రాబోయేవి మరింత దుర్భర దినాలు

రాబోయేవి

" నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను " అని US మిలటరీ సలహాదారు జేమ్స్ మిల్లర్ తన రాజీనామా లో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ని ఉద్దేశించి పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద స్థలంలో ఫోటో తీసుకొని ప్రదర్శనకి పెట్టడం పై విభేదిస్తూ US ప్రధాన మిలటరీ సలహాదారు జేమ్స్ మిల్లర్ తన పదవికి రాజీనామా చేశారు.

జూన్ 1, 2020 సోమవారం నాడు వాషింగ్టన్ డి.సి. లోని సెయింట్ జాన్ చర్చి ఎదుట ప్లాయిడ్ హత్యకు నిరసనగా జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఆందోళనకారులు శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. అటువంటి వారిపై అధ్యక్షుడి ఆదేశాల మేరకు సైన్యాలు టియర్ గ్యాస్, నిప్పులు వెదజల్లే గ్రెనైడ్లు, పెల్లెట్లతో దాడిచేసి వారందర్నీ అక్కడి నుంచీ తరిమివేసి, ఆ ప్రదేశాన్ని ఖాళీచేయించారు. తదుపరి అధ్యక్షుడు ట్రంప్ చేత బైబిల్ పట్టుకొని సెయింట్ జాన్ చర్చిలోకి వచ్చి ప్రార్ధన చేసి, బయటకు వచ్చి బైబిల్ ని చేత్తో పైకెత్తి పట్టుకుని ఫోట్లోలకి ఫోజ్ లిచ్చాడు. ఆ చర్చిని అధ్యక్షుడు సందర్శించిన సమయంలో ఇంకొక మిలటరీ డిఫ్యూటీ సలహాదారు అక్కడే ఉండి ట్రంప్ అతి ప్రదర్శనని, ఆందోళనకారుల్ని అవమానించి, రెచ్చగొట్టి, హింసించి కార్యక్రమాన్ని వీక్షించి ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు.

అధ్యక్షుడు ట్రంప్ ఆ విధంగా నల్లజాతి ఆందోళనకారులు చేస్తున్న శాంతియుత ప్రదర్శనపై సైన్యంతో భీకరమైన దాడి చేయించి ఆ ప్రదేశాన్ని హింసాత్మకంగా ఖాళీ చేయించి మరీ ఆ విధంగా చర్చికి రావడాన్ని చర్చి బిషప్ రెవరెండ్ జో బిడెన్ తప్పుపట్టారు. అధ్యక్షుడు ఆ విధంగా వస్తున్నట్లు తనకు నామమాత్రంగా కూడా సమాచారం లేదని, ఆయన అలా రావడం చాలా తప్పు అన్నారు. నల్లజాతి ఆందోళనకారులపై దాడిచేయించి మరీ ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించి చర్చి ప్రార్ధనలకి రావడం అధ్యక్షుడి "జాతి వివక్ష చేసిన పాపం " అని పోప్ ప్రాన్సిస్ సైతం వ్యతిరేకించక తప్పలేదు. పోలీసుల చేతిలో ఫ్లాయిడ్ హత్య ఒక ఆల్టర్ నెస్ ను ఇచ్చే చర్య అని, ʹ మనలోని ప్రతీ ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ʹ అని పోప్ చెప్పాక తప్పని స్థితిలోకి నెట్టబడ్డాడు. బానిసల రక్తం మీదుగా, వారి శవాల కుప్పల మీదుగా నిలబడిన కేథలిక్ చర్చి కేంద్రం ఈ పాటిగా ఒక మెట్టు దిగినట్టు నటించడం కూడా.. ఫ్లాయిడ్ హత్య అనంతరం జరుగుతున్న ఆందోళనలకు, ఆందోళనాకారులకు గొప్ప విజయమే.

ఈ ఘటన ని తీవ్రంగా నిరసించిన US మిలటరీ డిప్యూటీ సలహాదారు జేమ్స్ మిల్లర్ తన రాజీనామాను రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ కి సమర్పిస్తూ అందులో ఇలా పేర్కొన్నారు.... "అధ్యక్షుడు ట్రంప్ ను ఆ ప్రదేశానికి, చర్చికి వెళ్లకుండా, తన బలగాలతో దాడి చేయించకుండా మనం ఆపలేకపోవచ్చు కానీ.. కనీసం మనం మన వ్యతిరేకతని, భేదాభిప్రాయాన్ని తెలియజేయొచ్చు. కానీ మీరు అలా చేయలేదు. సరికదా ప్రత్యక్షంగా సమర్ధించారు (వాషింగ్టన్ పోస్ట్ ) ఈ పదవుల్ని స్వీకరిచేముందు మనం చేసిన ప్రమాణస్వీకారాల్లో ఏమి చెప్పామో మనం గుర్తుచేసుకుందాం. అమెరికా రాజ్యాంగాన్ని సమర్థిస్తూ.. దాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశాం. మరి ఇప్పుడు జరిగిన చర్య అందుకు భిన్నంగా ఉంది. మనం US రాజ్యాంగం పట్ల నిజాయితీగా విశ్వాసం కలిగివుంటామని,ఎల్లవేళలా నిబద్ధులమై ఉంటామని ప్రకటించాం కదా. మరి రక్షణ శాఖ కార్యదర్శి కూడా ఇదే విధంగా ప్రమాణం చేసేకే తన కార్యాలయంలోకి అడుగుపెట్టి ఉంటారు. రాజ్యాంగం విధించిన పరిమితుల్లోనే మీవైనా, నావైనా విధులు నియంత్రించబడి వుంటాయని నేను విశ్వసిస్తాను. ఇప్పుడు జరిగిన ఈ చర్య రాజ్యాంగాన్ని తోసిపుచ్చి జరిగింది. రాజ్యాంగానికి, మన విధులకి పరిధి ఉందని నా విశ్వాసం. ఇప్పుడు ఆ పరిధి గీతని ఎక్కడినుంచీ గీద్దామో, గియ్యాలో మీరే చెప్పండి మార్క్ ఎస్పర్ ఏమంటారిప్పుడు ? గత రాత్రి సైన్యం చేసిన సిగ్గుమాలిన, బహిరంగంగా చేసిన దాడులు రాజ్యాంగ అతిక్రమణలుగా మీకు అనిపించలేదా ? బహుశా మరికొద్ది రోజుల్లోనే మిగిలిపోయిన మరికొన్ని ఘోర చర్యలను కూడా మీచేత ఒప్పించి అధ్యక్షుడు ట్రంప్ అమెరికా పౌరులకు తప్పక మరింత హాని తలపెడతాడని నాకు తోస్తుంది. అతనిలోని దురహంకారాన్ని ప్రకటించుకోవడానికి చర్చిని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాడు."

అయితే ఎస్పర్ తనకి ఈ విషయం తెలియదని చెబుతున్నాడు. ట్రంప్ బయటకు వెళ్లడం అల్లర్ల వల్ల జరిగిన నష్టాన్ని చూడడానికో, ఆందోళనకారులతో మాట్లాడటానికో కాబోలు అనుకున్నానన్నాడు. ఆఖరుగా మిల్లర్ తన రాజీనామా లేఖలో తన ఆవేదనను, ఆందోళన ని ఇలా వ్యక్తపరిచాడు... "అమెరికా రాజ్యాంగ పవిత్రత, అమెరికా ప్రజల జీవితాలు మీరు ఎంచుకునే మార్గం మీద ఆధారపడి ఉన్నాయి. రాబోయేవి మరింత దుర్భర దినాలు. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను. "

జేమ్స్ మిల్లర్ తన పదవీకాలమంతా ప్రజా పౌర సంబంధమైన విభాగాల్లో పనిచేసి నాలుగుసార్లు అత్యుత్తమ అవార్డుల్ని గెలుచుకున్న విశిష్ట వ్యక్తి. సంక్షోభ సమయాల్లో సైబర్ దాడులు, సమాచార వ్యవస్థ లోని సాంకేతికత, పెద్దఎత్తున విధ్వంసం చేయగలిగే సాంకేతికత మొదలైన రంగాల్లో గొప్ప సేవలు చేశారు. ఇతనెంతగా అమెరికాకి సేవ చేశాడు అనేది ఇక్కడ అంశం కాదు. అమెరికా నిర్మాణంలో ప్రజా పౌర సంక్షేమం పట్ల ఒక నిజాయితీ గల సేవకుడు. అతనికి తన వృత్తి పట్ల , రాజ్యాంగం పట్ల నిబద్ధత ఉంది. అయితే ట్రంప్ తెంపరితనం, జాత్యహంకారం, తన సొంత పౌరుల పైనే శత్రు దేశం మీద దాడులు జరిపే స్థాయిలో విరుచుకుపడటం.. అక్కడి ఒక స్థాయి అధికారుల్లో సైతం కలవరం కలిగిస్తుందంటే కచ్చితంగా " రాబోయేది మరింత దుష్టకాలం" అనుకుంటున్నారంటే.. అక్కడి పీడిత ప్రజలు, నల్లజాతి ప్రజల ఆందోళనలు, అమెరికాకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడుతున్న గ్లోబల్ పోరాటాలు ఏ స్థాయిలో వారిని కలవరానికి గురిచేస్తున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. జేమ్స్ మిల్లర్ రాజీనామా లేఖ "అమెరికన్ సామ్రాజ్యవాదపు స్వగత కలవరం" గా కూడా చూడొచ్చు. అది ప్రపంచ ప్రజల ఏకీకృత పోరాటాల ఫలితమే. మిల్లర్ అన్నట్లుగా సామ్రాజ్యవాదానికి రాబోయేది అక్షరాలా గడ్డుకాలమే. మరణశయ్య మీదనున్న అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని కాటికి చేర్చి తీరాల్సిందే.

(ఈ జేమ్స్ మిల్లర్ కి మన రఘురాం రాజన్ కి చూడ్డానికి దగ్గర పోలికలు ఉన్నాయి... రూపంలోనే కాదు, స్పందనలో కూడాఎవరి వ్యవస్థలకు వాళ్ళు బద్ధులు. వ్యవస్థకు నిబద్ధులుగా ఉన్నా సరే, వాళ్ళని స్టేట్ భరించలేదు, తట్టుకోలేదు. స్టేట్ కి ఎంతసేపూ హిపోక్రసీ, బ్యూరోక్రాసీ, ఫాసిజాన్ని అమలు పరిచే వాళ్లే కావాలి.)
- మోహన సుందరం

Keywords : trump, black lives matter, james miller, USA
(2024-04-25 03:21:09)



No. of visitors : 604

Suggested Posts


20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores It

In one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored....

సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతి

సౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు....

ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్

తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు.....

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ

అమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది.

After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief

His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres....

ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹ

ʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ

మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ప్లాయిడ్ ను కాలుతో తొక్కి చంపిన తెల్ల‌జాతీయుడైన‌ పోలీస్‌ అధికారి డెరెక్ చౌవిన్ భార్య కీలై విడాకులు కోరింది. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చిన‌ చౌవిన్‌తో తను ఇక ఎంత మాత్రమూ కలిసి ఉండలేనని ప్రకటించిన ఆమె తమ‌ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు ఎక్కారు.

Paris Museum Displays Beheaded Africans

There is a museum in Paris with 18 000 human heads of people killed by the french colonial troops and missionaries. Itʹs called Musee d Histoire Naturelle de Paris.

అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావు

మహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు.....

అమెరికాను ఇలా బూడిద చేస్తాం - వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేఅమెరికాకు ఇప్పుడు ఉఅత్తర కొరియా సవాల్ విసురుతోంది. అమెరికా అంటేనే మండిపడే ఉత్తర కొరియా...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రాబోయేవి