వీవీ,సాయిబాబాల జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
గత మూడు రోజులుగా వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా ల ఆరోగ్యాలపై ఆందోళనలు నెలకొనిఉన్నాయ్. 28 మే 2020 నాడు బాంబేలోని జే.జే హాస్పిటల్ లో వరవరరావు గారిని అడ్మిట్ చేసినారని, 29 మే,2020 రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాదులోని చిక్కడపల్లి పోలీసులు ,వరవరరావు కుటుంబ సభ్యులకు కేవలం వరవరరావు అనారోగ్యం గురించి సమాచారం మాత్రమే ఇచ్చినారు. రాత్రి 10- 11 గంటల ప్రాంతంలో తెలంగాణ పోలీసులు ప్రత్యేక పాసులు ఇఛ్చి వరవరరావు బంధువులను బాంబే పంపించే ప్రయత్నం చేసినట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది.అది కార్యరూపం దాల్చలేదని స్పష్టమయింది. ఏది ఏమైనప్పటికీ వరవర రావు గారి వయసు 81 సంవత్సరాలు దాటినందున,వరవరరావు కు ఉన్న పైల్స్ వ్యాధి, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ఎడీమా హైపర్ టెన్షన్, అసిడిటి, సైనస్/ మైగ్రేన్ లలో ఏ సమస్య తీవ్రంగా మారి ప్రస్తుత ఆందోళన కర పరిస్థితి కల్పించిందో లేదా ఏ కొత్త సమస్య తలెత్తిందో, వైద్య బృందం చేత సమగ్ర పరీక్ష జరిపించి చికిత్స చేయించాలి కేంద్ర, తెలంగాణ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున వరవరరావు ను వెంటనే విడుదల చేసి హైదరాబాద్ కు పంపించాలని, న్యాయ స్థానం ద్వారా అతనికి రక్త సంబంధీకుల తో కలిసి ఉండేటట్లు అవకాశం కలిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని,తెలంగాణ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. భీమా కోరేగావ్ కుట్రకేసులోని అనుమానితులందరూ సుమారు 60 ఏండ్ల వయసు పైబడిన వారే. ఈ కుట్ర కేసులో అరెస్ట్ కాబడిన మేధావులందరి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరియు NI A లు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి కరోనా విస్తరిస్తున్నందున అందరికీ బెయిల్ మంజూరు చేసి వారి జీవించే హక్కును కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
కరోనా వైరస్ నేపథ్యంలో మహారాష్ట్రలోని జైళ్ల లో కోవిడ్ మరణాలు సంభవిస్తున్న స్థితిలో రాజకీయ ఖైదీలందరిని వెంటనే బెయిలు మరియు పెరోల్ల పై విడుదల చేయాలి.ఆరోగ్యం క్షీణించినా ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావు లను వారివారి స్వంత రాష్ట్రలకు పంపించి చికిత్సకు అవకాశం కల్పించాలి. ఖైదీ లందరికి పెరోలు, బెయిల్ తప్పనిసరి చేస్తూ ఖైదీ లందరి జీవించే హక్కు కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తు చేస్తున్నాం. ప్రొఫెసర్ సాయిబాబా తల్లి క్యాన్సర్ తో చివరి దశలో ఉన్నందున ప్రొఫెసర్ సాయిబాబా కు వెంటనే పెరోలు ఇచ్చి ఇంటికి పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము . యూరోపియన్ దేశాల సబ్ కమిటీ కూడా భీమా కోరేగావ్ కుట్రకేసులోని గౌతమ్ నవలఖా, ఆనంద్ తేలుటుంబ్డేలను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేసినారు.ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా భీమా కోరే గాం కుట్రకేసులోని మేధావులందరిని విడుదల చేయల్డిందిగా ఇదివరకే భారత ప్రభుత్వాన్ని కోరింది.
ప్రొఫెసర్ సాయిబాబా తోపాటు ప్రశాంత్ రాహి,హేమ్ మిశ్రా, పాండు నరోటే,విజయ్ టిక్రి మరియు మహేష్ నరోటే లను పెరోల్ పై విడుదల చేయాలి. భీమా కోరేగాంవ్ కుట్ర కేసు అనుమానితులైన,వరవరరావు, సుధా భరద్వాజ్, షోమసేన్,సురేంద్రగాడ్లింగ్, సుధీర్ ధావ్లే,మహేష్ రావత్, అరుణ్ పేరారే,రోనావిల్సన్, వెర్నానుగొంజాల్వేస్,గౌతమ్ నవలాఖ మరియు తేలుటుంబ్డే లను వెంటనే బెయిల్ పై విడుదల చేయాలి.
దేశవ్యాప్తంగా వివిధ జైళ్ళలో అక్రమంగా నిర్బంధించడి మగ్గుతున్న రాజకీయ ఖైదీలందరిని వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము.
ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
V. రఘునాథ్ ఉపాధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
K.రవి ఉపాధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
గుంటి రవి, సహాయ కార్యదర్శి,,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
మాదన కుమారస్వామి ,సహాయ కార్యదర్శి,,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
నర్రా పురుషోత్తంరెడ్డి సహాయ కార్యదర్శి,,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
అల్గోటే రవీందర్ ,కోశాధికారి,పౌర హక్కుల సంఘం తెలంగాణ...
సాయంత్రం,5:30 గంటలు.
30 మే 2020..
హైదరాబాదు.
Keywords : varavararao, saibaba, Health, CLC, maharashtra, police, taloja jail, nagpur jail
(2024-03-15 08:59:35)
No. of visitors : 1416
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |