలేదని తెలిపారు. హక్కులకు రక్షణగా ఉండకపోతే అవి కేవలం కాగితాలపై రాతలలాగే మారిపోతాయని ఖట్జూ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజలకు ఉంటుందని, ఈ విషయాన్ని గతంలో రమేష్ థాపర్ వర్సెస్ మద్రాస్ స్టేట్ కేసులో సుప్రీంకోర్టే స్పష్టం చేసిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి భయపడకుండా ఒక వ్యక్తి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉండడం చాలా ప్రధామని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చారని అన్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు, పలువురు న్యాయమూర్తులు తన తీర్పుల ద్వారా వెల్లడించారని చెప్పారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలను సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు సుమోటాగా స్వీకరించాలని, అందుకు కారకులైన ప్రభుత్వం, సంబంధిత అధికారులపై గట్టి చర్యలకు ఆదేశించాల్సిన అవసరం ఉందని ఖట్జూ అభిప్రాయపడ్డారు.
Keywords : markandey khatju, supreme court
(2024-03-16 05:24:02)
No. of visitors : 758
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..