మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ
విప్లవ కవి వరవరరావు ను ఉంచిన మహారాష్ట్రలోని తలోజా జైల్లో కరోనా తీవ్రంగా వ్యాపించిందని వార్తలు వస్తున్న, ఆ వ్యాధితో ఒకరు మరణించారని ప్రభుత్వమే ప్రకటించిన నేపథ్యంలో 80 ఏళ్ళ వృద్దుడైన వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంభం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆయనకు తీవ్ర సమస్యలున్నాయని, దానితో పాటు ఈ కరోనా వ్యాపించడం మరింత ఆందోళన కలిగిస్తోందని, కాబట్టి ఆయనను తక్షణం విడుదల చేయాలని కోరుతూ వరవరరావు ముగ్గురు కూతుర్లు మహారాష్ట్ర గవర్నర్ కు, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం....
సర్,
మా తండ్రి, ప్రముఖ విప్లవ కవి వరవరరావుపై తప్పుడు అభియోగాలతో మోపిన ఒక కేసులో మహారాష్ట్ర జైళ్ళలో (2020 ఫిబ్రవరి వరకు పూణేలోని ఎరవాడ జైలులోనూ, దరిమిలా నవీ ముంబైలోని తలోజా జైలులోనూ) ఖైదీగా ఉన్నారు. కొవిడ్ -19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడన్న వార్త (ముంబై హైకోర్టులో సోమవారంనాడు ఒక ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించింది) మమ్ములను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
మా నాన్నగారి వయస్సు 80 సంవత్సరాలు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్యం దుర్బలంగా ఉన్నందున ఆయనకు కరోనా వైరస్ సోకే ప్రమాదమున్నది. ఎనిమిది వారాల క్రితం లాక్డౌన్ అమలులోకి వచ్చిన తరువాత జైలులో మా తండ్రిని సందర్శించేందుకు మాకు అనుమతి లభించలేదు. సాధారణ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి కూడా అనుమతినివ్వలేదు. ఆయన్ని సందర్శించేందుకు న్యాయవాదులను సైతం అనుమతించడం లేదు. ఈ ఎనిమిదివారాలుగా మా నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు మేము ఎంతో వ్యాకులతతో ఆతురపడుతున్నాము.
డెబ్బై సంవత్సరాలకు పైబడిన వయస్సులో వుండి, అనారోగ్యంతో బాధపడుతున్న మా తల్లితో మూడు సార్లు ఫోన్లో మాట్లాడేందుకు మా నాన్న గారిని అనుమతించారు. ఆయన మా అమ్మతో కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఫోన్లో మాట్లాడేందుకు అనుమతించారు. మా నాన్నగారు ఇప్పుడు విచారణలో ఉన్న ఖైదీ మాత్రమే. గత 47 సంవత్సరాలలో మా తండ్రిపై మోపిన 25 కేసులలోనూ ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 21 విచారణలో ఉన్న ఖైదీలకు జీవించే హక్కు కల్పిం చింది. రాజ్యాంగం ప్రకారం ఆయనకు గల ఈ హక్కుకు ఇప్పుడు ప్రమాదం వాటిల్ల కూడదు.
తలోజా జైలులో ఖైదీ మరణం గురించి, కొవిడ్ -19 వ్యాప్తి గురించి వార్తా పత్రికల్లో చదివాము. తలోజా జైలు అధికారులను కలిసి మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబ్ చేయాలని మా న్యాయవాది పద్మను అడిగాము. ఆమె ఈ విషయమై తలోజా జైలు అధికారులకు ఫోన్ చేయగా, ఫోన్ కాల్ను రిసీవ్ చేసుకున్నారుగానీ, న్యాయవాది ప్రశ్నలకు ప్రతిస్పందించలేదు. మా తండ్రి శ్రేయస్సు గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నాము. ఆయన ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ఆతురపడుతున్నాము. ఆందోళన, వ్యాకులత, నిస్సహాయత్వం కలగలిసిన ఈ తీవ్ర దుష్కర పరిస్థితులలో మా నాన్నగారి నిర్బంధ వ్యవహారాన్ని పరిశీలించి, ఈ క్రింద పేర్కొన్న వాటిపై తగుచర్యలకు చొరవ తీసుకోవాలని మిమ్మలను అభ్యర్థిస్తున్నాము.
(1) వయస్సు, ఆరోగ్యం, కొవిడ్- 19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వరవరరావును తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్పై విడుదల చేయాలి;
(2) వరవరరావు భద్రంగా, ఆరోగ్యంగా ఉన్నారని స్వయంగా నిర్ధారించుకుని, భరోసా పొందేందుకై ఆయన్ని జైలులో సందర్శించేందుకు కుటుంబ సభ్యులకు అనుమతినివ్వాలి;
(3) కుటుంబ సభ్యులకు తరచు ఫోన్ చేసేందుకు, ఉత్తరాలు రాసేందుకు ఆయనకు అనుమతినివ్వాలి;
(4) జైలులో మా నాన్నగారితో సమావేశమయ్యేందుకు న్యాయవాదులను అనుమతించాలి.
ధన్యవాదాలు.
పి. సహజ, పి. అనల, పి. పవన
Keywords : varavararao,taloja, maharashtra, daughters, letter
(2024-02-19 22:59:50)
No. of visitors : 1122
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |